ఎగ్జిట్ పోల్ ఇవ్వలేం, Axis My India రియాక్షన్
Breaking News
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Published on Thu, 04/30/2026 - 15:43
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 582.86 పాయింట్లు లేదా 0.75 శాతం నష్టంతో 76,913.50 వద్ద, నిఫ్టీ 180.10 పాయింట్లు లేదా 0.74 శాతం నష్టంతో 23,997.55 వద్ద నిలిచాయి.
సెమిండియా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, కాలిఫోర్నియా సాఫ్ట్వేర్ కంపెనీ లిమిటెడ్, ఎంటీఏఆర్ టెక్నాలజీస్ లిమిటెడ్, బీసీపీఎల్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ఆర్పీజీ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఇన్వెస్కో ఇండియా గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్, వేదాంత లిమిటెడ్, వారీ ఎనర్జీస్ లిమిటెడ్, హెచ్ఈజీ లిమిటెడ్, ఇండియన్ మెటల్స్ & ఫెర్రో అల్లాయ్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.
Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.
Tags : 1