Breaking News

Air India survivor: ఆ రోజు అతను బతకడం ఓ అద్భుతం..కానీ ఇప్పుడు ప్రతిక్షణం..

Published on Tue, 11/04/2025 - 16:29

జూన్‌ 12న అహ్మదాబాద్‌లో టేకాప్‌ అయిన కొద్దిసేపటికే కూలిపోయిన ఎయిర్‌ ఇండియా విమానంలో ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి విశ్వాస్‌ కుమార్‌ రమేశ్‌..ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఆ రోజు తానెలా బతకాననేది ఒక అద్భుతం కానీ ఇవాళ అదొక పీడకలలా వెంటాడుతోందని ఆవేదనగా చెబుతున్నాడు.  ప్రమాద ఘటన అనంతరం బ్రిటన్‌లో నివాసం ఉంటున్న ఆయన.. స్థానిక మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వడంతో అతడి హృదయ విదారక పరిస్థితి వెలుగులోకి వచ్చింది. 

లక్కీమ్యాన్‌ కాదు..
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్‌ఇండియా ప్రమాదంలో మొత్తం 241 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో బయటపడ్డ ఒకే ఒక్క మృత్యుంజయుడిగా రమేశ్‌ వార్తల్లో నిలిచారు. బ్రిటన్‌లో నివాసముంటున్న విశ్వాస్‌ కుమార్‌.. గుజరాత్‌లోని తన కుటుంబానికి కలిసేందుకు వచ్చి తిరుగు ప్రయాణం అవుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ రోజు విమానంలో 11-ఏ సీటులో విశ్వాస్‌ కుమార్‌ కూర్చున్నారు. ప్రమాదం అనంతరం రక్తపుమరకలతో నడుచుకుంటూ వచ్చి అంబులెన్సు ఎక్కిన దృశ్యాలు ఇప్పటికీ అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. 

అంత పెద్ద ప్రమాదంలో బయటపడ్డ లక్కీమ్యాన్‌గా అందరూ అతన్నిచూస్తుంటే..ఆయన మాత్రం రోజు రోజుకి కుంగిపోతున్నాడు. నిత్య నరకం అనుభవిస్తున్నా అంటూ కన్నీటిపర్యంతమవుతున్నాడు. ఆ ప్రమాదం కారణంగా తన ప్రాణానికి ప్రాణమైన తమ్ముడిని కోల్పోయా..అని బోరుమన్నాడు. ఆ తర్వాత తన జీవితమే తలకిందులైపోయిందని, తన సోదరుడితో కలిసే చేసిన వ్యాపారం కూడా మూతపడిందని ఆవేదనగా చెప్పుకొచ్చాడు. 

తాను తిరిగి నార్మల్‌గా అవ్వడం అంత సులభం కాదని అంటున్నాడు. ఆ ఘటన తర్వాత నెలలతరబడి మౌనంగా ఉన్నట్లు తెలిపాడు. తానెప్పుడు ఇంటిని వదలి బయటకు వెళ్లడం లేదని, బెడ్‌రూంలోనే ఒంటిరిగా కూర్చొని ఉంటానని. తనకోసం తలుపు బయట అమ్మ కూర్చొని ఉంటుందని చెబుతున్నాడు. కనీసం తన కొడుకుతో కూడా సరిగా మాట్లాడలేకపోతున్నానని కన్నీళ్లు పెట్టుకున్నాడు. భరించలేని మానసిక గాయంతో బాధపడుతున్నాని చెబుతున్నాడు. ఇంకా శారీరక అసౌక్యర్యాన్ని ఎదుర్కొటున్నట్లు వివరించాడు. 

భార్య సాయం లేనిదే కనీసం..
తన మోకాలు, భుజం, వెన్ను నొప్పి తోపాటు చేతికి అయ్యిన కాలిన గాయాలతో బాధపడుతున్నానని, భార్య సాయం లేనిదే స్నానం కూడా చేయలేకపోతున్నట్లు బాధగా వెల్లడించాడు. ఇదిలా ఉండగా, లండన్‌ లీసెస్టర్‌ కమ్యునిటీ నాయకుడు, సంజీవ్‌ పటేల్‌, అతని సలమాదారు, ప్రతినిధి రాడర్‌ సీగర్‌లు కూడా తమ వంతుగా రమేష్‌కి మద్దతు అందిస్తున్నామని అన్నారు. 

అలాగే ఎయిర్‌ ఇండియా కూడా రమేష్‌కు సుమారు రూ. 21 లక్షల పరిహారం అందించిందని తెలిపారు. అతనికి ఇప్పుడు ఆర్థిక సాయంతోపాటు మానసిక స్థైర్యం, భరోసా అందించాలని అన్నారు. అదే అతడిని తిరిగి కోలుకునేలా చేయగలదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎయిర్‌ ఇండియా సైతం రమేష్‌కు అవసరమైన సహాయాన్ని అందించడం తమ బాధ్యత అని పేర్కొనడం విశేషం.

 

(చదవండి: భారత్‌పై జర్మన్‌ పర్యాటకుడి ప్రశంసల జల్లు...!)

 

Videos

Jagtial: 2020 నుంచి మార్చురీలోనే మృతదేహం

జూబ్లీహిల్స్ బైపోల్.. వికాసమా.. విధ్వంసమా

ప్రైవేట్ వీడియోలు బయటపెడతా! TV5 మూర్తి గలీజ్ దందా

Bandla Ganesh: నా ఉద్దేశం అది కాదు.. సారీ విజయ్..

ఆదినారాయణ రెడ్డికి రాచమల్లు దిమ్మతిరిగే కౌంటర్

YSRCP నేత పూనూరు గౌతమ్ రెడ్డిపై హత్యాయత్నం

బాబుకు బిగ్ షాక్..! వణుకుతున్న టీడీపీ పెద్ద తలకాయలు

ప్రజా సంకల్పం.. జగన్ పాదయాత్రకు 8 ఏళ్లు పూర్తి

Nellore: మహిళలను తరలిస్తున్న ఆటోను ఢీకొట్టిన కారు

లోకేష్ నెల్లూరు పర్యటనలో అపశృతి

Photos

+5

ఎన్నికల వేళ అరుదైన చిత్రాలు.. బిహార్‌ ఓటర్ల ప్రత్యేక (ఫొటోలు)

+5

#KotiDeepotsavam : ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా కోటి దీపోత్సవం (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవం (ఫొటోలు)

+5

విష్ణు విశాల్‌ ’ఆర్యన్‌‘ మూవీ ప్రీ రిలీజ్‌ (ఫొటోలు)

+5

ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు (ఫొటోలు)

+5

రష్మికా ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

పెళ్లి ఫోటోలు షేర్‌ చేసిన నారా రోహిత్ (ఫోటోలు)

+5

తిరుమలలో బుల్లితెర నటుడు ప్రభాకర్‌ (ఫోటోలు)

+5

వేయి స్తంభాల దేవాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు (ఫోటోలు)

+5

జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు.. సింగర్‌ ఎమోషనల్‌ (ఫోటోలు)