Ambati: వీళ్ళందరూ హంతకులే..!
Breaking News
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
Published on Thu, 06/18/2026 - 15:42
గురువారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 254.36 పాయింట్లు లేదా 0.33 శాతం లాభంతో 77,409.98 వద్ద, నిఫ్టీ 82.30 పాయింట్లు లేదా 0.34 శాతం లాభంతో 24,168.00 వద్ద నిలిచాయి.
ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, బాటా ఇండియా లిమిటెడ్, కేపీఆర్ మిల్ లిమిటెడ్, జోడియాక్ క్లాతింగ్ కంపెనీ లిమిటెడ్, డైనమిక్ కేబుల్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. వర్వీ గ్లోబల్ లిమిటెడ్, ఐఎఫ్సీఐ లిమిటెడ్, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్, డిబి (ఇంటర్నేషనల్) స్టాక్ బ్రోకర్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Tags : 1