Breaking News

దీర్ఘకాలిక ఇంధన భాగస్వామ్యం

Published on Fri, 06/05/2026 - 04:02

న్యూఢిల్లీ: తమ పరస్పర అనుకూలతల ఆధారంగా దీర్ఘకాలిక ఇంధన భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని భారత్, వెనెజువెలా దేశాలు నిర్ణయించుకున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్‌ గురువారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. అరుదైన ఖనిజాలు, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయం, అటోమొబైల్స్‌ వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. 

ఐదు రోజుల భారత పర్యటన కోసం డెల్సీ రోడ్రిగ్స్‌ బుధవారం ఢిల్లీకి చేరుకున్నారు. భారత్‌తో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యంగా పర్యటన ఆరంభించారు. పశి్చమ ఆసియా సంక్షోభం కారణంగా ఇంధన సరఫరాకు అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో ముడి చమురు సేకరణను వైవిధ్యపరచాలని భారత్‌ భావిస్తోంది. ఈ తరుణంలో చమురు సంపన్న వెనెజువెలా అధ్యక్షురాలు భారత్‌లో అడుగుపెట్టడం విశేషం.

 వెనెజువెలా నుంచి ముడి చమురు కొనుగోళ్లు ఇప్పటికే ఊపందుకున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం, రాబోయే రోజుల్లో ఇంధన మార్కెట్‌లో స్థిరమైన కొనుగోలుదారుగా ఉండడం వంటి కారణాలతో భారత్‌ను ప్రాధాన్యత కలిగిన ఇంధన భాగస్వామిగా పరిగణిస్తున్నామని డెల్సీ రోడ్రిగ్స్‌ వెల్లడించారు. ఈ ఇంధన సంబంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని ప్రధాని మోదీ బదులిచ్చారు. ఇరువురు నేతల మధ్య ప్రధానంగా ఇంధన భాగస్వామ్యం ఏర్పాటుపైనే చర్చ జరిగినట్లు సమాచారం.

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)