COVID-19: పిల్లలను స్కూళ్లకు పంపొద్దు: కర్నాటక ప్రభుత్వం

Published on Sun, 06/01/2025 - 09:06

బెంగళూరు: దేశమంతటా కోవిడ్‌-19 కేసులు(Covid-19 cases) పెరుగుతున్న దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలలకు నూతన మార్గదర్శకాలను జారీచేసింది. కోవిడ్‌ కేసులు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఎవరైనా పిల్లలు జ్వరం, దగ్గు లేదా జలుబు లాంటి లక్షణాలతో బాధపడుతుంటే వారిని తల్లిదండ్రులు పాఠశాలలకు పంపవద్దని కోరింది.

ఈ ప్రకటన విడుదల చేసిన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ  రాష్ట్రంలోని విద్యా సంస్థలలో(educational institutions) ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని అరికట్టే లక్ష్యంతో ఇటువంటి నిర్ణయం తీసుకుంది.  విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడటమే ధ్యేయంగా ఈ ప్రకటనను వెలువరించింది. ఫ్లూ లాంటి లక్షణాలు కలిగిన విద్యార్థులు పాఠశాలలకు రావద్దని, ఇంట్లోనే ఉంటూ తగిన వైద్య సంరక్షణ పొందాలని  తెలిపింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన కోవిడ్‌-19 సమీక్షా సమావేశం  అనంతరం పాఠశాలలకు ఈ ఆదేశాలను జారీ చేశారు.

చిన్నారులలో జ్వరం, దగ్గు, జలుబు(Fever, cough, cold) లేదా ఇతర లక్షణాలు గమనించినప్పుడు వారి తల్లిదండ్రులు తమ చిన్నారులకు తగిన చికిత్స అందించి, కోలుకున్నాకనే పాఠశాలలకు పంపించాలని ప్రభుత్వం సూచించింది. మరోవైపు పాఠశాలల్లో కోవిడ్-19 వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, హ్యాండ్ శానిటైజర్‌లను ఉపయోగించడం, మాస్క్‌లు ధరించడం శ్వాసకోశ పరిశుభ్రతను పాటించడం లాంటివి అమలు చేయాలని సూచించింది. కర్ణాటకలో 230కి పైగా కోవిడ్‌-19 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఆరోగ్య అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.  మరోవైపు దేశంలో కోవిడ్-19 కేసులలో క్రమంగా పెరుగుదల కనిపిస్తోంది. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో అత్యధిక సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.

ఇది  కూడా చదవండి: ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు.. పాక్‌తో సంబంధాలపై ఆరా

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)