Breaking News

పుంగనూరు అల్లర్లు: ఆ 2 వేల మంది ఎవరు?

Published on Thu, 08/10/2023 - 04:30

సాక్షి, తిరుపతి: పుంగనూరు ఘటనాస్థలిలో శుక్ర­వారం ఉన్న రెండువేల మంది స్థానికేతరులు ఎవ­రు? వారు ఎందుకోసం వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? అదేరోజు అంతమంది అక్కడికి రావలసి­న అవసరం ఏమిటి? ఈ ప్రశ్నలు చిత్తూరు పోలీసు­ల మదిని తొలుస్తున్నాయి. ప్రాజెక్టుల పరిశీలన పేరుతో చంద్రబాబు ఈ నెల 4, 5వ తేదీల్లో చిత్తూరు, తిరుపతి జిలాల్లో పర్యటించిన విషయం తెలిసిందే.

అన్నమయ్య జిల్లా అంగళ్లులో శుక్రవారం గొడవకు కారణమైన చంద్రబాబు.. కొద్ది గంటలైనా గడవకముందే చిత్తూరు జిల్లా పుంగనూరులో మారణహోమానికి కుట్రపన్నారు. ఆ మారణహో­మంలో టీడీపీ శ్రేణులే కాకుండా అల్లరి మూకలు, గూండాలు కూడా పాలుపంచుకున్నారు. టీడీపీ శ్రేణులు కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన వారు రెండువేల మందికిపైగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఆ రోజు ఘటన స్థలంలో దాదాపు ఐదు వేల సిమ్‌ (సెల్‌ఫోన్లు)లు ఆన్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిలో పోలీ­సులు, టీడీపీ శ్రేణులు, స్థానికులు కలిపి మూడువేల మంది వరకు ఉండొచ్చనే నిర్ణయానికి వచ్చారు. వీరుకాకుండా మిగ­తా రెండువేలమందికిపైగా స్థానికేతరులు అక్క­డు­న్నట్లు వారి సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ను బట్టి తెలు­స్తోంది. స్థానికేత­రులు ఇంత పెద్దసంఖ్యలో పుంగనూరు వద్దకు రావలసిన అవసరం ఏమిటనే కోణంలో విచారణ చేపట్టినట్లు విశ్వసనీయ సమాచారం.

పుంగనూరుపై బాబు అక్కసు
సీఎం జగన్‌ ఆదేశాలతో చంద్ర­బాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో మంత్రి పెద్ది­రెడ్డి పల్లెబాట పేరుతో ఊరూరా.. వీధివీధి తిరుగుతూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది, సంక్షేమపథకాల గురించి ప్రజ­ల్లో అవగాహన కల్పిస్తున్నారు. చంద్రబాబు కుప్పా­ని­కి చేస్తున్న ద్రోహం గురించి వివరి­స్తున్నారు. వాస్త­వా­లను గ్రహించిన కుప్పం వాసుల్లో మార్పు మొద­లైం­ది.

మొన్నటి మున్సిపల్‌ ఎన్నికలే ఇందుకు నిదర్శ­నం. ఈ పరిణామాలను గమనించిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో కుప్పంలో ఓటమి తప్ప­దనే భయంతో సీఎం వైఎస్‌ జగన్‌ను, మంత్రి పెద్దిరెడ్డిని టార్గెట్‌ చేశారు. ఇందులో భాగంగా పుంగనూరులో పర్యటించి అలజడి సృష్టించాలని నిర్ణ­యి­ంచుకున్నా­రు. అయితే స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పోలీసులు అను­మతి ఇవ్వలేదు.

అం­దుకు గల ప్రధాన కారణం.. పడమటి ప్రాంతాల సాగు, తాగునీటి అవసరాల కోసం ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఆవులపల్లి, నేతి­గుంటపల్లి, ముది­వేడు రిజర్వాయర్లను చంద్ర­బాబు అండ్‌ కో అడ్డుకున్నారు. కోర్టు నుంచి స్టే తీసు­కు­రావటంపై స్థానికులు జీర్ణించుకోలేకపోతు­న్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వస్తే నిలదీ­యా­­ల­ని నిర్ణయించుకున్నారు. ఈ విష­యం చంద్ర­బాబు అండ్‌ కోకూ తెలుసు. ఇదే అదనుగా చంద్ర­బాబు మారణ­హోమానికి పథకం వేసినట్లు తెలిసింది.

రైతు వినతితో భగ్గుమన్న బాబు
మూడు రిజర్వాయర్లపై వేసిన కేసును వెనక్కు తీసు­కోమని ఉమాపతిరెడ్డి అనే రైతు అంగళ్లు వద్ద చంద్రబాబుకు వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయ­త్నం చేశారు. ఇదే అవకాశంగా చేసుకున్న చంద్ర­బాబు ఉమాపతిరెడ్డిని నానా బూతులు మాట్లాడి, టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టారు. ‘తరమండిరా.. కొట్టండిరా నా కొడుకులను..’ అంటూ హుకుం జారీచేశా­రు. అధి­నేత ఆదేశాలతో టీడీపీ గూండా­లు రెచ్చి­పోయారు. అక్కడి నుంచే పుంగనూరు వద్ద వేచి ఉన్న టీడీపీ నేతలు, కిరాయి గూండాలకు సమా­చారం ఇచ్చారు. అల్లరిమూకలు బాబు రాగానే రెచ్చిపోయాయి.

ముందు రోజే మదనపల్లిలో తిష్ఠ
విధ్వంసానికి ముందు రోజు రాత్రే అంతే గురు­వారం రాత్రి టీడీపీ గూండాలు మదనపల్లికి చేరు­కు­న్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ రాత్రి నుంచి 4వ తేదీ ఉదయం 9 గంటల వరకు మదన­పల్లిలో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన షెల్టర్‌­లలో ఉన్నారు. రాత్రి, ఉదయం మద్యం సేవిస్తూ గడిపారు. ఉదయం 9 గంటలకు టీడీపీ నేతల నుంచి సమాచారం రావటంతో మదన­పల్లి నుంచి పుంగనూరు వద్దకు వెళ్లారు.

సాయంత్రం వరకు వేచి చూసి టీడీపీ నేతల ఆదేశాల మేరకు విధ్వంసానికి పూనుకున్నారు. టీడీపీ శ్రేణులు కాకుండా అద్దె గూండాలే రెండు వేల మందికి పైగా ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తు­­న్నారు. వీరంతా కర్ణాటక, తమిళ­నాడుకు చెందిన వారా? ఏపీకి చెందిన వారా? అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ఈ రెండు వేల మంది గురించి ఎక్కడా, ఎవ్వరికీ అనుమా­నం రాకుండా టీడీపీ శ్రేణులు సాయంత్రం వరకు జాగ్రత్తలు తీసుకుని విధ్వంసాన్ని అమలు చేశారు. అయితే పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించటంతో టీడీపీ లక్ష్యం నెరవేరలేదు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)