Breaking News

గడగడలాడిస్తున్న మహిళా ఉద్యోగులు! దిగ్గజ కంపెనీల్లో రాజీనామాల సునామీ!

Published on Wed, 04/27/2022 - 07:40

ముంబై: మహిళల్లో చెప్పుకోతగ్గ మంది వచ్చే రెండేళ్ల కాలంలో ఉద్యోగాలను మానేయాలని అనుకుంటున్నారు. పనిలో అలసిపోవడం, పని వేళలు అనుకూలంగా లేకపోవడం వారిని ఈ నిర్ణయం దిశగా నడిపిస్తున్నట్టు డెలాయిట్‌ నిర్వహించిన సర్వేలో తెలిసింది. కరోనా విపత్తు సమయంలో పెద్దఎత్తున ఉద్యోగాలు వీడిపోవడం (గ్రేజ్‌ రిజిగ్నేషన్‌) మహిళా ఉద్యోగుల్లో ఇంకా కొనసాగుతున్నట్టుందని డెలాయిట్‌ సర్వే నివేదిక ‘ఉమెన్స్‌ ఎట్‌ వర్క్‌ 2022’ తెలిపింది. 

ఏడాది క్రితంతో పోలిస్తే తాము ఎదుర్కొంటున్న ఒత్తిళ్ల స్థాయి పెరిగిపోయినట్టు 56 శాతం ఉద్యోగినులు తెలిపారు. 2021 నవంబర్‌ నుంచి 2022 ఫిబ్రవరి వరకు ప్రపంచవ్యాప్తంగా 10 దేశాల పరిధిలో నిర్వహించిన ఈ సర్వేలో 5,000 మంది మహిళలు పాల్గొన్నారు.

పని ఒత్తిడితో అసలిపోవడమే మహిళలు ఉద్యోగాలను వదిలేద్దామనుకోవడానికి ప్రధాన కారణంగా ఉంది. 40 మంది ఇదే కారణంతో కొత్త సంస్థకు మారిపోదామని చూస్తున్నారు. సర్వేలో సగం మంది వచ్చే రెండేళ్లలో ప్రస్తుత సంస్థను విడిచిపెడతామని చెప్పారు. ప్రస్తుత సంస్థతో మరో ఐదేళ్లకు పైగా కొనసాగుతామని చెప్పిన వారు కేవలం 9 శాతంగానే ఉన్నారు. 

కలుపుకుని పోవడం లేదు..  
పని ప్రదేశాల్లో తమను కలుపుకుని పోవడం లేదన్నది మహిళా ఉద్యోగుల ఫిర్యాదుల్లో ప్రముఖంగా ఉంది. కొద్ది మంది అంటే 24 శాతం మంది ఈ విషయాన్ని పనిచేసే సంస్థల దృష్టికి తీసుకెళ్లారు. 12 నెలల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం తమ కెరీలో వృద్ధి అవకాశాల పట్ల ఏమంత ఆశావహంగా లేమని ఎక్కువ మంది చెప్పారు. హైబ్రిడ్‌ విధానంలో పనిచేసే వారు (ఇంటి నుంచి, కార్యాలయం నుంచి) ముఖ్యమైన సమావేశాలకు తమను పిలవడం లేదని భావిస్తున్నారు.

చదవండి👉వందల మంది ఉద్యోగుల రాజీనామా..దెబ్బకి దిగొచ్చిన కంపెనీ.. వారానికి 4 రోజులే పని!

Videos

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)