Breaking News

పవన్‌ ప్యాకేజీ రూ.1,400 కోట్లు పైనే..

Published on Sun, 10/08/2023 - 04:58

సాక్షి ప్రతినిధి, కాకినాడ: జనసేన అధినేత పవన్‌­కళ్యాణ్‌కు ఇంతవరకు వివిధ రూపాల్లో రూ.1,400 కోట్లకు పైగానే ప్యాకేజీ అందిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆరోపించారు. రాజకీయ పొత్తుల వ్యవహారంలో భాగంగానే ఆయన ఈ సొమ్ము అందుకున్నా­రని.. ఈ మొత్తాన్ని ఇప్పటికే హవాలా ద్వారా పవన్‌ బినామీలకు చేరిందన్నారు. కాకినాడలో శనివారం ద్వారంపూడి మీడియాతో మాట్లాడుతూ చంద్ర­బాబుతో పవన్‌­కళ్యాణ్‌ ప్యాకేజీ మాట్లాడుకుని పెద్దఎత్తున సొమ్ములు తీసుకున్నారని తాను చేస్తున్న ఆరోప­ణలకు ఇప్పటికీ, ఎప్పటికీ కట్టుబడే ఉంటా­నన్నారు. అలా వచ్చిన రూ.1,400 కోట్లను రష్యా, దుబాయ్, సింగపూర్‌ వంటి దేశాలకు తర­లించేశా­రన్నారు.

ఇందుకు సంబంధించిన సమగ్ర సమాచారం కేంద్ర ప్రభుత్వం వద్ద ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టు­కుని బీజేపీని కూడా కలుపుకుని వెళ్తామని పవన్‌ పదేపదే చెబుతుండటం వెనుక పెద్ద కారణమే ఉందన్నారు.  ఇక వచ్చే ఎన్నికల్లో తనపై కాకినాడ సిటీలో గ్లాస్‌ గుర్తుపై అభ్యర్థిని పోటీలో పెట్టలేకపోతే ఆ క్షణాన్నే పవన్‌ రాజకీయంగా ఓటమి చెందినట్లు భావి­స్తానని ఎమ్మెల్యే ద్వారంపూడి స్పష్టంచేశారు. వచ్చే ఎన్నికల్లో సీఎం వైఎస్‌ జగన్‌­మోహన్‌­రెడ్డి రెండోసారి ప్రమాణస్వీకారం చేయడం, ఆ తరు­వాత టీడీపీ శాశ్వతంగా మూతపడ­డం రెండూ ఒకేసారి జరుగుతాయని ద్వారం­పూడి చెప్పారు.

వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో చంద్ర­బాబును మించిన ఘనుడు దేశంలోనే మరొకరు లేరని.. అలాంటిది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వ్యవస్థ­లను మేనేజ్‌ చేస్తోందంటూ లోకేశ్‌ విమర్శించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవా చేశారు. చీకట్లో చిదంబరం వంటి నేతలను కల­వ­డం, నిన్నమొన్నటి వరకు దేశ అత్యున్నత న్యాయ­స్థానంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తితో సంబంధాలు.. వెంకయ్యనాయుడు వంటి వ్యక్తు­లతో సాగిం­చిన చీకటి రాజకీయాలు  ప్రజలకు తెలియ­నివి కావన్నారు. ఇంతకాలం వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ వచ్చిన చంద్రబాబుకు ఇప్పుడు పరిస్థితులు కలిసి రాకపోవడంలేదనే అక్కసుతోనే  లోకేశ్‌ ఈ రకమైన విమర్శలు చేస్తున్నారని ద్వారంపూడి మండిపడ్డారు.

