Breaking News

రాజస్థాన్ సంక్షోభంపై రాహుల్ సమీక్ష.. హుటాహుటిన ఢిల్లీకి వేణుగోపాల్‌

Published on Mon, 09/26/2022 - 11:16

సాక్షి,న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో సీఎం అశోక్ గహ్లోత్‌, సచిన్‌ పైలట్ వర్గీయుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ప్రయత్నిస్తోంది. గహ్లోత్ వర్గానికి చెందిన 92 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయగానే పార్టీ పరిశీలకునిగా వెళ్లిన మల్లికార్జున్‌ ఖర్గే, అజయ్‌ మాకెన్ వారితో ఆదివారం రాత్రి భేటీ అయ్యారు. అయితే గహ్లోత్ వర్గీయులు పైలట్‌కు సీఎం పదవి ఇచ్చేందుకు ససేమిరా అనడంతో ఎలాంటి పురోగతి  లేకుండానే చర్చలు ముగిశాయి. దీంతో ఖర్గే, అజయ్ మాకెన్ తిరిగి ఢిల్లీకి పయనమవుతున్నారు.

మరోవైపు రాజస్థాన్‌లో అనూహ్య పరిణామాలను రాహుల్ గాంధీ సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేరళలో భారత్‌ జోడో యాత్రలో ఉన్న ఆయన.. ఎమ్మెల్యేల రాజీనామా విషయం తెలియగానే హుటాహుటిన కేసీ వేణుగోపాల్‌ను ఢిల్లీకి పంపారు. ఎమ్మెల్యేలను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ అధిష్ఠానం బావిస్తోంది. అసమ్మతి వర్గంలోని ఒక్కో ఎమ్మెల్యేతో కాంగ్రెస్ పరిశీలకులు ప్రత్యేకంగా చర్చించాలని కాంగ్రెస్ అధిష్ఠానం సూచించింది.

అయితే ఎమ్మెల్యేలంతా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తమ ఇళ్లకు వెళ్లారని, ఇవాళ ఎవరితోనూ భేటీ అయ్యే అవకాశం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైవు ఇవాళ సాయంత్రం సోనియా గాంధీతో కాంగ్రెస్ పరిశీలకులు, కేసీ వేణుగోపాల్‌ సమావేశం అవుతారని, ఆ తర్వాత కీలక నిర్ణయం ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న అశోక్ గహ్లోత్‌ సీఎం పదవికి రాజీనామా చేస్తే ఆయన స్థానంలో పైలట్‌ను కొత్త సీఎంగా నియమించాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. అయితే గహ్లోత్ వర్గం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ వర్గానికి చెందిన వారినే సీఎం చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే 92 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం రాష్ట్ర కాంగ్రెస్‌లో సంక్షోభానికి దారితీసింది.

బీజేపీ సెటైర్లు..
ఓ వైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొంటుంటే.. మరోవైపు రాజస్థాన్‌లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చోడో అంటున్నారని బీజేపీ సెటైర్లు వేసింది. దేశాన్ని ఏకం చేయడం కాదు రాహుల్‌, ముందు మీ ఎ‍మ్మెల్యేలను ఏకం చెయ్ అని ఎ‍ద్దేవా చేసింది.
చదవండి: నా చేతుల్లో ఏం లేదు.. అశోక్ గహ్లోత్ కీలక వ్యాఖ్యలు!

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)

+5

డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)