Breaking News

మా నాన్నను కాపాడండి.. రోగి ప్రాణం తీసిన 108.. ఎలాగో తెలుసా?

Published on Sat, 11/26/2022 - 15:40

ఆపదలో మనుషుల ప్రాణాల కాపాడే 108 వాహనమే ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. అంబులెన్స్‌ సిబ్బంది నిర్లక్ష్యమే ఇందుకు కారణమైంది. ఈ ఘటనపై సీరియస్‌ అయిన అధికారులు విచారణకు ఆదేశించారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని బన్స్వారాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, ధనాపూర్‌ ప్రాంతానికి చెందిన తెజియా(40) పొలం పనులు చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో, ఆందోళన చెందిన తెజియా కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్‌ తజియాను తీసుకుని సమీప ఆసుపత్రికి బయలుదేరింది. కాగా, కొంత దూరం వెళ్లాక రత్లం రోడ్ టోల్ ప్లాజా వద్ద అకస్మాత్తుగా సడెన్‌గా అంబులెన్స్‌ ఆగిపోయింది. దీంతో, అంబులెన్స్‌ ఎందుకు ఆగిపోయిందని తజియా కుటుంబ సభ్యులు ఆగడంతో డీజిల్‌ అయిపోయిందని చెప్పాడు. 

ఈ క్రమంలో తజియా ప్రాణాలు కాపాడేందకు రోగి కుమార్తె, అల్లుడు అంబులెన్స్‌ను ఒక కిలోమీటరు దూరం నెట్టారు. పెట్రోల్‌ బంక్‌ రాగానే బాధితులు అంబులెన్స్‌లో రూ.500 కొట్టించినట్టు పేర్కొన్నారు. అయినప్పటికీ అంబులెన్స్‌ స్టార్ట్‌ కాకపోవడంతో మరో అంబులెన్స్‌కు ఫోన్‌ చేయగా గంట తర్వాత వచ్చిందనన్నారు. దీంతో, హుటాహుటిన తజియాను ఆసుపత్రికి తరలించగా.. అతడిని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు నిర్దారించారు. ఈ క్రమంలో తజియా కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. 

ఈ అంబులెన్స్‌ ఘటన స్థానికంగా చర్చనీయాంశం కావడంతో వైద్యశాఖ అధికారులు చర్యలకు దిగారు. ఈ ఘటనపై సీఎంహెచ్‌వో స్పందిస్తూ.. విచారణ ప్రారంభించాము. తాము బాధితుడి బంధువులను కలవనున్నట్టు తెలిపారు. 108ని ప్రైవేట్ ఏజెన్సీ నిర్వహిస్తోంది. అంబులెన్స్‌ల నిర్వహణ బాధ్యత వారిదే. విచారణ జరుగుతోందని స్పష్టం చేశారు. 

Videos

నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ పేరు

కేటీఆర్, హరీష్రరావు ఇంటికి వెళ్లి ఈ లేఖ తయారుచేశారు

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ రాజీనామా ?

తమన్నా అవసరమా.. కర్ణాటకలో కొత్త వివాదం

Vijayawada: వల్లభనేని వంశీ విజువల్స్

వైఎస్ఆర్ సీపీ కార్యకర్త హరికృష్ణకు CI భాస్కర్ చిత్రహింసలు

కసిగట్టిన కరోనా మళ్లీ వచ్చేసింది!

MDU Operators: కరోన లాంటి కష్టకాలంలో కూడా ప్రాణాలకు తెగించి కష్టపడ్డాం..

Rachamallu Siva Prasad: చంద్రబాబు మార్క్ లో చెప్పుకోవడానికి ఏమీ లేదు..

ప్రజలకు ఎంతో సహాయపడ్డాం.. ఇప్పుడు మమ్మల్ని రోడ్డున పడేశావు

Photos

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)