Breaking News

బడి నుంచి మృత్యు ఒడికి...

Published on Sun, 02/05/2023 - 06:30

ప్యాపిలి(నంద్యాల): మరో ఐదు నిమిషాల్లో బడి నుంచి తమ ఇళ్లకు చేరుకోవాల్సిన ఇద్దరు పిల్లలు... డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా ఆటో బోల్తా కొట్టడంతో మృత్యుఒడికి చేరుకున్నారు. అప్పటి వరకు తమతో సరదాగా గడిపిన స్నేహితులు ఒక్కసారిగా రక్తపు మడుగులో అచేతనంగా పడి ఉండటం సహచర విద్యార్థులను కలచివేసింది. ఈ హృదయవిదారక ఘటన నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం నేరేడుచెర్ల వద్ద శనివారం జరిగింది.

రాచర్ల ఉన్నత పాఠశాలలో నేరేడుచెర్ల గ్రామానికి చెందిన శివమ్మ, రంగన్న దంపతుల కుమార్తె రజని(15) పదో తరగతి, ఐరా, మదార్‌ దంపతుల కుమార్తె షాహిదాబి(13) ఎనిమిదో తరగతి చదువుతున్నారు. వీరితోపాటు అదే గ్రామానికి చెందిన మరో 18 మంది విద్యార్థులు కూడా రాచర్ల ఉన్నత పాఠశాలలోనే విద్యనభ్యసిస్తున్నారు. వీరంతా ప్రతి రోజు ఉదయం ఆర్టీసీ బస్సులో పాఠశాలకు వెళ్తారు.

సాయంత్రం ఆటోలో ఇంటికి చేరుకుంటారు. యథావిధిగా శనివారం సాయంత్రం నాలుగు గంటలకు పాఠశాల ముగిసిన తర్వాత ఆటోలో నేరేడుచెర్లకు బయలుదేరారు. అతి వేగంగా వెళుతున్న ఆటో గ్రామ శివారులో మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఆటో డోర్‌ వైపు కూర్చున్న రజని, షాహిదాబి ఎగిరి రోడ్డుపై పడగా, వారి మీద ఆటో పడటంతో ఇద్దరి తలలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మరణించారు.

మిగిలిన విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్థానికులు పెద్ద ఎత్తున వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. పిల్లల రోదనలతో ఘటనాస్థలం దద్దరిల్లింది. రాచర్ల పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. 

సొంత ఆటోలో వస్తూనే.. 
ప్రమాదంలో మృతిచెందిన షాహిదాబి తండ్రి మదార్‌కు టాటా మ్యాజిక్‌ ఆటో ఉంది. ప్రతి రోజు సాయంత్రం మదార్‌ రాచర్ల ఉన్నత పాఠశాలకు వెళ్లి తన కుమార్తెతోపాటు మిగిలిన విద్యార్థినులను ఆటోలో ఎక్కించుకుని నేరేడుచెర్లకు తీసుకువచ్చేవాడు.

అయితే, మదార్‌కు శనివారం వ్యక్తిగత పని ఉండటంతో వెళ్లలేదు. తమ గ్రామానికే చెందిన శివ అనే డ్రైవర్‌ను పంపాడు. అతను వేగంగా నడపడం వల్లే ఆటో బోల్తా పడి షాహిదాబి, రజని మృతిచెందారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు.   

Videos

అందాల యుద్ధం

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడి ఉపనయన వేడుక

రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ తో కాదు.. సుకుమార్ తోనే ..

అల్లు అర్జున్ లేకుండా ఆర్య 3

చంద్రబాబుకు విజయసాయి రెడ్డి అమ్ముడుపోయాడు

వార్ 2 డైరెక్టర్ పై మండిపడుతున్న Jr. NTR ఫ్యాన్స్.. కారణం అదేనా

స్కాంలకు పరాకాష్ట అమరావతి పేరుతో దోపిడీనే : వైఎస్ జగన్

ఈనాడు టాయిలెట్ పేపర్ కి ఎక్కువ.. టిష్యూ పేపర్ కి తక్కువ..

చంద్రబాబు అప్పుల చిట్టా.. ఆధారాలతో బయటపెట్టిన వైఎస్ జగన్

మన యుద్ధం చంద్రబాబు ఒక్కడితో కాదు..!

Photos

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కాన్స్‌లో అదితి : ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)