Breaking News

ఎగుమతుల పెంపుకు కేంద్రం వ్యూహం.. బ్రాండ్‌ ఇండియాపై భరోసా..

Published on Wed, 01/05/2022 - 09:09

న్యూఢిల్లీ: భారత్‌ నుంచి ఎగుమతులను మరింతగా పెంచుకునేందుకు వీలుగా కేంద్ర వాణిజ్య శాఖ ‘బ్రాండ్‌ ఇండియా’ పేరిట ప్రచార కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలనుకుంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 400 బిలియన్‌ డాలర్లను మించనున్నాయని అంచనా. దీంతో భారత్‌ చేసే వస్తు, సేవల ఎగుమతులకు మరింత ప్రచారం తీసుకురావడం ద్వారా ఎగుమతులు పెంచుకోవాలని వాణిజ్య శాఖ భావిస్తోంది. 

బ్రాండ్‌ ఇండియా ప్రమోషన్‌లో భాగంగా ముందుగా జెమ్స్, జ్యుయలరీ, టెక్స్‌టైల్స్, ప్లాంటేషన్, టీ, కాఫీ, మసాలా దినుసులు, విద్య, హెల్త్‌కేర్, ఫార్మా, ఇంజనీరింగ్‌ ఉత్పత్తుల ఎగుమతులకు ప్రచారం కల్పించనుంది. నాణ్యత, వారసత్వం, టెక్నాలజీ, విలువ, ఆవిష్కరణలపై ప్రత్యేక దృష్టి సారించనుంది. ఇండియా బ్రాండ్‌ ఈక్విటీ ఫౌండేషన్‌ (ఐబీఈఎఫ్‌) నిర్వహిస్తున్న బ్రాండ్‌ ఇండియా ప్రచారం పురోగతిపై ఇటీవలే కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ సమీక్ష నిర్వహించారు. భారత్‌లో తయారీ అయ్యే ఉత్పత్తులు, సేవల గురించి అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో ప్రచారం, అవగాహన కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ ఐబీఈఎఫ్‌.
 

Videos

Anakapalle: అచ్యుతాపురంలో మరో భారీ అగ్నిప్రమాదం

గతంలో రెండుసార్లు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ సుధీర్‌రెడ్డి

స్కూల్ ఎంత ఘోరంగా ఉందో చూడండి... ఇప్పటికైనా కళ్లు తెరవండి

Drugs Case: పదేళ్లు జైలు శిక్ష! అడ్వకేట్ షాకింగ్ కామెంట్స్

TS: సుధీర్ రెడ్డితో పాటు మరొకరిని అరెస్ట్ చేసిన పోలీసులు

అమెరికా బలగాల అదుపులో వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో

బర్సె దేవాతో పాటు లొంగిపోయిన మరో 20 మంది మావోయిస్టులు

East Godavari: రైస్ మిల్లర్ల భారీ మోసం... పవన్.. దమ్ముంటే ఇప్పుడు సీజ్ చెయ్

కూతురి సర్జరీ కోసం వెళితే.. ఏపీ ప్రభుత్వ ఆస్పత్రిలో పరిస్థితి ఇది

బళ్లారి అల్లర్ల వ్యవహారంలో ఎస్పీ పవన్ నిజ్జర్ ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం

Photos

+5

టాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లు కలిసి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటే? (ఫొటోలు)

+5

కజిన్ పెళ్లిలో హృతిక్ రోషన్ సందడే సందడి (ఫొటోలు)

+5

‘సైక్‌ సిద్ధార్థ్‌’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

ఏం మాయ చేశావే!.. వెండితెరపై మరో మల్లూ సెన్సేషన్‌ (ఫొటోలు)

+5

మణికొండలో సందడి చేసిన నటి దివి వద్త్య (ఫొటోలు)

+5

హైదరాబాద్ : మహా నగరంపై మంచు తెర..(ఫొటోలు)

+5

టీటీడీ విజిలెన్స్‌.. మరీ ఇంత అధ్వాన్నమా? (ఫొటోలు)

+5

గోదారి గట్టుపైన మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

2025కి వీడ్కోలు.. పీవీ సింధు క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ దుబాయి ట్రిప్ (ఫొటోలు)