Breaking News

ఇరాన్-అమెరికా ఉద్రిక్తత.. భారత్ కీలక నిర్ణయం

Published on Mon, 02/23/2026 - 18:11

టెహ్మాన్ : ప్రస్తుతం ఇరాన్-యుఎస్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాల మధ్య ఏ క్షణానైనా యుద్ధం మెుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.  ఆ దేశంలో ఉన్న ఇండియన్స్ ఏ విధంగా నైనా తక్షణమే ఇరాన్‌ని వదిలేయాలని ఆదేశించింది.

ఇరాన్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఆ దేశంపై ఏ క్షణానైనా అమెరికా దాడి చేసే అవకాశం ఉండడంతో తమ పౌరులను తమ స్వస్థలాలకు తిరిగిరావాలని ఆదేశిస్తున్నాయి. తాజాగా భారత్‌ సైతం ఈ జాబితాలో నిలిచింది. ఇరాన్‌లో ఉన్న ఇండియన్స్ వీలైనంత త్వరగా ఆదేశాన్ని వదలాలని భారత విదేశాంగ శాఖ తెలిపింది.

"ఇరాన్‌లో భారత్‌కు చెందిన విద్యార్థులు, యాత్రికులు, వర్తకులు, పర్యాటకులు ఇలా ఎవరు ఆదేశంలో ఉన్న వెంటనే ఇరాన్‌ని వీడాలి. మీకు అందుబాటులో ఉన్న ఏ రవాణా మార్గన్నైనా వాడి  అక్కడి నుండి బయిటపడండి.  ప్రయాణానికి  కావాల్సిన ధృవపత్రాలు ఐడీకార్డులు మీతో ఉంచుకొండి. ఏదైనా అవసరముంటే అక్కడి ఇండియన్ ఎంబసీని సంప్రదించండి" అని విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.

అయితే ఇరాన్‌లో ఇటీవల జరిగిన నిరసనల నేపథ్యంలో భారత పౌరులు గొడవలు జరుగుతున్న ప్రాంతాలకు భారతీయులు దూరంగా ఉండాలని భారత్ సూచించింది. కాగా ప్రస్తుతం ఆ భూభాగాన్ని వీడాలని ఆదేశాలు జారీ చేసింది. 

అయితే ప్రస్తుతం అమెరికా, ఇరాన్‌ మధ్య వచ్చే గురువారం అణు ఒప్పందం విషయంలో చర్చలు జరగనున్నాయి. ఈ వివరాలను ఒమన్ విదేశాంగ శాఖ మంత్రి బదర్ అల్ బుసైదీ తెలిపారు. అయితే ఒకవేళ ఈ చర్చలు విఫలమైతే ట్రంప్  ఇరాన్‌పై దాడి చేసే అవకాశాలే అధికంగా ఉన్నాయి. 

Videos

మళ్లీ భారీగా పెరిగిన బంగారం ఎంత పెరిగిందంటే..!

కొండా రాజీనామా! కొండా సురేఖ సంచలన నిర్ణయం

ఏ క్యారెట్ బంగారం కొంటే లాభం? పెరుగుతున్న బంగారం ధరలు

ఖర్చుకు భయపడి హైదరాబాద్ లో స్పిరిట్ షూటింగ్.. ఎక్కడంటే..?

ప్రారంభం రోజే పగుళ్లు.. పోలవరంపై పెను ప్రశ్నలు?

ఒక్క Rolex Watch తయారీకి ఎంత సమయం పడుతుంది?

అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టేసిన బాబు

ఈ విషయాలు మీకు తెలుసా.. కొండా సురేఖ పొలిటికల్ జర్నీ

నర్సారెడ్డి వర్సెస్ మైనంపల్లి కుటుంబం.. మెదక్ లో కాంగ్రెస్ పాలిటిక్స్

జీవీఎంసీ మేయర్ సీటుపై కూటమిలో పీఠముడి

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)