మంత్రి టీజీ భరత్ అనుచరుడు వేధింపులకు యువకుడు బలి
Breaking News
ఆరంభం... ముగింపు అక్కడే!
Published on Mon, 05/04/2026 - 01:37
‘‘వారణాసి’ చిత్రకథ వారణాసి ఘాట్లలో ఆరంభమై, అక్కడే ముగుస్తుంది’’ అని పేర్కొన్నారు ఎస్ఎస్ కార్తికేయ. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతున్న చిత్రం ‘వారణాసి’. కేఎల్ నారాయణ, కార్తికేయ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు కీలక పాత్రలు ΄ోషిస్తున్నారు. ఇటీవల మెక్సికోలో జరిగిన ‘కామిక్ కాన్ ఎక్స్పీరియన్స్’లో ఈ చిత్రం వీడియో గ్లింప్స్ని ప్రదర్శించారు. ఆ ఈవెంట్లో కార్తికేయ మాట్లాడుతూ... ఈ సినిమా వారణాసి ఘాట్స్లో ఆరంభమై, అక్కడే ముగుస్తుందని పేర్కొన్నారు.
ఇంకా దాదాపు 20 నిమిషాల పాటు సాగే రామాయణం ఎపిసోడ్ అద్భుతంగా ఉంటుందని తెలిపారు కార్తికేయ. ఒక కొత్త కోణంలో రాజమౌళి చిత్రీకరించిన ఈ ఎపిసోడ్ మొత్తం ఇప్పటివరకూ భారతీయ తెరపై చూడని విధంగా ఉంటుందని, విజువల్గా స్టన్నింగ్గా ఉంటుందని కూడా పంచుకున్నారు. తెరపై కనిపించే ఈ 20 నిమిషాల ఎపిసోడ్ చిత్రీకరణకు దాదాపు 60 రోజులు పట్టిందట. ప్రస్తుతం ఈ సినిమా షూట్ అంటార్కిటికాలో జరుగుతోంది. 2027 ఏప్రిల్ 7న ‘వారణాసి’ విడుదల కానుంది.
Tags : 1