Breaking News

ముగిసిన అంజన్‌ కుమార్‌ యాదవ్‌ ఈడీ విచారణ..

Published on Wed, 11/23/2022 - 12:39

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్‌ కేసు మరోసారి తెర మీదికి వచ్చింది. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ నేత అంజన్‌ కుమార్‌ యాదవ్‌ ఈడీ ప్రధాన కార్యాలయానికి హాజరయ్యారు. యంగ్‌ ఇండియాకు ఇచ్చిన విరాళాలపై అంజన్‌ కుమర్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. దాదాపు రెండున్నర గంటలపాటు అంజన్‌ కుమార్‌ను విచారించిన ఈడీ.. ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేశారు. యంగ్ ఇండియన్‌ ఫౌండేషన్‌ అనే ఛారిటీ సంస్థకు గతంలో అంజన్ కుమార్ యాదవ్ రూ. 20 లక్షలు డొనేషన్ ఇచ్చారు.

విచారణ అనంతరం అంజన్‌ కమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ..  రేవంత్ రెడ్డి సూచన మేరకే యంగ్ ఇండియా లిమిటెడ్‌కు విరాళాలు ఇచ్చినట్లు తెలిపారు. ఇదే విషయాన్ని ఈడి అధికారులకు తెలిపినట్లు చెప్పారు. సంస్థ ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉందనే స్వచ్చందంగా విరాళాలు ఇచ్చానన్నారు.  కక్ష సాధింపు చర్యలో భాగంగానే నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ కాంగ్రెస్ నేతలను విచారిస్తుందని విమర్శించారు. మళ్ళీ విచారణ ఉంటే పిలుస్తామని అధికారులు చెప్పినట్లు పేర్కొన్నారు.

ఇప్పటికే నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ప్రశ్నించిన విషయం తెలిసిందే. 
చదవండి: మల్లారెడ్డి తన ఫోన్‌ను చెత్తబుట్టలో ఎందుకు దాచిపెట్టారు: రఘునందన్‌ రావు

Videos

కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్

హైదరాబాద్ లో కరోనా కేసు నమోదు

జహీరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్

ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం

YSRCP హరికృష్ణను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి.. దారుణం! : Ambati Rambabu

Sake Sailajanath: ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు

First case: కడప కరోనా కేసును దాచిపెట్టేందుకు అధికారుల యత్నం

హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ 6 షరతులు

Chittoor: మామిడి రైతుల ఆవేదన..చేతులెత్తేసిన కూటమి

West Godavari: పేదల కల కలగానే మిగిలింది పడకేసిన ఇళ్ల నిర్మాణ పనులు

Photos

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)