Breaking News

మద్యానికి బానిసైన తండ్రి.. తల్లిని వేధిస్తున్నాడన్న కోపంతో..

Published on Wed, 06/02/2021 - 08:53

ఊర్కొండ (నాగర్‌ కర్నూల్‌): తరచూ తల్లిని వేధిస్తుండటాన్ని తట్టుకోలేక తండ్రిని తనయుడు నరికి చంపిన ఘటన మండలంలోని ఇప్పపహాడ్‌లో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. ఇప్పపహాడ్‌కు చెందిన డబ్బా రాములు (52), భార్య రామచంద్రమ్మ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా.. వీరి కుమారులు యాదగిరి, విష్ణు హైదరాబాద్‌కు వలస వెళ్లారు. అయితే మద్యానికి బానిసైన రాములు తాగినప్పుడల్లా భార్యను వేధించడంతోపాటు చితకబాదేవాడు.

మూడురోజుల క్రితం తాగి వచ్చి కొట్టడంతో రామచంద్రమ్మ కుమారులకు సమాచారం అందించింది. వారు గ్రామానికి చేరుకుని తండ్రితో వాగ్వాదానికి దిగి మందలించారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం పెద్దకుమారుడు యాదగిరి పొలానికి వెళ్లగా.. చిన్న కుమారుడు విష్ణు ఇంటి వద్దే ఉన్నాడు. రాములు భార్యను కొట్టడంతో కోపోద్రిక్తుడైన చిన్న కుమారుడు విష్ణు గొడ్డలితో తండ్రిపై దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే పెద్ద కుమారుడు యాదగిరి, రామచంద్రమ్మ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు.

విషయం తెలుసుకున్న కల్వకుర్తి సీఐ సైదులు, స్థానిక ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ఆస్పత్రికి తరలించారు. నిందితుడు విష్ణు పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని సీఐ తెలిపారు. ఈ ఘటనపై పెద్ద కుమారుడు యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)