Breaking News

‘వివేకా’ కేసు.. బాబు ప్రయోజనాల కోసమే..

Published on Tue, 04/16/2024 - 04:01

కడప కార్పొరేషన్‌: మాజీమంత్రి వైఎస్‌ వివేకా­నందరెడ్డి హత్యకేసు చంద్రబాబు రాజకీయ ప్రయో­జనాల కోసమే ఉపయోగపడు­తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఆర్‌. రమేష్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. కడపలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ కె. సురేష్‌బాబు, డా. చైతన్య­రెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లా­డుతూ.. నిత్యం నీచ రాజకీయాలు చేయ­డమే చంద్రబాబు సంస్కృతి అని, అన్ని వ్యవ­స్థలను ధ్వంసంచేసి తనకు అనుకూలంగా మలు­చు­కోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు.

లక్ష్మీపార్వతిని సాకుగా చూపి ఎన్టీ­ఆర్‌ను వెన్నుపోటు పొడవడమేగాక, ఆయన మర­ణానికి కూడా బాబు కారణమయ్యార­న్నారు. ఎన్నికలొచ్చిన ప్రతిసారీ ఒక కొత్త కూట­మి ఏర్పాటుచేయడం బాబుకు అలవాటుగా మారిందన్నారు. 2014లో నరేంద్ర మోదీ, పవన్‌­కళ్యాణ్‌తో.. 2019లో లోపాయికారిగా జనసేన­తో, ఇప్పుడు బీజేపీ, జనసేనతో పాటు కాంగ్రెస్‌తో లోపాయికారీ ఒప్పందం చేసుకున్నార­న్నారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన అందరి కుటుంబాల్లో చిచ్చుపెడతార­న్నారు. ‘హూ కిల్డ్‌ బాబాయ్‌’ అంటూ కేసును పక్క­దారి పట్టిస్తున్నారని రమేష్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు.

రెండు చానెళ్లు, రెండు పత్రికలైతే అదే­పనిగా సీఎం జగన్, ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలపై బురదజల్లుతూ తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. వైఎస్‌ వివేకా కేసు కోసం రూ.వందల కోట్లు ఖర్చుచేశారని, కోట్ల రూపాయలు వెచ్చించి లూథ్రా అనే ఖరీదైన న్యాయవాదిని నియమించుకున్నారన్నారు. ఇక ‘వివేకం’ అనే సినిమాలో క్యారెక్టర్లను చాలా నీచంగా చూపించడం దారుణమన్నారు. 

అవినాశ్‌ ఎలాంటివారో షర్మిల, సునీతలకు తెలీదా?
ఇక అవినాశ్‌ ఎలాంటి వారో షర్మిల, సునీత ఇద్దరూ చిన్నప్పటి నుంచి చూసి ఉంటారు కదా, వారికి తెలీదా.. ఎప్పుడైనా ఆయనలో నేరప్రవృత్తి గమనించారా.. దౌర్జన్యాలు, రాజకీయ హత్యలు, ఫ్యాక్షన్‌ గొడవలతో ఆయనకు సంబంధం ఉందేమో గుండెలపై చేయివేసుకుని చెప్పా­ల­న్నారు. నిష్కళంకమైన జీవితం గడుపుతున్న అవినాష్‌రెడ్డిపై దుష్ప్రచారం చేయడం సరికా­దని హితవు పలికారు.

వైఎస్‌ జగన్‌ ప్రజాసేవ చేయాలని ఇష్టపడి రాజకీయాల్లోకి వచ్చారని.. ఏ రకమైన ఫ్యాక్షన్‌ను, గొడవలను ఆయన ప్రేరేపించలేదన్నారు. చంద్రబాబుది క్రిమినల్‌ బ్రెయిన్‌ అని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానందరెడ్డిని ఓడించేందుకు రూ.కోట్లు ఖర్చుచేసి చార్టెర్డ్‌ ఫ్లయిట్‌లు పెట్టి ఎంపీటీసీలు, జెడ్పీటీసీ­లను కొనుగోలు చేశారని రమేష్‌రెడ్డి గుర్తు­చేశారు. ఈ ఎన్నికల్లో సుమారు 40 సీట్లను రూ.వందల కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు.

కడప జిల్లాలో కూడా చాలామంది డబ్బులిచ్చి టికెట్లు కొన్నారన్నారు. మరో­వైపు.. షర్మిల, సునీత న్యాయపోరాటం చేస్తు­న్నారో, రాజకీయ పోరాటం చేస్తున్నారో తెలుసు­కోవా­లన్నారు. రాజకీయ పోరాటమైతే కోర్టు తీర్పు వచ్చేవరకూ దయచేసి నోరు విప్పవద్దని ఆయన సూచించారు. ఇక చంద్రబాబు చెబుతున్న ‘సూపర్‌ సిక్స్‌’ ఒక ఫ్లాప్‌సిక్స్‌ అని రమేష్‌­కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీకి ఓటేస్తే కాంగ్రెస్, బీజేపీలకు వేసినట్లేనని తెలిపారు.

సునీతవి అర్థంలేని ఆరోపణలు
డా. చైతన్యరెడ్డి మాట్లా­డుతూ.. డాక్టరేట్‌ పొందిన సునీత అర్థంపర్థం లేని ఆరో­పణలు చేస్తున్నారని మండిపడ్డారు. హత్య జరిగిన రోజు రాత్రి ఏ–1 ఎర్ర గంగిరెడ్డి, వైఎస్‌ అవినాశ్‌రెడ్డి వాట్సాప్‌ కాల్స్‌ చేసు­కు­న్నారని చెప్పడం అబద్ధమ­న్నారు. సీబీఐ చార్జిషీట్‌లో వాట్సాప్‌ చాట్‌లో ఉన్నా­రని చెప్పిందే తప్పా వాట్సాప్‌ కాల్స్‌ అని ఎక్కడా చెప్పలేదన్నారు. ఎన్నికల సమ­యం కాబట్టి వాట్సాప్‌కు మెసేజ్‌లు వస్తూ ఉంటాయని, ఫోన్‌ ఆన్‌చేసి ఉంచితే ఎవరి వాట్సాప్‌ అయినా యాక్టివ్‌లో ఉన్నట్లేనని చెప్పారు. ఇక గూగుల్‌ టేకౌట్‌కు శాస్త్రీయ­త­లేదని, దాన్ని గూగుల్‌ కంపెనీ దానిని సర్టిఫై చేయ­లేదని, న్యాయమూర్తి కూడా అంగీకరించ­లే­దన్నారు. కోర్టులో నేరం రుజువు కాకుండా ఆరోపణలు చేయడం సరికాదని షర్మి­ల, సునీతకు చైతన్యరెడ్డి హితవు పలికారు.

Videos

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

నేపాల్ లో సోనుసూద్.. వరద బాధితులకు అండగా రియల్ హీరో

వేటు పడుద్ది! KC వేణుగోపాల్ తో కొండా సురేఖ భేటీ

ఆపిల్ ల‌వ‌ర్స్‌కు గుడ్‌న్యూస్ ఐఫోన్ 18..కొత్త డేట్ ప్రీ బుకింగ్ ఆర్డ‌ర్ చేసుకోండి

భయపడకండి మీకు నేనున్నా... అంబటి సురేష్ కుటుంబానికి ధైర్యం చెప్పిన జగన్

థియేటర్స్ దందాకు చెక్ Seat వద్దకే ఫుడ్ డెలివరీ..

నేపాల్ నీళ్ల పాలు.. ఊళ్లను ఊడ్చేసిన వరదలు

సర్కార్ పై గులాబీ సమరం

Photos

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)