Breaking News

కౌంటింగ్‌ సమయంలో అల్లర్లకు కుట్ర!

Published on Mon, 05/20/2024 - 04:22

సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్‌సీపీ బృందం కోరింది. ఈ మేరకు ఆదివారం వెలగపూడి సచివాలయం అడిషనల్‌ సీఈవో కోటేశ్వరరావును కలిసి ఫిర్యాదు అందించారు. అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ తమకు ఓటు వేయలేదనే ఉక్రోషంతో టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా హింసను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. ఆ పార్టీ అభ్యర్థులే రోడ్లపైకొచ్చి దాడులకు తెగ­బ­డుతూ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని చెప్పారు. 

కౌంటింగ్‌ సమయంలోనూ టీడీపీ అల్ల­ర్లను సృష్టించే అవకాశముందని, శాంతిభద్రతల సమస్య తలెత్త­కుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్టు తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ సమయంలో పాటించాల్సిన నిబంధనలను 175 నియోజకవర్గాల్లోనూ తూచా తప్పకుండా పాటించేలా చొరవ తీసుకోవాలని కోరా­మన్నారు. పోలింగ్‌ రోజు దెందులూరు నియో­జకవర్గం కొప్పులవారి­పాలెంలో జరిగిన ఓ దాడి ఘటనలో టీడీపీకి చెందిన రాజశేఖర్‌ను పోలీసులు అదుపులోకి తీసు­కోగా.. టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌ పోలీసుల­పైన దౌర్జన్యం చేశారని, తక్ష­ణమే ఆయనను అరెస్ట్‌ చేసి పీడీ యాక్టు కింద కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. 

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చె­న్నాయుడు పోటీ చేస్తున్న టెక్కలి నియోజకవర్గంలోనూ ఆ పార్టీ అరాచకాలకు ఓ నిండు ప్రాణం బలైందన్నారు. వైఎస్సార్‌సీపీకి చెందిన తోట మల్లేష్‌ ఇంటిపై దాడికి తెగబడి.. అతని చావుకు కారణమ­య్యారని చెప్పారు. దాడులను ప్రోత్స­హించిన అచ్చెన్నాయుడిపైనా కేసు నమోదు చేయాలని కోరినట్టు తెలిపారు. గురజాల, మాచర్ల, నరస­రావుపేట, సత్తెనపల్లి, తాడిపత్రి సహా రాష్ట్రంలో జరిగిన అరాచకాలన్నింటికీ మూలకారణం టీడీపీ నాయకులని మల్లాది విష్ణు ఆరోపించారు. కానీ సిట్‌ను తప్పు­దోవ పట్టించేలా స్థానిక వైఎస్సార్‌­సీపీ అభ్యర్థులపైనే ఫిర్యాదులు చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని, ఈ నేప­­థ్య­ంలో నిష్పక్ష­పాతంగా దర్యాప్తు చేయా­లని సిట్‌ అధికారులను కోరినట్టు వివరించారు.



ఉయ్యూరు లోకేశ్‌ వంటి ఉన్మాదులనుచంద్రబాబు రెచ్చగొడుతున్నారు..
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విదేశీ పర్యటనను ఉన్మాది ఆలోచనలతో అడ్డుకునే కుట్ర చేసినందుకే ఉయ్యూరు లోకేశ్‌ను గన్నవరం విమా­నాశ్రయంలో పోలీ­సులు అరెస్ట్‌ చేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు నీచ మనస్తత్వంతో లోకేశ్‌ వంటి వారిని రెచ్చగొడు­తున్నారని ఆదివారం ఓ ప్రకటనలో మండిపడ్డారు.

 అత్యంత భద్రత మధ్య ఉండే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకో­వాలనే లోకేశ్‌ కుట్ర వెనుక ఎవరి హస్తం ఉందో తేల్చాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ సాను­భూతి­పరుడైన లోకేశ్‌ డాక్టర్‌ అయినప్పటికీ ఉన్మాద మనస్తత్వంతో టీవీ డిబేట్లలో వైఎస్సార్‌సీపీపై విషం చిమ్ముతుంటారని గుర్తు చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటాయపాలేనికి చెందిన ఉయ్యూరు లోకేశ్‌ 38 ఏళ్లుగా అమెరికాలో వైద్యుడిగా పని చేస్తు­న్నారని, ఆయనకు అమెరికా పౌరసత్వం కూడా ఉందని పేర్కొన్నారు.

 శుక్రవారం హైదరా­బాద్‌ నుంచి స్వగ్రామానికి వచ్చారని, ఆ తర్వాత నేరుగా గన్నవరం విమా­నాశ్రయానికి చేరుకుని సీఎం జగన్‌ విదేశీ పర్యటనను అడ్డుకునేందుకు టీడీపీ సాను­భూతిç­³రులకు మెసేజ్‌లు పెట్టినట్టు పోలీసు­లకు ఆధారాలు లభించాయని వెల్లడించారు. 

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)