Breaking News

బిట్‌ కాయిన్స్‌ పేరుతో రూ.60 లక్షలు స్వాహా

Published on Sat, 06/26/2021 - 07:13

హిమాయత్‌నగర్‌: ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగులైన భార్యాభర్తలను టార్గెట్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు బిట్‌ కాయిన్స్‌గా పిలిచే క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పేరుతో రూ.60 లక్షలు కాజేశారు. బాధితులు శుక్రవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

  • అమీర్‌పేటకు చెందిన వంశీమోహన్‌ దంపతులు ‘జిప్‌బిట్‌’ యాప్‌ ద్వారా బిట్‌ కాయిన్స్‌ క్రయవిక్రయాలు చేస్తుంటారు.  దీని ద్వారానే పరిచయమైన ఓ వ్యక్తి తన ద్వారా పెట్టబడిపెడితే అధిక లాభాలు వచ్చేలా చేస్తానని ఎర వేశాడు. 
  • ఇద్దరూ కలిసి అతడి ద్వారా రూ.10 లక్షల ఇన్వెస్ట్‌ చేశారు. ప్రపంచ మార్కెట్‌లో బిట్‌ కాయిన్‌ విలువ పెరుగుతున్నప్పటికీ... వీరి కాయిన్స్‌ వివరాలు తెలియట్లేదు.దీంతో అనుమానం వచ్చి ఆ వ్యక్తిని మరోసారి సంప్రదించగా, మీ కాయిన్లు భద్రమని, ప్రస్తుత పరిస్థితుల్లో రూ.50 లక్షలకు పైగా వెచ్చించి కాయిన్స్‌ ఖరీదు చేస్తేనే అధిక లాభాలు వస్తాయని నమ్మబలికాడు. 
  • దీంతో వారు అతడు చెప్పిన మొత్తం ఇన్వెస్ట్‌ చేశారు. ఇందులో కొంత జిప్‌బిట్‌ యాప్‌ ద్వారా, మిగిలింది ముంబై, పూణే నగరాలకు చెందిన పలు బ్యాంక్‌ ఖాతాలకు బదిలీ చేశారు.  లాభాలు రాకపోవడంతో సదరు వ్యక్తితో చాటింగ్‌ చేయగా,  కచ్చితంగా లాభం వచ్చిందని, ఆన్‌లైన్‌లో కాయిన్‌ వాల్యూ చూసుకోవాలని సూచించాడు. 
  • ఆ తర్వాత అతడి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయామని గ్రహించి శుక్రవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
    చదవండి: దారుణం: తుపాకీ గురిపెట్టి లైంగిక వేధింపులు

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)