Breaking News

అమెరికాలో మంచిర్యాల యువకుడు మృతి

Published on Tue, 01/03/2023 - 15:40

అమెరికాలో గత ఏడాది డిసెంబర్‌ 31న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల రెడ్డికాలనీకి చెందిన పెండ్యాల సుబ్రహ్మణ్యం, జ్యోతి దంపతుల కుమారుడు వంశీకృష్ణ(36) మృతి చెందాడు. పదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లిన అతను ఆరిజోనా స్టేట్‌లోని ఫోనిక్స్‌సిటీలో ఉంటూ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. 31న రాత్రి స్నేహితులతో న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకొని రూమ్‌కి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

అమెరికాలోనే ఉంటున్న మృతుడి సోదరి పద్మ దంపతులు ఘటనా స్థలానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. వంశీకృష్ణ మృతదేహాన్ని ఇండియాకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నా.. మంచు అధికంగా ఉండడం వల్ల విమానాలు తగిన సంఖ్యలో నడవడం లేదని తెలిసింది. మృతదేహం మంచిర్యాల చేరేందుకు వారం రోజులు పట్టే అవకాశం ఉందని అంటున్నారు. అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి మృతదేహాన్ని త్వరగా పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని మృతుడి తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Videos

అనంతపురం జిల్లాలో భారీ వర్షం

నందిగం సురేష్ అరెస్ట్

లిక్కర్ కేసు వెనక కుట్ర.. అడ్డంగా దొరికిన చంద్రబాబు

ఫ్యామిలీతో తిరుమలలో ఎంపీ గురుమూర్తి

పాతబస్తీ అగ్నిప్రమాద ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

ఎంటర్ ది డ్రాగన్.. కరోనా వచ్చేసింది

స్పిరిట్ లో కల్కి జోడి..

ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న రవితేజ..!

కోపముంటే నాపై తీర్చుకో.. ప్రజల్ని ఎందుకు హింసిస్తావ్.. ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై ఫైర్

కూటమి సర్కార్ నిర్లక్ష్యంతో మైనింగ్ లో పని చేసే కార్మికులు రోడ్డున పడ్డారు

Photos

+5

23వ 'జీ సినీ అవార్డ్స్'.. ముంబైలో మెరిసిన స్టార్‌ హీరోయిన్స్‌ (ఫోటోలు)

+5

విజయవాడలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (ఫొటోలు)

+5

ట్యాంక్‌ బండ్‌పై అట్టహాసంగా ప్రారంభమైన సండే ఫండే వేడుకలు (ఫొటోలు)

+5

వరంగల్ : సరస్వతీ పుష్కరాలకు పోటెత్తిన భక్తులు..(ఫొటోలు)

+5

తెలంగాణ సచివాలయంలో అందగత్తెలు

+5

అనసూయ నూతన గృహప్రవేశం.. పూజా కార్యక్రమం (ఫోటోలు)

+5

పాతబస్తీలో పెను విషాదం.. అగ్నిప్రమాద దృశ్యాలు

+5

చెల్లి పెళ్లిలో నటి హరితేజ (ఫోటోలు)

+5

ఎంగేజ్ మెంట్ పార్టీలో 'కొత్త బంగారు లోకం' హీరోయిన్ (ఫొటోలు)

+5

బిగ్ బాస్ అశ్విని బర్త్ డే పార్టీలో పల్లవి ప్రశాంత్ (ఫొటోలు)