Breaking News

టాలీవుడ్‌లో నటి లయపై నిర్మాత వ్యాఖ్యల దుమారం

Published on Tue, 02/24/2026 - 23:59

లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి, ఈషా వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాల నిర్మాత వంశీ నందిపాటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది.

టాలీవుడ్ సీనియర్ నటీనటులు శివాజీ, లయ జంటగా నటించిన క్రైమ్ కామెడీ చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ మార్చి 6న థియేటర్లలో విడుదల కానుంది. ఈ తరుణంలో చిత్రయూనిట్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. ఈ ప్రెస్‌మీట్‌లో నటి లయ గురించి మాట్లాడుతూ వంశీ నందిపాటి..‘నందులను పందుల్లా పెంచింది’అని  వ్యాఖ్యానించారు.

ఈ మాటలు అక్కడే ఉన్నవారిని ఆశ్చర్యానికి గురి చేయగా, సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ నటి గురించి ఇలాంటి పదజాలం ఉపయోగించడం నిర్మాతకు తగదని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ప్రత్యేకంగా, ప్రతిష్టాత్మకమైన నంది అవార్డుల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత ఆగ్రహానికి కారణమయ్యాయి. తెలుగు సినీ పరిశ్రమలో అత్యున్నత గౌరవంగా భావించే నంది అవార్డులను తక్కువ చేసి మాట్లాడడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ అవార్డులు తెలుగు సినిమా ప్రతిష్టకు ప్రతీకగా నిలుస్తాయని, వాటిని అవమానించేలా వ్యాఖ్యానించడం సరైనది కాదని సినీ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందిస్తున్నారు.

వంశీ నందిపాటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్న నేపథ్యంలో, ఆయనపై విమర్శలు మరింత పెరుగుతున్నాయి. కొందరు ఆయనను బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, కొంతమంది మాత్రం ఆయన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, వంశీ ఉద్దేశం అంతకంటే వేరుగా ఉండవచ్చని అంటున్నారు.

Videos

బంగారం, వెండి కొనాలనుకునేవారికి షాక్.. ఇవాళ ధరలు ఎలా ఉన్నాయంటే..!

నందమూరి బాలయ్య కోసం నారా బావయ్య నిర్వాకం

ఐటీ ఉద్యోగులకు బిగ్ షాక్.. కోడింగ్ రాసేది, ఎగ్జిక్యూట్ చేసేది అంతా AI

ఇజ్రాయెల్‌కు చేరుకున్న ప్రధాని మోదీ

నయా ట్రెండ్.. పెళ్లికి ముందు అంతా చేసేసి బ్లాక్ మెయిల్

భారత్ సెమీస్ చేరాలంటే..? 11 ఓవర్లలో ఎంత ఛేజ్ చేయాలంటే..!

సుబ్బారెడ్డి భార్యను మేం తీసుకొస్తాం చంద్రబాబు, లోకేష్, బిఆర్ నాయుడు.. మీ భార్యలను తీసుకురండి

కూటమి సర్కార్ కు షాకిచ్చిన సోము వీర్రాజు

యూట్యూబర్‌ అన్వేష్‌పై లుకౌట్ నోటీసులు

Amalapuram: రెస్టారెంట్లో అమలాపురం కుళ్ళిన చికెన్‌తో బిర్యానీ

Photos

+5

విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి సందడి విశేషాలు (ఫొటోలు)

+5

కుంభాభిషేక మహోత్సవంలో వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

బ్లాక్ అండ్ బ్లాక్‌లో మెరిసిపోతున్న శిరీష్-నయనిక (ఫొటోలు)

+5

నందిపల్లిలో వైఎస్‌ జగన్‌ పర్యటనతో పండుగ వాతావరణం (ఫొటోలు)

+5

Telangana Inter Exams : ఇంటర్ పరీక్షలు ప్రారంభం (ఫొటోలు)

+5

శ్రీదేవి 'బ్యాండ్ మేళం' టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ పులివెందుల పర్యటన (ఫోటోలు)

+5

బీచ్ ఒడ్డున అలా సరదాగా సింగర్ సునీత (ఫొటోలు)

+5

నాని స్టైల్లోనే అతడికి బర్త్‌డే విషెస్ చెప్పిన అక్క (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ఒకప్పటి హీరోయిన్ (ఫొటోలు)