Badvel : పేదల భూములు కొట్టేస్తున్న పచ్చ గద్దలు.. మాకు చావే గతి
Breaking News
రణ్వీర్ సింగ్, రోహిత్ శెట్టి.. ఇప్పుడు ప్రముఖ నటి..!
Published on Sun, 02/15/2026 - 12:04
బాలీవుడ్ తారలకు ఇటీవల బెదిరింపులు ఎక్కువైపోతున్నాయి. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలైన రణ్వీర్ సింగ్, రోహిత్ శెట్టిలకు బెదిరింపులొచ్చాయి. తాజాగా మరో నటికి సైతం ఇలాంటి అనుభవమే ఎదురైంది. ప్రముఖ నటి హిమాన్షీ ఖురానాకు బెదిరింపులొచ్చాయి. పది కోట్లు ఇవ్వాలని ఓ దుండగుడు డిమాండ్ చేశాడు. దీంతో నటి పంజాబ్లోని మొహాలీ పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటనపై వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆమె భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
ఈ మెయిల్ ద్వారా వాయిస్ నోట్ వచ్చిందని.. అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడని హిమాన్షీ తన ఫిర్యాదులో పేర్కొంది. జీషన్ అక్తర్ అనే పేరుతో మెయిల్ వచ్చినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. నటి హిమాన్షీ ఖురానీ పంజాబీ మూవీ సద్దా హక్తో ఫేమ్ తెచ్చుకున్నారు. జోడీ బిగ్డే పార్టీ, నా.. నా.. నా లాంటి ఆల్బమ్స్తో అలరించారు. అంతేకాకుండా హిందీ బిగ్బాస్ సీజన్- 13లో కంటెస్టెంట్గా పాల్గొన్నారు.
Tags : 1