Breaking News

నిందితులకు మూడు రోజుల కస్టడీ 

Published on Fri, 02/27/2026 - 03:50

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన ఏఐ ఇంపాక్ట్‌ సమిట్‌ సందర్భంగా నిరసన తెలిపిన యూత్‌ కాంగ్రెస్‌ నాయకులను ఢిల్లీలోని కోర్టు మూడు రోజుల పోలీస్‌ కస్టడీకి అనుమతించింది. ముగ్గురి కస్టడీని హిమాచల్‌ ప్రదేశ్‌ పోలీసులు అడ్డుకోగా, 24 గంటలపాటు చోటుచేసుకున్న నాటకీయ పరిణామా ల మధ్య వారిని ఢిల్లీ పోలీసులు దేశరాజధానికి తరలించారు. 

కోర్టు ట్రాన్సిట్‌ రిమాండ్‌కు అనుమతించినప్పటికీ హిమాచల్‌ పోలీసులు ఢిల్లీ పోలీసులను దాదాపు ఐదు గంటలపాటు దిగ్బంధించారు. ఎట్టకేలకు నిందితులతోపాటు వారు ఢిల్లీకి చేరుకున్నారు. భారీ బందోబస్తు మధ్య గురువారం పోలీసులు ముగ్గురినీ చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ మృదుల్‌ గుప్తా ఎదుట హాజరు పరిచారు. విచారణ కోసం ఐదు రోజుల కస్టడీకి అనుమతించాలని కోరారు. నిందితుల్లో యూపీ వాసులైన సౌరభ్, అర్బాజ్‌ ఖాన్, మధ్యప్రదేశ్‌కు చెందిన సిద్ధార్థ అవధూత్‌లు అరెస్ట్‌ల నుంచి తప్పించుకునేందుకు హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఓ రిసార్టులో దాక్కున్నారని పోలీసుల తరఫు లాయర్‌ తెలిపారు.

 బుధవారం ఉదయం 6.40 గంటల వేళ వారిని అదుపులోకి తీసుకుని, అదే రోజు మధ్యా హ్నం 1.40కి సిమ్లాలో మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపర్చి, ట్రాన్సిట్‌ రిమాండ్‌కు కోరామన్నారు. అనుమతించిన కోర్టు.. వారిని 18 గంటల్లోగా సంబంధిత కోర్టులో హాజరుపర్చాలని షరతు పెట్టిందని వివరించారు. ఇంపాక్ట్‌ సమిట్‌ వద్ద నిరసన తెలిపేందుకు వాడిన టీషర్ట్‌ను సిద్ధార్థ్‌ డిజైన్‌ చేయగా, సౌరభ్‌ నిరసనకు పిలుపునిచ్చే వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేశాడని, సౌరభ్, అర్భాజ్‌లు నిరసనలో పాల్గొన్నారని లాయర్‌ పేర్కొన్నారు. 

నిరసన కోసం లక్షకు పైగా టీషర్టులను ప్రింట్‌ చేశారని, వీటిని ఎక్కడ ప్రింట్‌ చేశారు? దీని వెనుక ఎవరెవరున్నారో తెల్సుకునే ప్రయత్నా ల్లో ఉన్నామన్నారు. అయితే, నిరసన తెలిపారనే సాకుతో ఢిల్లీ పోలీసులు వారిని వెంటాడి పట్టుకున్నారని, ఇదంతా రాజకీయ పేర్రేపితమని నిందితుల తరఫు లాయర్‌ వాదించారు. వాదనలు విన్న మేజి్రస్టేట్‌ నిందితుల ను మూడు రోజుల పోలీస్‌ కస్టడీకి అనుమతిస్తున్నట్లు తెలిపారు. మార్చి ఒకటో తేదీన తిరిగి వారిని తమ ఎదుట హాజరుపర్చాలని కోరారు. వీరితోపాటు ఈ కేసులో అంతకుముందే అరెస్ట్‌ చేసిన అజయ్‌ కుమార్, రాజా గుజార్‌ అనే వారి రిమాండ్‌ గడువు ముగియడంతో వారిని కూడా పోలీసులు కోర్టుకు తీసుకువచ్చారు. దీంతో, వారి రిమాండ్‌ను మరో మూడు రోజులకు పొడిగిస్తున్నట్లు మేజి్రస్టేట్‌ తెలిపారు.   
 

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)