LIVE: ఆక్వా రైతులతో వైఎస్ జగన్
Breaking News
స్టాక్ మార్కెట్: ఐదో రోజూ నష్టాలే..
Published on Fri, 07/24/2026 - 15:52
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజూ నష్టాలతోనే ముగిశాయి. పెరిగిన చమురు ధరల మధ్య ద్రవ్యోల్బణం, వృద్ధి మందగమన భయాలతో మదుపరులు అమ్మకాలకు దిగడంతో బెంచ్మార్క్ సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ శుక్రవారం నష్టాలతో సెషన్ను ముగించాయి.
సెన్సెక్స్ 332 పాయింట్లు లేదా 0.43 శాతం క్షీణించి 76,059.77 వద్ద, నిఫ్టీ 102.15 పాయింట్లు లేదా 0.43 శాతం క్షీణించి 23,767.45 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 ఇండెక్స్ లో ఎటర్నల్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా టాప్ లూజర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 0.1 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.32 శాతం నష్టపోయాయి.
రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఆటో 1 శాతం పతనమై అత్యంత చెత్త పనితీరు కనబరిచింది. నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ ఫార్మా కూడా తక్కువ పనితీరు కనబరిచాయి. నిఫ్టీ మీడియా, నిఫ్టీ ఐటీ షేర్లు మెరుగైన పనితీరు కనబరిచాయి.
Tags : 1