Breaking News

47 ఏళ్ల వయసులో చెప్పులు లేకుండా మారథాన్‌..గెలిచిన అమ్మ!

Published on Tue, 09/01/2026 - 13:20

తల్లి తన పిల్లల కోసం ఏదైనా చేయగలదు అని మరోసారి రుజువైంది. ఓ తల్లి తన కుమార్తెల కోసం మారథాన్‌లో పాల్గొంది. కనీసం అనువైన డ్రెస్‌, షూలు లేకపోయినా..పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దడమే తన ధ్యేయం అన్నట్లుగా రేసులోకి దిగింది. మరి ఆ తల్లి గెలిచిందా అంటే..

మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లా అంబాజోగైకి చెందిన వంటమనిషి రమాబాయి చెప్పలు లేకుండా మారథాన్‌లో పరిగిఎత్తి అందర్నీ ఆశ్చర్యపరిచేలా గెలిచింది. ఓ అమ్మ తలుచుకుంటే పిల్లల కోసం ఎంతటి అనితర సాధ్యమైనదైనా.. చేధించగలదని ప్రపంచానికి చూపించింది. ఇంతలా మారథాన్‌లో పాల్గొని గెలిచి తీరాల్సినంత అవసరం ఆమెకు ఎందుకంటే..

ముంబైలో జరిగిన ఒక ప్రమాదంలో భర్తని కోల్పోయింది రమాబాయి. దాంతో తన ఇద్దరు కుమార్తెలను ఒంటరిగా పెంచుతూ వారి బాగోగులను చూసుకుంటూ వచ్చింది. అయితే తన పిల్లలకు మంచి చదువు అందించి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలనేదే ఆమె ప్రగాఢ ఆకాంక్ష. అయితే ఆర్థిక వనరులు ఏమాత్రం సహకరించడం లేదామెకు. అయినా సరే ఏదోలా కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. అంతేగాదు కుమార్తె చదివే చోట అంబాజోగైలోని అకాడమీలో వంటమనిషిగా పనిలో చేరి కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తోందామె. 

ఆమె అకాడమీలో వంట చేస్తూ కాలం వెళ్లదీస్తుండగా, ఆమె కుమార్తెలు చదువులు, పోటీపరీక్షలపై దృష్టి సారిస్తున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా..ఇద్దరు కుమార్తెలకు మెరుగైన భవిష్యత్తు అందించాలనే పట్టుదలతో రమాబాయి ముందుకు సాగుతోంది. ఆ క్రమంలోనే ఒక స్థానిక సంస్థ నిర్వహించిన 'అమృత్ దౌడ్' మారథాన్‌లో పాల్గొంది రమాబాయి. ఆ మారథాన్‌లో అంతా ట్రాక్‌సూట్‌లు, షూలు ధరించిన యువ పోటీదారుల మధ్య సాధారణ చీర కట్టుకుని పాల్గొంది రమాబాయి. ఆమె మొదట చెప్పులు వేసుకుని పరుగుని ప్రారంభించింది. 

కానీ పరిగెత్తేటప్పుడు అవి జారిపోతుండటంతో వాటిని తీసేయక తప్పలేదు. దాంతో ఆమె చేతిలో చెప్పులు పట్టుకుని చీరను జాగ్రత్తగా సర్దుకుంటూ..చల్లని రోడ్డుపై పరిగెత్తిందామె. కఠిన పరిస్థితులు ఉన్నప్పటికీ ఇదర పోటీదారుల కంటే వేగంగా దూసుకుపోయి..ముగింపు రేఖను చేరుకుంది. రమబాయి అచంచలమైన పట్టదలను చూసి ప్రేక్షకులు హర్షధ్వానాలతో అభినందించారామెను. 

రేసు తదనంతరం రమాయి మాట్లాడుతూ..ఈ పోటీలో చాలామంది పాల్గొన్నారని తెలసుని కానీ బహుమతి గెలవాలనే పట్టుదలతో ఉన్నానని చెప్పారామె. పరిగెత్తేటప్పుడు తాను నిరంతరం తన కుమార్తెల గురించి, వారి భవిష్యత్తునే ఆలోచిస్తూ పరుగు ప్రారంభించానని అన్నారామె. మరి గెలిచిన సోమ్ముని ఏం చేస్తావంటే..వారి పుస్తకాలు కొనడానికి ఉపయోగిస్తానని చెప్పింది. అంతేగాదు మరోఅద్భుతం ఏంటంటే ఇదే మారథాన్‌లో పాల్గొన్న ఆమె కుమార్తె  పూజా రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. 

తానే తల్లిని పాల్గొనమని ప్రోత్సహించానని, కానీ ప్రథమ స్థానంలో నిలుస్తుందని అస్సలు ఊహించలేదని ఆనందంగా చెబుతోంది. ఇక పూజా పోలీస్ రిక్రూట్‌మెంట్ కోసం సిన్నద్ధమవుతోంది. ఇక ఆమె సోదరి బ్యాంక్‌ పోటీ పరీక్షలకు ప్రిపేరవుతంది. చాలా కఠినమైన పరిస్థితులను తట్టుకుని మమ్మల్ని ఎంతో ప్రయాస పడి పెంచిందని చెబుతోంది ఆమె కూతురు పూజా. అంతేగాదు పూజా అంకితభావానికి ముగ్ధుడైన అకాడమీ డైరెక్టర్‌ ఆమె ఫీజును కూడా మాపీ చేశారు. 

కాగా, రమాబాయి కుటుంబం గతంలో వ్యవసాయ పనులపై ఆధారపడి జీవిస్తుండేది. అయితే పిల్లల చదువుకి సాయం అందించేందుకు ఇలా కూతురి అకాడమీలోనే చేరి వంటమనిషిగా పనిచేస్తోందామె. ఈ తల్లికి కుమార్తెల కలను నెరవేర్చడానికి మారథాన్‌ను ఒక అవకాశంగా ఉపయోగించుకుంది. పైగా ఆమె పోటీలో వేసిన ప్రతిఅడుగు అపురూపమైనది. ఎందుకంటే ఆ రేసులో వేసిన అడుగులన్నీ పిల్లలకు మంచి భవిష్యత్తుని అందించాలనే ఆశతో వడివడిగా నడిచినవే.

 

(చదవండి: విపత్తు మిగిల్చిన విషాదం..! తల్లిదండ్రుల ఆచూకీ కోసం..ఆ పసివాడు..)

 

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)