Breaking News

పిల్లల పొట్టకొట్టి.. రూ. 2,000 కోట్లు మూటగట్టి..

Published on Sun, 01/11/2026 - 08:36

చిన్నారుల ఆకలి తీర్చాల్సిన ఆహార పథకం.. అవినీతి తిమింగలాలకు అక్షయపాత్రగా మారింది. రాజస్థాన్‌లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంలో చోటుచేసుకున్న వేల కోట్ల రూపాయల ‘భారీ కుంభకోణం’  ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో డ్రై రేషన్ పంపిణీ పేరిట జరిగిన ఈ దోపిడీపై ఏసీబీ ఇప్పటికే వేట మొదలు పెట్టింది. అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తూ, తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది.

రూ. 2,000 కోట్ల భారీ కుంభకోణం
రాజస్థాన్‌లోని పాఠశాల విద్యార్థుల ఆకలి తీర్చాల్సిన మధ్యాహ్న భోజన పథకంలో అక్షరాలా రూ. 2,000 కోట్ల భారీ కుంభకోణం వెలుగు చూసింది. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ అక్రమాలపై ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైంది. చిన్నారులకు అందించే పౌష్టికాహారంలో కూడా అవినీతి చోటుచేసుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

తొలి అడుగు వేసిన ఏసీబీ
ఈ కుంభకోణానికి సంబంధించి రాజస్థాన్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఇప్పటికే 21 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ జాబితాలో రాజస్థాన్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ లిమిటెడ్ (కాన్ఫెడ్‌)కు చెందిన మాజీ అధికారులు,  ఆహార సరఫరా సంస్థలు, ఇతరులు నిందితులుగా ఉన్నారు. ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించేందుకు వీరంతా వ్యవస్థీకృతంగా తమ వ్యూహం అమలు చేసినట్లు ఏసీబీ ప్రాథమిక విచారణలో తేలింది.

డ్రై రేషన్ పంపిణీలో అక్రమాలు
2020 నుంచి 2023 మధ్య కాలంలో రాష్ట్రంలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతున్న సుమారు మూడు కోట్ల మంది విద్యార్థులకు పప్పులు, వంట నూనె, మసాలా దినుసులతో కూడిన ‘డ్రై రేషన్’ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ. 2,023.91 కోట్లు ఖర్చు చేసింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో విద్యార్థులకు చేరాల్సిన పోషకాల కంటే, అధికారుల జేబుల్లోకి చేరిన సొమ్మునే ఎక్కువగా ఉన్నట్లు ఆధారాలు లభించాయి.

ఈడీ చేతికి పక్కా ఆధారాలు
ఈ కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గతంలోనే దృష్టి సారించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) సెక్షన్ 66(2) కింద ఈడీ సేకరించిన కీలక ఆధారాలను రాష్ట్ర ఏసీబీకి బదిలీ చేసింది. ఒకప్పుడు మూతపడిన ఈ కేసును, ఇప్పుడు ఈడీ పక్కా ఆధారాలతో తిరిగి తెరవడమే కాకుండా, విచారణను వేగవంతం చేసి నిందితులను పట్టుకునేందుకు సిద్ధమవుతోంది.

పథకం ప్రకారమే దోపిడీ
సరుకుల కొనుగోలు ప్రక్రియలో ఉద్దేశపూర్వక జాప్యం, కృత్రిమంగా  ధరలు పెంచడం, నాణ్యత లేని వస్తువుల సరఫరా  తదితర చర్యల ద్వారా ఈ దోపిడీ జరిగినట్లు ఏసీబీ తన 22 పేజీల నివేదికలో పేర్కొంది. కనీసం సరుకులు సరఫరా కాకుండానే కాగితాల్లో లెక్కలు చూపించి, కోట్లాది రూపాయల చెల్లింపులు జరిపినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.

ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సన్నద్ధం
త్వరలోనే ఈడీ అధికారికంగా మనీ లాండరింగ్ కేసు నమోదు చేయనుంది. దీంతో ఈ కుంభకోణంలో ప్రమేయమున్న నిందితుల ఆస్తులను అటాచ్ చేసే అవకాశం లభిస్తుంది. అక్రమంగా సంపాదించిన ప్రతి రూపాయిని రికవరీ చేయడమే లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థ అడుగులు వేస్తున్నట్లు తెలిపింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అవినీతి అధికారులలో వణుకు పుట్టిస్తోంది.

రాజకీయంగా రగులుతున్న వివాదం
ఈ దర్యాప్తుపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతస్రా ఈ ఆరోపణలను కొట్టివేశారు. బీజేపీ ప్రభుత్వం  రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే పాత కేసులను తవ్వుతోందని, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇదంతా చేస్తోందని ఆయన ఆరోపించారు. అయితే అధికారులు, మధ్యవర్తులు, ఇతరుల మధ్య ఉన్న చీకటి ఒప్పందాల  కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ. 2,000 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని ఏసీబీ ఎఫ్ఐఆర్ స్పష్టం చేస్తోంది. ఈ భారీ స్కామ్‌లో అసలు సూత్రధారులు ఎవరనేది త్వరలోనే వెల్లడికానుంది. 

ఇది  కూడా చదవండి: Syria: ఐసిస్ స్థావరాలపై అమెరికా భీకర దాడులు

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)