Breaking News

కేటీఆర్‌ ఏమైనా రకుల్‌​ సినిమాకు సైన్‌ చేసినట్టా..! రేవంత్‌ రెడ్డి ఫైర్‌

Published on Fri, 03/31/2023 - 14:55

సాక్షి, హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ క్రమంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల నియామకంపై.. టీఎస్‌పీఎస్సీ మెంబర్లను విచారించాలని సిట్‌ నిర్ణయించింది. మరోవైపు ఈ కేసులో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ విమర్శలు తారాస్థాయికి చేరాయి. తాజాగా పేపర్‌ లీకేజీకేసులో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. ఈ వ్యవహారంపై విచారణ చేయాల్సిందిగా ఈడీకి గురువారం ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు ఈడీ కార్యాలయం వద్ద రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్‌కు వందకోట్లు ఇస్తే ఎన్నిబూతులైనా తిట్టొచ్చా అని విమర్శించారు. తన పరువు వందకోట్లు అని ఎలా నిర్ధారించాడని ప్రశ్నించారు. కేటీఆర్‌ ఏమైనా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సినిమాకు సైన్‌ చేసినట్టా?.. లేకపోతే సమంత సిరీస్‌కు సంతకం పెట్టినట్టా.. ధర నిర్ణయించి అగ్రిమెంట్‌  చేసుకోవడానికి అని దుయ్యబట్టారు. పబ్లిక్‌ డోమైన్‌లో లేని సమాచారం కేటీఆర్‌కు ఎలా వచ్చిందని నిలదీశారు. 

‘కేటీఆర్‌ ఏం చెప్తున్నారో సిట్‌ అదే చేస్తోంది. కేటీఆర్‌ నీచుడు.. నాకు నోటీసులు ఇచ్చుడేంది. దమ్ముండే పేపర్‌ లీకేజీ కేసును సీబీఐ, ఈడీకి ఇవ్వాలి. ఎవరికి ఎన్ని మార్పులువచ్చాయని కేటీఆర్‌కు ఎలా తెలుసు.. పేపర్‌ దొంగలు ఏమైనా సమాచారం ఇచ్చారా?. లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్నారు. నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వానికి చీమ కుట్టనట్టైనా లేదు. 


ఆధారాలు బయటపెట్టిన ప్రతిపక్షాలను సిట్‌ నోటీసులు ఇస్తుంది. కోట్లు కొల్లగొట్టిన వారిపై చర్యలు తీసుకోవడం లేదు. శంకర్‌ లక్ష్మికి తెలియకుండా ఏం జరగదు. ఆమెను ఏ1 గా చేర్చాలి. విదేశాల్లో ఉన్నవారు కూడా పరీక్షల రాశారు. ఇప్పటి వరకు సీజ్‌ చేసిన వాటి ఈడీ అధికారులు తీసుకోవాలి. పేపర్‌ల లీక్‌పై  సీఎం ఎందుకు  స్పందించడం లేదు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలి. గతంలో కూడా ఇలాగే సిట్‌ ఏర్పాటు చేసి కేసులను పక్కదారి పట్టించారు.’ అని మండిపడ్డారు.

Videos

అనంతపురం జిల్లాలో భారీ వర్షం

నందిగం సురేష్ అరెస్ట్

లిక్కర్ కేసు వెనక కుట్ర.. అడ్డంగా దొరికిన చంద్రబాబు

ఫ్యామిలీతో తిరుమలలో ఎంపీ గురుమూర్తి

పాతబస్తీ అగ్నిప్రమాద ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

ఎంటర్ ది డ్రాగన్.. కరోనా వచ్చేసింది

స్పిరిట్ లో కల్కి జోడి..

ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న రవితేజ..!

కోపముంటే నాపై తీర్చుకో.. ప్రజల్ని ఎందుకు హింసిస్తావ్.. ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై ఫైర్

కూటమి సర్కార్ నిర్లక్ష్యంతో మైనింగ్ లో పని చేసే కార్మికులు రోడ్డున పడ్డారు

Photos

+5

తెలంగాణ సచివాలయంలో అందగత్తెలు

+5

అనసూయ నూతన గృహప్రవేశం.. పూజా కార్యక్రమం (ఫోటోలు)

+5

పాతబస్తీలో పెను విషాదం.. అగ్నిప్రమాద దృశ్యాలు

+5

చెల్లి పెళ్లిలో నటి హరితేజ (ఫోటోలు)

+5

ఎంగేజ్ మెంట్ పార్టీలో 'కొత్త బంగారు లోకం' హీరోయిన్ (ఫొటోలు)

+5

బిగ్ బాస్ అశ్విని బర్త్ డే పార్టీలో పల్లవి ప్రశాంత్ (ఫొటోలు)

+5

చిరుకు జోడీగా నయన్.. ఫస్ట్ టైమ్ ఇలా (ఫొటోలు)

+5

Miss World 2025 : రామోజీఫిల్మ్‌ సిటీలో అందాల కాంతలు..! (ఫొటోలు)

+5

తల్లి కోరిక.. టక్కున తీర్చేసిన విజయ్ దేవరకొండ (ఫొటోలు)

+5

కేన్స్ లో సోనమ్ కపూర్.. అప్పట్లో ఇలా (ఫొటోలు)