Breaking News

అమ్మా, తిరిగి వస్తానో లేదో.. రెస్క్యూ ఫ్లైట్‌ పైలట్ ఆవేదన వైరల్‌

Published on Wed, 03/11/2026 - 17:14

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా దాడులు, ఇరాన్‌ ప్రతి దాడుల మధ్య మధ్యప్రాచ్యంలో తీవ్ర అనిశ్చితి ఏర్పడింది.  భారత విమాన యాన సంస్థలు , గల్ఫ్ విమానయాన సంస్థలు విస్తృతంగా విమానాలను రద్దు చేశాయి.  

ఫిబ్రవరి 28-మార్చి 5 మధ్య భారతదేశం-మధ్యప్రాచ్య మార్గాల్లో 1,770 విమానాలు రద్దయ్యాయి. అనేక మంది ప్రయాణీకులు అక్కడ చిక్కుకుపోయారు. అయితే వీరిని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఈ క్రమంలో ఫరీదాబాద్‌కు చెందిన యువ పైలట్, 23 ఏళ్ల దీపిక అధానా, UAEలో చిక్కుకున్న 169 మంది భారతీయులను రక్షించడంలో కీలక పాత్ర పోషించింది. ప్రయాణీకులను సురక్షితంగా ఢిల్లీకి తిరిగి తీసుచ్చి ప్రశంసలు దక్కించుకుంది. అయితే ఇంత ఉద్రికత్తతల మధ్య  విమానం బయలుదేరే ముందు "అమ్మా, బై బై. నేను తిరిగి వస్తానో లేదోనాకు తెలియదు"  అని చెప్పి మిషన్‌కు బయలు దేరడంమాత్రమే కాదు ఎన్నో సవాళ్ల మధ్య   అత్యంత సాహసంగా వ్యవహరించి సురక్షితంగా ఢిల్లీకి  చేరడం పలువురిని భావోద్వేగానికి గురి చేసింది.  

ఇదీ చదవండి: విమానం గాల్లో ఉండగా క్యాబిన్‌ క్రూ రీల్‌, ఎయిరిండియా విచారణ

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అవడంతో బాధితుల బంధువులు, అదికారులు అందరూ ఊపిరి  పీల్చుకున్నారు.  క్లిష్ట పరిస్థితుల్లో ప్రయాణికులను క్షేమంగా తీసుకొచ్చిన తన కూతురిని చూసి దీపికా తల్లి కూడా తనకెంతో గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ పైలట్ దీపికా అధానా, కెప్టెన్ జస్వీందర్ కౌర్ నేతృత్వంలోని ఆరుగురు మహిళా సభ్యుల బృందం ఉన్నారు. యూఏఈలోని రాస్ అల్ ఖైమా (Ras Al Khaimah) విమానాశ్రయం నుండి యుద్ధ వాతావరణం వల్ల అక్కడ చిక్కుకుపోయిన 169 మంది భారతీయ ప్రయాణికులను సురక్షితంగా ఢిల్లీకి చేర్చారు.

ఇక్కడ ఇంకో ట్విస్ట్‌ ఏంటీ అంటే ఈ విమానాన్ని తొలుత స్నేహితురాలు నడపాల్సి ఉంది, కానీ బయలుదేరడానికి  అకస్మాత్తుగా కేవలం రెండు గంటల ముందు, దీపికను ఆమె స్థానంలోకి  రావాలని ఆదేశాలందాయి.  ఈ బాధ్యతను అత్యంత  సాహసోపేతంగా నిర్వహించి అందరి ప్రశంసలు దక్కించుకుంది.

ఎదురైన సవాళ్లు :  ఈ రెస్క్యూ మిషన్‌ సమయంలో ఒక దశలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) తో సంబంధాలు తెగిపోయాయి. కొద్దిసేపు నెట్‌వర్క్ ఫెయిల్యూర్ కావడంతో ఉత్కంఠ నెలకొంది, కానీవెంటనే సంబంధాలు పునరుద్ధరించబడటంతో విమానం సురక్షితంగా ఢిల్లీలో ల్యాండ్ అయింది.

ఎవరీ దీపిక అధానా
హర్యానాలోని ఫరీదాబాద్ (తిగావ్ ప్రాంతం) చెందిన వారు దీపిక. తండ్రి యోగేష్ అధానా (ఆర్కిటెక్ట్), తల్లి బబ్లీ అధానా.  ఆమె తాతయ్య అమృత్ సింగ్ అధానా కోరిక మేరకు దీపికా పైలట్ కావాలని నిర్ణయించుకుంది. 2020లో 12వ తరగతి పూర్తి చేసిన ఆమె, కరోనా కష్టకాలంలోనూ పట్టుదలతో చదివి కమర్షియల్ పైలట్ లైసెన్స్ సాధించింది.

ఇదీ చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌ డౌన్‌, యూజర్లు గగ్గోలు

Videos

YSR ఘాట్ వద్ద వైఎస్ జగన్.. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు

AP: 20 ఏళ్ల పగ.. వేటాడి వెంటాడి హత్య

కొట్టుకుపోతున్న పాకిస్థాన్ ఇస్లామాబాద్ ను ముంచెత్తిన వరదలు

భయపడకండి మీకు నేనున్నా... అంబటి సురేష్ కుటుంబానికి ధైర్యం చెప్పిన జగన్

అడిగి అడిగి అలసిపోయాం.. అందుకే పోరాటంలోకి దిగాం

ఇంజన్ ఫెయిల్.. ఇండిగో ఫ్లైట్ కు తప్పిన ఘోర ప్రమాదం

ఎవరు పూల సుబ్బయ్య.. వెలిగొండకు ఆయన పేరు ఎందుకు!

తుక్కుగూడలో దారుణం.. ఆ రోజు రాత్రి జరిగింది ఇదే పోలీస్ రిపోర్ట్ లో సంచలన విషయాలు

నేపాల్‌లో యాక్షన్‌లోకి ప్రధాని బాలేంద్ర షా!

విజయవాడలో CPS ఉద్యోగుల భారీ ర్యాలీ

Photos

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)