Breaking News

పశ్చిమాసియా యుద్ధంలోకి పాకిస్థాన్‌!

Published on Wed, 03/04/2026 - 17:10

ఇస్లామాబాద్‌: పశ్చిమాసియా యుద్ధంలోకి తాము కూడా దిగే పరిస్థితి రావచ్చని పాకిస్థాన్ సంకేతాలు ఇచ్చింది. సౌదీ అరేబియాతో తమకు ఉన్న ద్వైపాక్షిక రక్షణ ఒప్పందాన్ని కారణంగా చూపింది. ఈ ఒప్పందం నాటోను పోలి ఉంటుంది. ప్రతీకార దాడుల్లో ఇరాన్‌ను లక్ష్యంగా పెట్టుకున్న గల్ఫ్ దేశాల్లో సౌదీ అరేబియా ఒకటి. 

సౌదీ అరేబియాపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించవద్దని ఇరాన్‌ను హెచ్చరించినట్టు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ చెప్పారు. సౌదీ అరేబియాతో తమకు రక్షణ ఒప్పందాన్ని ఉన్నట్టు ఇరాన్‌కు అర్థమయ్యేలా చేశానని దార్ అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ప్రారంభించిన తర్వాత మొదలైన ఇరాన్ యుద్ధానికి కూడా ఈ రక్షణ ఒప్పందం వర్తిస్తుందని స్పష్టంగా తెలిపారు.

ఇరాన్‌, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య మొదలైన ఘర్షణ ఇతర దేశాలనూ తాకిన విషయం తెలిసిందే. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలు, రాయబార కార్యాలయాలు, ఇంధన మౌలిక వసతులపై ఇరాన్ దాడులు చేసింది.

మంగళవారం రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయ ప్రాంగణంలో ఉన్న సీఐఏ ప్రధాన కార్యాలయం (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ప్రధాన కేంద్రం)పై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. ఒక రోజు ముందు సౌదీ అరేబియాలోని అతిపెద్ద రిఫైనరీలలో ఒకటైన రాస్ తనూరా చమురు శుద్ధి కేంద్రంపై దాడి జరిగింది. దాంతో కార్యకలాపాలు నిలిచిపోయాయి.  

ఇరాన్‌తో పాక్‌ చర్చలు
పాకిస్థాన్-సౌదీ అరేబియా మధ్య ఉన్న రక్షణ ఒప్పందం రియాద్‌పై ప్రభావం చూపిందని, భారీ దాడులు జరగకుండా చేసిందని దార్ చెప్పారు. ఇతర దేశాల కంటే సౌదీ అరేబియాపై దాడులు తక్కువగా జరిగాయని ఆయన తెలిపారు. దీనికి ప్రతిగా సౌదీ భూభాగాన్ని ఇరాన్‌పై దాడులకు వినియోగించరాదని హామీ ఇవ్వాలని టెహ్రాన్‌ కోరిందని దార్ తెలిపారు.  

గత సంవత్సరం సెప్టెంబర్‌లో సౌదీ-పాక్‌ మధ్య కుదిరిన నాటో తరహా రక్షణ ఒప్పందం ప్రకారం.. ఒక దేశంపై దాడి జరిగితే అది ఇరు దేశాలపై జరిగిన దాడిగా పరిగణిస్తారు. బుధవారం సౌదీ అరేబియా స్పందిస్తూ.. ఇరాన్ చేసిన దాడులపై ప్రతిస్పందించే హక్కు తమకు ఉందని స్పష్టం చేసింది. యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అధ్యక్షతన అర్ధరాత్రి జరిగిన మంత్రివర్గ సమావేశం తర్వాత ఈ ప్రకటన వెలువడింది.

పాకిస్థాన్‌కు ప్రమాదకరం 
ఇరాన్‌కు వ్యతిరేకంగా యుద్ధ విమానాలను మోహరించడం పాకిస్థాన్‌కు ప్రమాదకరం. ఇరాన్‌కు మద్దతు ఇచ్చే 4 కోట్ల షియా జనాభా పాకిస్థాన్‌లో ఉంది. గత వారం అమెరికా–ఇజ్రాయెల్ దాడుల్లో సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించిన తర్వాత పాక్‌లో హింసాత్మక నిరసనలు జరిగాయి. ఈ హింసలో దాదాపు 35 మంది మరణించారు.

అంతేగాక, అఫ్గానిస్థాన్‌లోని తాలిబాన్‌లతో సరిహద్దు ఘర్షణలో పాకిస్థాన్ నిమగ్నమై ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఇరాన్‌తో పెట్టుకుంటే పాకిస్థాన్ సమస్యలు మరింత పెరుగుతాయి. 

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)