సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఏబీఎన్ రాధాకృష్ణ.. చంద్రబాబు బినామీ: నారాయణ స్వామి
Published on Thu, 08/11/2022 - 13:54
సాక్షి, చిత్తూరు: ఏబీఎన్ రాధాకృష్ణ.. చంద్రబాబు బినామీ అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏబీఎన్ రాధాకృష్ణ, చంద్రబాబు ఇద్దరూ దొంగలేనని ధ్వజమెత్తారు. ఎంపీ గోరంట్ల మాధవ్పై తప్పుడు వీడియోలు ప్రసారం చేశారని, రాజకీయ లబ్ధి కోసమే జరిగిందన్నారు. ఆ వీడియో ఇప్పుడు ఫేక్ అని తేలిందన్నారు. చంద్రబాబుతో కలిసి రాధాకృష్ణ ఎన్ని కుట్రలు చేసినా ఉపయోగం ఉండదన్నారు.
చదవండి: అందుకే వారికి కడుపు మంట: సీఎం జగన్
బీసీలకు చంద్రబాబుతో పాటు రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. తన గురించి తప్పుడు కథనాలు ప్రసారం చేసిన రాధాకృష్ణ నా సవాల్ స్వీకరించలేదన్నారు. ఏబీఎన్ రాధాకృష్ణకు దమ్ముంటే ఇప్పటికైనా తన సవాల్ స్వీకరించాలని నారాయణస్వామి అన్నారు.
#
Tags