Breaking News

ఒడిశా రైలు ప్రమాదం: ‘ ట్రైన్‌ టాయిలెట్‌లో ఉన్నాను... ఒక్క కుదుపుతో..’

Published on Mon, 06/05/2023 - 10:44

‘అప్పుడు నేను పడుకున్నాను. ఇంతలో రైలు పట్టాలు తప్పింది. నాపైన 10 మంది ప్రయాణికులు పడిపోయారు. ఎలాగోలా లేచి కోచ్‌ బయటకు వచ్చేశాను. అక్కడ మనుషుల తెగిపడిన శరీర భాగాలు కనిపించాయి. ప్రయాణికుల ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి’ రైలు ప్రమాద బాధితుడు మొహమ్మద్‌ అకీబ్‌ ఆవేదనతో మీడియా ముందు మాట్లాడిన మాటలు ఇవి.  

కాగా కోరమండల్‌ ఎక్స్‌ ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సంజయ్‌ ముఖియా ప్రమాదం జరిగిన సమయంలో టాయిలెట్‌లో ఉన్నారు.  ప్రమాదం నుంచి బయట పడిన సంజయ్‌ ముఖియా మీడియాతో మాట్లాడుతూ ‘టాయిలెట్‌లో ఉన్న నాకు పెద్ద పెద్ధ శబ్ధాలు వినిపించాయి. కుదుపులు కూడా వచ్చాయి. మేముంటున్న బోగీ పక్కకు పడిపోతున్నట్లు అనిపించింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటపడ్డాను’ అని తెలిపారు. సంజయ్‌ ముఖియా బీహార్‌లో కూలిపనులు చేస్తూ, కుటుంబాన్ని పోషిస్తుంటాడు.

ప్రమాద బాధితుడు అనుభవ్‌ దాస్‌ ట్విట్టర్‌లో తన అనుభవాన్ని తెలియజేశారు. ‘నేను పట్టాలపై 200 నుంచి 250 వరకూ మృతదేహాలు పడివుండటాన్ని చూశాను. ఈ హృదయవిదారక దృశ్యాన్ని నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేను. ఇది అత్యంత భారీ  రైలు ప్రమాదం’ అని దానిలో పేర్కొన్నారు.  ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం (జూన్‌ 2) జరిగిన రైలు ప్రమాదంలో ఇప్పటివరకూ 270కిపైగా ప్రయాణికులు మరణించారు. మూడు రైళ్లు ఢీకొన్న నేపధ్యంలో కొన్ని సెకెన్ల వ్యవధిలోనే ఘోరం చోటుచేసుకుంది.

చదవండి: ఒడిశా రైలు ప్రమాదం: బోగీలో నుంచి పిల్లలను బయటకు విసిరేసి...

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)