Breaking News

కోవిడ్‌ కట్టడిలో భారత్‌ భేష్‌. మరి మరణాలు?

Published on Wed, 09/14/2022 - 12:44

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కట్టడిలో విఫలమై ప్రపంచ దేశాలు అల్లాడుతుంటే కోవిడ్‌ సంక్షోభాన్ని భారత్‌ సమర్థవంతంగా ఎదుర్కొందని బిల్, మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ ప్రశంసించింది. ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఒక వేళ కోవిడ్‌ సమర్థ నిర్వహణ అంశం ఉండి ఉంటే భారత్‌ ఈ విషయంలో ప్రపంచ నంబర్‌ వన్‌ ర్యాంక్‌ను పొంది ఉండేదని బిల్, మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ సీఈఓ మార్క్‌ సుజ్‌మాన్‌ వ్యాఖ్యానించారు.

ఫౌండేషన్‌ ఆరో వార్షిక లక్ష్య సాధకుల (గోల్‌కీపర్స్‌) నివేదిక విడుదల సందర్భంగా మంగళవారం ఆయన పీటీఐ వారాసంస్థతో మాట్లాడారు. ‘‘దేశ సమస్యలను పరిష్కరించుకుంటూనే హఠాత్తుగా వచ్చిపడిన కోవిడ్‌ మహమ్మారి అదుపులో భారత్‌ విజయం సాధించింది. కోవిడ్‌ కట్టడికి అవలంబించిన విధానాలు, తీసుకున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలకు ఆదర్శనీయం. 200 కోట్ల కరోనా టీకాల పంపిణీ, ఏకంగా 90 శాతం వ్యాక్సినేషన్‌ రేటుతో ఎన్నో విషయాల్లో దిక్సూచీగా మారింది..

దేశీయంగా టీకాలను ఉత్పత్తి చేయించి వ్యాక్సిన్‌ తయారీ రంగంలో పెద్దన్న పాత్ర కొనసాగిస్తోంది. వచ్చే ఏడాది జీ20 కూటమికి అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటూ ఎన్నో అంతర్జాతీయ వేదికలపై భారత్‌ సత్తా చాటుతోంది. పేదరిక నిర్మూలన, నవజాత శిశు మరణాల రేటు తగ్గుదల వంటి అంశాల్లోనూ మంచి పురోగతి సాధించింది. కోవిన్‌ యాప్‌ ద్వారా త్వరితగతిన కోట్లాది వ్యాక్సిన్ల పంపిణీని సుసాధ్యంచేసింది. భారత్‌లో స్వయం ఉపాధి బృందాల ద్వారా మహిళలు సాధించిన సాధికారత, ప్రగతి అమోఘం’ అని సుజ్‌మాన్‌ అన్నారు.  

ఆక్సిజన్‌ కొరతతో కోవిడ్‌ మరణాలపై ఆడిట్‌

కరోనా రెండో వేవ్‌ సమయంలో ఆక్సిజన్‌ కొరతతో సంభవించిన మరణాలపై ఆడిట్‌ చేయించాలని పార్లమెంటరీ ప్యానెల్‌ కేంద్రానికి సిఫారసు చేసింది. ఆక్సిజన్‌ కొరతతో మరణాలు సంభవించాయన్న వాదనను ఆరోగ్య శాఖ కొట్టిపారేయడం దురదృష్టకరమని పేర్కొంది. బాధిత కుటుంబాలకు పరిహారమివ్వాలని పేర్కొంది. కమిటీ తన 137వ నివేదికను సోమవారం రాజ్యసభకు సమర్పించింది. కేసులు భారీగా పెరిగిపోవడంతో ఆరోగ్య మౌలిక వసతులపై తీవ్ర ఒత్తిడి ఏర్పడిందని తెలిపింది. రాష్ట్రాలకు అవసరాలను అనుగుణంగా సిలిండర్లను పంపిణీ చేయలేక తీవ్ర సంక్షోభానికి కేంద్రం కారణమైందని తప్పుబట్టింది. క్యాన్సర్‌ను గుర్తించదగిన వ్యాధిగా పేర్కొనాలని మరో నివేదికలో కేంద్రానికి సూచించింది. 

ఇదీ చదవండి: రేపిస్ట్‌ ఇల్లు నేలమట్టం!

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)