ఏపీలో రోడ్లు అధ్వానం టీడీపీ ఎమ్మెల్యే బాబుకు షాక్
Breaking News
ఓటీటీలో బోల్డ్ అండ్ ఫన్ మూవీ స్ట్రీమింగ్
Published on Thu, 02/19/2026 - 10:49
బోల్డ్ అండ్ ఫన్ కాన్సెప్ట్తో బాలీవుడ్లో విడుదలైన మూవీ ‘తూ మేరీ మై తేరా మై తేరా తూ మేరీ’ (Tu Meri Main Tera Main Tera Tu Meri).. ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రాన్ని ఇక నుంచి ఉచితంగానే ఊడొచ్చు. తాజాగా రెంటల్ విధానాన్ని తొలగించారు. డిసెంబర్ 25, 2025న విడుదలైన ఈ మూవీలో కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్కి చెందిన ధర్మ ప్రొడక్షన్స్ (Dharma Productions), నమః పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. సినిమాపై కొంతమేరకు పాజిటీవ్ రివ్యూలు వచ్చినప్పటికీ ధురంధర్ మూవీతో పోటీపడలేక బాక్సాఫీస్ వద్ద నష్టాలను మిగిల్చింది.

‘తూ మేరీ మై తేరా మై తేరా తూ మేరీ’ మూవీ అమెజాన్ ప్రైమ్లో ( Amazon Prime Video) స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీని చూడాలంటే రూ. 279 అధనంగా చెల్లించాల్సి ఉంది. అయితే, ఈ మెత్తాన్ని తాజాగా రద్దు చేశారు. ఇక నుంచి ఈ మూవీని ఉచితంగానే ఓటీటీలో చూడొచ్చని పేర్కొంది. ‘పతి పత్ని ఔర్ వోహ్’ (Pati Patni Aur Woh) తర్వాత కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే కలిసి ఈ మూవీలో నటించారు. దీంతో దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. కానీ, అంచనాలను అందుకోలేకపోయింది. సుమారు రూ. 100 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 40 కోట్ల మేరకే రాబట్టినట్లు తెలుస్తోంది.
Tags : 1