లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం
Breaking News
మంగళగిరి పోలింగ్ బూత్లో పవన్ ఓవరాక్షన్
Published on Mon, 05/13/2024 - 10:19
గుంటూరు, సాక్షి: జనసేన పార్టీ అధినేత, నటుడు పవన్ కల్యాణ్ ఓవరాక్షన్కు దిగారు. సోమవారం ఉదయం తన భార్య అన్నా లెజినోవాను, కొందరు అనుచరులను వెంట పెట్టుకుని పోలింగ్ సెంటర్లోకి తీసుకెళ్లి హల్ చల్ చేశారు.
మంగళగిరిలోని శ్రీ లక్ష్మి నరసింహ కాలనీలో 197వ బూత్లో పవన్ ఓటేసేందుకు వచ్చారు. ఆ సమయంలో తన భార్యను వెంటపెట్టుకుని బూత్లోకి తీసుకెళ్లారు. అలాగే.. అక్కడ సెంటర్లో ఓటే లేని అనుచరుల్ని వెంట తీసుకెళ్లారు. బూత్లో కలియ దిరుగుతూ ఫొటోలకు ఫోజులిచ్చారు. పవన్ భార్య అన్నా లెజినోవాకు సైతం అక్కడ ఓటు లేదని సమాచారం. అయినా అధికారులు వాళ్లను లోపలికి ఎలా అనుమతించారా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు కొందరు.
మరోవైపు పవన్ అలా వాళ్లందరినీ లోపలికి తీసుకెళ్తుంటే.. క్యూ నిల్చున్న కొందరు ఓటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే అక్కడే ఉన్న పోలింగ్ సిబ్బంది ఆ అభ్యంతరాల్ని పట్టించుకోకపోవడం గమనార్హం.
Tags : 1