Breaking News

మోదీ, అమిత్ షా ఇలాఖాలో దాడులు.. సంజయ్‌ రౌత్‌ సంచలన వ్యాఖ్యలు

Published on Sun, 04/17/2022 - 14:47

సాక్షి, ముంబై: కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్‌పై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి సందర్బంగా చోటుచేసుకున్న ఘర్షణలపై రౌత్‌.. ‘సామ్నా’ పత్రిక వేదికగా స్పందించారు. ఈ క్రమంలో బీజేపీ వ్యూహాలను ఎండగట్టారు.

కాగా, దేశంలో మ‌త‌క‌ల్లోలాల‌ను రేకెత్తించి, ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొందాల‌న్న‌దే బీజేపీ వ్యూహ‌మ‌ని సంజయ్‌ రౌత్‌ ఆరోపించారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఖర్గోన్‌లో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను చూసి శ్రీరాముడే విసుగెత్తిపోయాడ‌ని ఎద్దేవా చేశారు. పండుగ సంద‌ర్భంగా చెల‌రేగిన హింస‌ శ్రీరాముడి ఆలోచ‌న‌కే వ్య‌తిరేక‌మ‌ని అన్నారు. రామ మందిర ఉద్య‌మాన్ని మ‌ధ్య‌లోనే నిలిపేసిన వారే, ఇప్పుడు శ్రీరాముడి పేరుతో క‌త్తులు దూస్తున్నార‌ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా మ‌తక‌ల్లోలాల‌ను రేకెత్తించి రాజకీయ పబ్బం గడుపుతున్నారని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

ఈ సందర్బంగానే కొన్నేళ్ల క్రితం శ్రీరామ న‌వమి వేడుక‌లు సంస్కృతికి వార‌ధిగా ఉండేవ‌ని, ఇప్పుడు మ‌త విద్వేషాల‌కు రెచ్చగొట్టేందుకు వేదిక అయ్యాయని విమ‌ర్శించారు. ఇలాంటి ప‌నులు శ్రీరాముడి ఆలోచ‌న‌ల‌కే విరుద్ధ‌మ‌ని తెలిపారు. ‘అస‌లు శ్రీరామ‌నవ‌మి రోజు ఎందుకు హింస జ‌రిగింది? ప్ర‌ధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సొంత ఇలాఖా అయిన గుజ‌రాత్‌లో శ్రీరామ న‌వమి యాత్ర‌పై ముస్లింలు దాడి చేస్తార‌ని ఎవ‌రైనా న‌మ్ముతారా?’ అంటూ సంజ‌య్ రౌత్ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే నవమి రోజున దేశంలోని వివిధ ప్రాంతాల్లో మత ఘర్షణలను ప్రస్తావిస్తూ, ఇది మంచి సంకేతం కాదని రౌత్ పేర్కొన్నారు. అలాగే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాక్రే బీజేపీ ఎజెండాను అమలు చేస్తున్నారని రౌత్ ఆరోపించారు.


 

Videos

Kannababu: చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి.. చేతలు ఇళ్లు దాటవు

జోగి రమేష్ భార్య, కుమారులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Price Hikes: కొండెక్కిన చికెన్ ధర

Kakinada: YSRCP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్

బ్యానర్ల ముసుగులో తనపై హత్యాయత్నం చేశారన్న గాలి జనార్దన్ రెడ్డి

Bhogapuram: అభివృద్ధి సంకల్పం ఆ ఘనత జగన్ దే

చంద్రబాబు నివాసమున్న జిల్లాలోనే మహిళలపై పెరిగిన 11 శాతం నేరాలు

ఇంజనీరింగ్ నిపుణులే షాక్ అయ్యేలా అమరావతిలో భారీ దోపిడీ

AP: సైబర్ దొంగలు కోటి 23 లక్షలు కొట్టేశారు

Perni Nani: చిరంజీవి పెట్టిన బిక్ష

Photos

+5

నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ దుబాయి ట్రిప్ (ఫొటోలు)

+5

కొడుకుతో ట్రిప్ వేసిన వరుణ్ తేజ్-లావణ్య (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఈ గుహలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కొత్త ఏడాది జోష్‌..జనసంద్రమైన విశాఖ బీచ్ (ఫొటోలు)

+5

ప్రభాస్ ‘ది రాజా సాబ్’HD మూవీ స్టిల్స్‌

+5

కొత్త ఏడాది వేడుకలు.. తన ఉద్యోగులతో జరుపుకున్న అల్లు అర్జున్‌ (ఫోటోలు)

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)

+5

బీచ్‌లో భర్తతో కలిసి అనసూయ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

అక్కాబావా.. అన్నా-వదినలతో కోహ్లి.. భార్యతో ధోని సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)