అదిగో నా కోడలు.. వసంత కృష్ణ ప్రసాద్ ఆఫీస్ వద్ద.. సంచలన వీడియో బయటపెట్టిన జోగి రమేష్
Breaking News
పుంజుకున్న స్టాక్మార్కెట్లు.. లాభాల్లో ఐటీ షేర్లు
Published on Mon, 08/24/2026 - 09:54
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:47 సమయానికి నిఫ్టీ(Nifty) 24 పాయింట్లు పెరిగి 24,276 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 121 పాయింట్లు పుంజుకొని 77,662 వద్ద ట్రేడవుతోంది.
ఇన్ఫోసిస్, హిందాల్కో ఇండస్ట్రీస్, హెచ్సీఎల్ టెక్ నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ గెయినర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.17 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.33 శాతం పెరిగాయి. రంగాల వారీగా నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మీడియా మెరుగైన పనితీరు కనబరిచగా, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ హెల్త్ కేర్ తక్కువ పనితీరు కనబరిచాయి.
ఇదీ చదవండి: ఈ చిట్కాలతో.. మహిళలకూ ట్రేడింగ్ సులువే..
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.80
బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 90.48 డాలర్లు
యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.71 శాతానికి చేరాయి.
గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.43 శాతం పెరిగింది.
నాస్డాక్ 0.43 శాతం పుంజుకుంది.
Today Nifty position 24-08-2026(time: 9:52 am)

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Tags : 1