Breaking News

ఎన్టీఆర్‌ రెమ్యూనరేషన్‌ తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే

Published on Tue, 03/16/2021 - 22:13

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌  హోస్ట్‌గా చేయబోతున్న రియాల్టీ షో ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’. త్వరలోనే జెమిని టీవీలో ప్రసారం కానున్న ఈ షో ప్రోమో ఇది వరకే విడుదల అయిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరించారు. ఎన్టీఆర్ షోకు హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించ‌డంతో మంచి స‌క్సెస్ అయింది. ఇక నాగార్జున, చిరంజీవి హోస్ట్‌లుగా వ్యవహరించిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ రియాల్టీ షో ఎంత ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. మొదటి మూడు సీజన్లకి కింగ్‌ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించగా, 2017లో వచ్చిన నాలుగో సీజన్‌కి మాత్రం మెగాస్టార్‌ చిరంజీవి హోస్ట్‌గా చేశాడు.


ఇప్పుడు అదే షోని కొన్ని మార్పులతో ఎన్టీఆర్‌ హోస్ట్‌ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రెమ్యునరేషన్‌ ఎంత అనే విషయంలో సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తోంది. గతంలో మూడు సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జునకు దాదాపుగా 4.5 కోట్ల రూపాయల పారితోషికం ఇవ్వగా, చిరంజీవి సుమారు రూ.9 కోట్లు అందుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం హోస్ట్‌గా చేయబోతున్న ఎన్టీఆర్‌ కోసం షో నిర్వాహకులు రూ.7.5 కోట్లను పారితోషికంగా ఇవ్వనున్నట్లు టాక్‌ వినిపోస్తోంది.


గతంలో బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా నిర్వహించిన ఎన్టీఆర్‌ నాలుగు కోట్ల రూపాయలను రెమ్యూనరేషన్‌ తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం  'ఎవరు మీలో కోటీశ్వరులు' రియాలిటీ షో కోసం దాన్ని అమాంతం పెంచేసినట్లు తెలుస్తోంది. 60 ఎపిసోడ్‌లుగా ఈ సీజన్ ను ప్లాన్‌ చేసినట్లు సమాచారం. ఈ ప్రోగ్రాం ఏప్రిల్‌ చివరిలో లేదా మే తొలి వారంలో ప్రారంభం కానుందని తెలుస్తోంది. మరోవైపు తమ హీరోను బుల్లితెరపై కనులారా చూసుకునేందుకు అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 

చదవండి :  (పొలిటికల్‌ ఎంట్రీపై స్పందించిన ఎన్టీఆర్)‌‌
(ఆర్‌ఆర్‌ఆర్‌: సీత వచ్చేసిందిగా)

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)