Breaking News

పనిమనిషి చెప్పేదాకా చైసామ్‌ విడిపోతున్నారని తెలియదు

Published on Wed, 07/20/2022 - 14:51

నాగచైతన్య- సమంత విడాకుల వ్యవహారం ఇప్పటికీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. తరచూ వీరి గురించి ఏదో ఒక వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ వస్తోంది. ఇదిలా ఉంటే వీరి విడాకుల గురించి తాజాగా సీనియర్‌ నటుడు మురళీ మోహన్‌ స్పందించాడు. ఈ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, అలాంటి చూడముచ్చని జంట ఎలా విడిపోయిందో అర్థం కావడం లేదన్నాడు.

ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'మాకు హైదరాబాద్‌లో అపార్ట్‌మెంట్స్‌ ఉన్నాయి. ఆ అపార్ట్‌మెంట్స్‌ పైన నా కుటుంబం కోసం ప్రత్యేకంగా ఇళ్లు కట్టుకున్నాం. ఒకటి నా కోసం, రెండోది నా కొడుకు కోసం, మరోటి నా తమ్ముడు కిషోర్‌ కోసం. 14వ అంతస్థులో స్విమ్మింగ్‌ పూల్‌, జిమ్‌ ఇలా అన్నీ ఏర్పాటు చేసుకున్నాం. నాగచైతన్య ఓసారి మా ఇల్లు చూసి మాకు కావాలండీ అని అడిగితే ఇది అమ్మడానికి కాదు మా ఫ్యామిలీ కోసం కట్టుకున్నామని చెప్పాను. దీంతో నాగార్జున అడిగాడు. అప్పటికే నేను నాగేశ్వరరావుగారికి పెద్ద అభిమానిని. వారి కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. ఆయన అడిగేసరికి కాదనలేకపోయాను.

కానీ మాలో ఎవరిది ఇచ్చేయాలా? అని ఆలోచనలో పడినప్పుడు నా కొడుకు తనది ఇచ్చేయమన్నాడు. పెళ్లికి ముందే చైతూ ఒక్కడే ఉండేవాడు, పెళ్లయ్యాక సామ్‌తో ఉండేవాడు. అయితే వాళ్లు ఒక ఇల్లు కొనుకున్నారు. అది బాగు చేయించుకుని అందులోకి మారడానికి ఒక ఏడాది పడుతుందని చై చెప్పాడు. అంతలోనే విడాకులు తీసుకున్నారు. అసలు వాళ్లు విడిపోతున్నారన్న విషయం నాకన్నా ముందు పనిమనిషులకే తెలిసింది. కానీ వాళ్లు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కలిసి వాకింగ్‌, వర్కవుట్స్‌ చేసేవారు. ఎప్పుడూ గొడవపడలేదు. వాళ్లు విడిపోతున్నారన్న విషయం ముందే తెలిసి ఉంటే నాగార్జునతో మాట్లాడి కలపడానికి ప్రయత్నించేవాడిని. కానీ అప్పటికే వాళ్లు నిర్ణయం తీసుకున్నారు' అని చెప్పుకొచ్చాడు మురళీ మోహన్‌.

చదవండి: అతనికి నేను ఎలాంటి డబ్బు ఇచ్చేది లేదు: ఆర్జీవీ
ఓటీటీలో వచ్చేస్తున్న ‘రాకెట్రీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..

Videos

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)