Breaking News

బోయింగ్‌ విమానంలో కుదుపులు : ప్రయాణికులు హడల్‌, కడసారి సందేశాలు

Published on Wed, 07/02/2025 - 17:36

గుజరాత్‌లోని అ‍హ్మదాబాద్‌లో  జరిగిన  ఘోర ఎయిరిండియా  విమాన ప్రమాదం ప్రపంచ వ్యాప్తంగా  విమాన ప్రయాణీకులను పీడకలలా వెంటాడుతోంది. దీంతో విమానంలో చీమ చిటుక్కుమంటే చాలు  ప్రాణభయంతో ఉలిక్కి పడుతున్నారు. తాజాగా జపాన్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 విమానంలో ఏర్పడిన సాంకేతిక లోపంతో ప్రయాణీకులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ తరువాత ఏం చేశారో తెలుసా? జూన్ 30న షాంఘై పుడాంగ్ విమానాశ్రయం - టోక్యో నరిటా విమానాశ్రయానికి బయలుదేరిన విమానంలో ఏం జరిగిందో పదండి తెలుసుకుందాం.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం జపాన్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 విమానం 36వేల అడుగుల ఎత్తులో శరవేగంగా దూసుకుపోతోంది.  191 మంది ప్రయాణికులతో ఈ విమానం చైనాలోని షాంఘై నుండి జపాన్‌ రాజధాని నగరం టోక్యోకు వెళుతోంది. సీట్లలో  అలా కూర్చుని, సీట్‌ బెల్ట్‌ తీసి  అలా రిలాక్స్‌  అవుతున్నారో లేదో ఒక్కసారిగా  కలకలం రేగింది. విమానం యాంత్రిక సమస్యను ఎదుర్కొంది. ఫలితంగా 10 నిమిషాల్లోపు దాదాపు 36,000 అడుగుల నుండి 10,500 అడుగుల కంటే తక్కువ ఎత్తుకు దిగిపోయింది విమానం. క్యాబిన్‌లో ఒత్తిడి తగ్గడంతో, ఫ్లైట్ అటెండెంట్స్‌ మాస్క్‌లు ధరించాలనే సూచనలు అందించారు. ఆక్సిజన్ మాస్క్‌లు ధరించిన ప్రయాణికుల వణికిపోయారు. విమానం కూలిపోతోందనే భయంతో హడలిపోయారు. నిద్రలో ఉన్న  ఒక్క కుదుపుతో మేల్కొన్నారు. మరికొందరు ప్రయాణికులు వీడ్కోలు  సందేశాలు రాయడం మొదలు పెట్టారు. బ్యాంక్ పిన్‌లు ,బీమా సమాచారం వంటి వ్యక్తిగత వివరాలతో ప్రియమైనవారికి సందేశాలు పంపడం ప్రారంభించారు.

"> మరోవైపు ఈ పరిణామంతో పైలట్ అత్యవసర పరిస్థితిని ప్రకటించి విమానాన్ని ఒసాకాలోని కాన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.  పైలట్‌ చాకచక్యంగా విమానాన్ని సురక్షితంగా ల్యాండ్‌ చేయడంతో ప్రయాణీకులంతా ఊపిరి పీల్చుకున్నారు. 

కాగా గత నెలలో, అహ్మదాబాద్-లండన్ మార్గంలో బోయింగ్ విమానం జరిగిన వినాశకరమైన ప్రమాదంలో 275 మంది మరణించారు. అప్పటి నుండి, బోయింగ్ విమానాలతో సంబంధం ఉన్న అనేక ప్రమాదాలు, తయారీదారు భద్రతా  వ్యవస్థపై అనేక అనుమానాలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే.
 

Videos

వైఎస్ జగన్ హయాంలో ఏపీలో పాఠశాలల రూపురేఖలు మారాయి: సినీనటుడు సుమన్

చిత్తూరుకు YS జగన్

Harish Rao: నీళ్ల విలువ తేలియని నాయకులు పాలకులుగా ఉన్నారు

Venkatram Reddy: కూటమి సర్కార్ కంటే YSRCP పాలనే బెటర్

గిట్టుబాటు ధరల్లేవని మామిడిని రోడ్డు పక్కన పడేస్తున్న రైతులు

చాలాకాలం తర్వాత వెలుగులోకి ఇరాన్ సుప్రీం లీడర్

ఆర్మీ జవాన్ బి.ఎన్.ప్రసాద్ స్థలాన్ని ఆక్రమించిన టీడీపీ నాయకుడు సుందరప్ప

ఆ రోజే మరోసారి కరోనా ప్రళయం.. జపాన్ బాబా మరో సంచలనం

చనిపోయిన వారిని కూడా బదిలీ చేసిన సర్కారు

రోడ్లపై యువకుల హంగామా

Photos

+5

కుట్రాళం జలపాతాలు చూశారా... ???

+5

ఆద్యంతం ఉత్కంఠను రేపే మిస్టరీ పర్యాటక ప్రదేశాలివే..! (ఫోటోలు)

+5

విజయవాడ : రైలు ప్రమాదాల సమయంలో ప్రాణనష్టం నివారణపై మెగా మాక్‌ డ్రిల్‌ (ఫొటోలు)

+5

అనంతపురం : గూగూడులో కుళ్లాయిస్వామి ఉత్సవాలకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

జిడ్డు ఆముదమే కానీ..ఎన్ని ప్రయోజనాలో తెలుసా..! (ఫొటోలు)

+5

హైదరాబాద్ : సాయంత్రం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్‌లో చుక్కలు (ఫొటోలు)

+5

ఆషాడమాసం.. విజయవాడ దుర్గ గుడిలో భక్తుల రద్దీ (ఫోటోలు)

+5

ఆరునెలల జ్ఞాపకాలు పంచుకున్న ప్రభాస్‌ సోదరి (ఫోటోలు)

+5

'అఖండ' కోసం తెలుగులో ఎంట్రీ ఇచ్చేసిన నటి హర్షాలీ మల్హోత్రా (ఫోటోలు)

+5

గర్భాలయంలో ఏడడుగుల విగ్రహం.. ఏపీలో ఈ పురాతన ఆలయం గురించి విన్నారా? (చిత్రాలు)