Breaking News

E20 పెట్రోల్‌తో ఇంజిన్లు పాడవుతున్నాయా?

Published on Wed, 08/05/2026 - 09:10

దేశంలో E20 (20 శాతం ఇథనాల్ మిశ్రమం కలపిన పెట్రోల్‌) పెట్రోల్ వినియోగం, ఇంధన నాణ్యతపై ఇటీవల ప్రచారంలోకి వచ్చిన వార్తలపై ‘సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫాక్చరర్స్’ (సియామ్‌) స్పష్టత నిచ్చింది. సాంకేతిక చర్చలలోని కొన్ని అంశాలను పాక్షికంగా చర్చించిన తర్వాత చేసిన ప్రచారాన్ని ఖండిస్తూ మునుపటి లేఖను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.

భారత ఇంధన భద్రతకు కట్టుబడి ఉన్నాం

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన E20 ఇంధన రంగానికి ఆటోమొబైల్ పరిశ్రమ పూర్తిగా మద్దతు ఇస్తుందని సియామ్ స్పష్టం చేసింది. దేశ ఇంధన స్వయంసమృద్ధి, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ఇథనాల్ బ్లెండింగ్ అత్యంత కీలకమైనదని తెలిపింది. వాహనదారులకు నాణ్యమైన సేవలు అందించడమే తమ ప్రాధాన్యమని పేర్కొంది.

కఠినమైన నాణ్యతా ప్రమాణాలు

కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఇథనాల్ సరఫరా ప్రక్రియలో క్లోరైడ్, సల్ఫర్ స్థాయిలను గరిష్టంగా 3 పీపీఎం పరిమితికి లోబడి ఉంచాలని ముందు జాగ్రత్త మార్గదర్శకాలను జారీ చేసిందని సియామ్ గుర్తుచేసింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రోజూ 150కి పైగా పారామితుల్లో ఇంధనాన్ని క్షుణ్ణంగా పరీక్షిస్తున్నాయని తెలిపింది.

నిరంతర తనిఖీలు

దేశవ్యాప్తంగా ఉన్న 87,000కు పైగా పెట్రోల్ బంకుల్లో ఇంధనంలో నీరు చేరకుండా రోజుకు 8 నుంచి 12 సార్లు తనిఖీలు నిర్వహిస్తున్నారని వెల్లడించింది. దేశవ్యాప్తంగా పరీక్షించిన వేల కొద్దీ శాంపిళ్లలో వ్యత్యాసాలు అత్యంత అరుదుగా మాత్రమే నమోదయ్యాయని వివరించింది. ఆటోమొబైల్ తయారీదారులు, ఆయిల్ కంపెనీలు, సాంకేతిక నిపుణుల మధ్య ఇంధన నాణ్యతపై చర్చలు నిరంతరం సాగే ప్రక్రియ అని, మీడియాలో వచ్చిన కథనాలను ప్రాతిపదికగా తీసుకుని వాహనదారులు, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సియామ్ స్పష్టం చేసింది.

మునుపటి లేఖలో ఇలా..

‘E20 పెట్రోల్‌లో క్లోరైడ్, తేమ స్థాయిలు ఎక్కువగా ఉండడం వల్ల ఇంధన నాణ్యత దెబ్బతింటోంది. ఫలితంగా వాహనాల ఇంజిన్ భాగాలు త్వరగా తుప్పు పట్టి పాడవుతున్నాయి. ఫ్యూయల్ పంపులు, ఫ్యూయల్ ఇంజెక్టర్లు, ఈజీఆర్ వాల్వ్‌లు, ఎగ్జాస్ట్ వ్యవస్థలోని ఇతర కీలక భాగాలు త్వరగా పాడైపోతున్నాయి. వాటి రీప్లేస్‌మెంట్‌లు భారీగా పెరిగాయి’ అని సియామ్ మునుపటి లేఖ ద్వారా ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.

ఇదీ చదవండి: మెరుపు తగ్గిన మేలిమి బంగారం

Videos

NRI మహిళపై TDP మంత్రి లైంగిక వేధింపులు

తమాషాలు చేస్తున్నారా? పోలీసులపై అమర్నాథ్ ఫైర్!

తొలి బడ్జెట్ ప్రవేశపెట్టిన విజయ్ ప్రభుత్వం

భారత్‌పై వ్యాఖ్యలు.. చివరకు క్షమాపణ చెప్పిన Mark Zuckerberg

హైడ్రా రంగనాథ్ సంతకం ఫోర్జరీ 8 కాలేజీలు క్లోజ్

జగన్ పర్యటనలో ఆసక్తికర సన్నివేశం

రాసిపెట్టుకోండి.. ఆంధ్ర రాష్ట్రానికి ఒక్కడే రారాజు

దుబాయ్ గుండెలపై మిస్సైళ్ళ వరం

క్రికెట్ వదిలి ఆఫీస్ కి ఇషాన్ కిషన్ శాలరీ ఎన్ని లక్షలో తెలుసా ?

రెండేళ్లలో మీ వల్ల జరిగింది ఇదే.. ! PIB రిపోర్ట్ చదివి వినిపించిన YS జగన్

Photos

+5

బ్లూ శారీలో టాలీవుడ్ నటి అనసూయ అందాలు (ఫొటోలు)

+5

గ్రీన్ డ్రెస్‌లో మెరిసిపోతున్న బిగ్‌బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ దేవరపల్లి పర్యటన.. ప్రజలు బ్రహ్మరథం (ఫొటోలు)

+5

అందాల ఆషికా రంగనాథ్ పుట్టినరోజు స్పెషల్ (ఫొటోలు)

+5

పట్టుచీరలో బుట్టబొమ్మలా తెలుగు హీరోయిన్ (ఫొటోలు)

+5

'వారణాసి' షూటింగ్ చేసిన చోట 'దృశ్యం' పాప (ఫొటోలు)

+5

బన్నీ 'వరుడు' హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫొటోలు)

+5

హ హ హాసిని బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

గోల్డ్ కలర్ డ్రెస్‌లో అదరగొట్టిన తెలుగుగమ్మాయి.. ఈషా రెబ్బా (ఫొటోలు)

+5

భిక్షు యాదవ్‌, రాస్‌ బిహారీ.. ప్రదీప్‌ రావత్‌లోని మరో కోణం ఇది (ఫొటోలు)