బాబుకు ఇక అధికారం దక్కదు 
మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌
అనకాపల్లి టౌన్‌: చంద్రబాబు తన జీవితకాలంలో మళ్లీ అధికారంలోకి రాలే­రని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ చెప్పారు. మండలంలోని మార్టూరు గ్రామంలో ‘ఏపీకి జగన్‌ కావాలి’ కార్యక్రమ సన్నాహక సమావేశం వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పెదిశెట్టి గోవింద ఆధ్వర్యంలో శనివారం జరిగింది. మంత్రి మాట్లాడుతూ నవంబర్‌ 1 నుంచి ఈ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

చంద్రబాబు 14ఏళ్లు సీఎంగా ఉండి రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజం చేకూర్చలేదన్నారు. అదే సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీల్లో 98 శాతం అమలుచేశారన్నారు. చంద్రబాబు వివిధ నేరాల్లో ఇరుక్కుని జైలుకు వెళ్లాడని, ఈ విషయాన్ని న్యాయస్థానం కూడా నమ్ముతోంది కాబట్టే ఆయనకు బెయిల్‌ ఇవ్వటంలేదన్నారు. ఇక పవన్‌కళ్యాణ్‌కు పార్టీ నడిపే దమ్ములేదని, ఒంటరిగా పోటీచేసే సత్తాలేదని అందుకే టీడీపీతో పొత్తుకు వెంపర్లాడుతున్నారని అమర్‌నాథ్‌ విమర్శించారు. 

ప్రజలనే అవినీతిపరులంటావా?
పవన్‌పై డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఫైర్‌
కార్వేటినగరం(చిత్తూరు జిల్లా): స్కిల్‌ స్కాంలో అడ్డంగా దొరికి జైలుపాలైన చంద్రబాబు అవినీతిపరుడు కాదని, అమాయకులైన ప్రజలే అవినీతిపరులంటున్న పవన్‌కళ్యాణ్‌కు ప్రజాకోర్టులో పరాజయం తప్పదని ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి అన్నా­రు. శనివారం ఆర్కేవీబీపేటలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఒక అవినీతి చక్రవర్తి అని, ప్రజాధనాన్ని దోచుకున్న ఆయన్ను అరెస్ట్‌ చేస్తే దత్తపుత్రుడు రోడ్లపై దొర్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు అరెస్టుపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు అరెస్ట్‌కు, కాంగ్రెస్‌లో ఉన్న రేణుకాచౌదరికి సంబంధమేంటని ప్రశ్నిం­చారు. తన తండ్రి ఎన్టీఆర్‌ మృతికి చంద్రబాబే కారణమన్న పురందేశ్వరి.. నేడు చంద్రబాబు అరెస్ట్‌తో మరిదిపై ప్రేమ వలకబోస్తున్నారని ధ్వజమెత్తారు. పురందేశ్వరి, తన భర్త వేంకటేశ్వరరావులు తెలుగుదేశాన్ని వదిలి బీజేపీలో ఎందుకు చేరారో చెప్పాలని ప్రశ్నించారు. 

తప్పు చేస్తే.. చట్టం ఎవరినీ వదలదు
మంత్రి ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ):
తప్పు చేస్తే చట్టం ఎవరినీ వద­లదని, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల విచారణలోనే ముందుగా చంద్రబాబు బాగో­తం బట్టబయ­లయిందని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. బాబుపై అక్రమంగా కేసు నమోదు చేశామని ఎల్లో మీడియా గగ్గోలు పెడుతుందని, కేంద్ర ప్రభు­త్వ దర్యాప్తు సంస్థలే బాబు అవినీతి­పరు­డని తేల్చాయ­న్నారు. శ్రీకాకుళంలోని డీసీసీబీ కాలనీలో శనివారం వైఎస్సార్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి మాట్లాడారు.

చంద్రబాబు కొన్ని షెల్‌ కంపెనీలు సృష్టించి డబ్బులు దోచుకున్నాడని చెప్పారు. అవినీతిలో ముఖ్య­పాత్ర పోషించిన చంద్ర­బాబు, లోకేశ్‌ పీఏలు  ఇద్దరూ అమె­రికాకు పారి­­పో­యారని తెలి­పారు. అవి­నీతి ఆరోపణ­లు ఎదుర్కొన్న మాజీ సీఎంలు జయలలిత, లాలూ ప్రసాద్‌యాదవ్‌ తదితరులంతా కోర్టుల ముందు నిల­బడినవారేనని, బాబు ఏమైనా పైనుంచి దిగొచ్చారా..  అని ప్రశ్నించార­‡ు.

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)