Breaking News

ప్రముఖ హీరోయిన్‌కు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ

Published on Tue, 02/17/2026 - 10:28

బాలీవుడ్‌ ప్రముఖ నటి అమీషా పటేల్‌పై మొరాదాబాద్‌ కోర్టు   నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2017లో జరిగిన లావాదేవీలకు సంబంధించిన ఒక ఒప్పందంలో ఆమె ఉల్లంఘించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఆమెకు పలుమార్లు కోర్టు సమన్లు ​​జారీ చేసినప్పటికీ హాజరు కావడం లేదు.  దీంతో తాజాగా నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయబడింది.

2017న వ్యాపారావేత్త ఆయుష్ అగర్వాల్ కుటుంబ వివాహ వేడుకలో నటి అమీషా పటేల్‌  ప్రదర్శన కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఆమెకు ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ యజమాని పవన్ కుమార్ వర్మ రూ. 14.50 లక్షలు అడ్వాన్స్‌ కూడా ఇచ్చారు. ఆపై మొరాదాబాద్‌లోని ఢిల్లీ రోడ్‌లోని ఒక హోటల్‌లో అమీషా పటేల్‌ కోసం లగ్జరీ హోటల్‌ బుకింగ్‌ చేశారు. అయితే, చివరి క్షణంలో ఆమె రావడం లేదని షాకిచ్చింది. తనకు ఇచ్చిన పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని  హామీ ఇచ్చిన అమీషా. . రూ. 10 లక్షలు మాత్రమే తిరిగి చెల్లించారని మిగిలిన రూ. 4.50 లక్షల చెక్కు తరువాత బౌన్స్ అయిందని  కోర్టుకు వర్మ తెలిపారు.  తనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. 

దీంతో అదనపు సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ కోర్టు అమీషా పటేల్‌కు పలుసార్లు సమన్లు ​​జారీ చేసింది. కానీ, ఆమె హాజరు కాలేదు. ఆమె హాజరును నిర్ధారించడానికి కోర్టు ఇప్పుడు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అమీషా తరపు న్యాయవాది అభిషేక్ శర్మ మాట్లాడుతూ.. ఈ వివాదం 2017 నాటిదని, ఒక ఒప్పందం ద్వారా సమస్య ఎప్పుడో క్లియర్‌ అయిందన్నారు. ఆమేరకు మొత్తం డబ్బును తిరిగి ఇచ్చిందని ఆయన అన్నారు. 

అమీషా పటేల్‌ వివరణ
ఈ విషయంపై అమీషా పటేల్‌ సోషల్‌మీడియా ద్వారా రియాక్ట్‌ అయ్యారు. 'అర్ధిక లావాదేవీలకు సంబంధించి పవన్ వర్మతో సెటిల్‌మెంట్ గతంలోనే పూర్తి అయింది. ఆమేరకు డీడ్‌పై కూడా అతను సంతకం చేశాడు. తను అంగీకరించిన మొత్తాన్ని ఎప్పుడో చెల్లించాను. అయినప్పటికీ అతను తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసులు నమోదు చేసినట్లు కనిపిస్తోంది. నా న్యాయవాదులు తను చేస్తున్న మోసంపై తగిన క్రిమినల్ చర్యలు తీసుకోనున్నారు. తప్పుడు ఆరోపణలు చేయడం తను ఇప్పటికైనా మానుకోవాలి.' అని అమీషా తెలిపింది.


 

Videos

చంద్రబాబుకు బిగ్ షాక్ సొంత సర్వేలో 40 MLAల అవినీతి

బావతో పెళ్లి ఇష్టంలేక ... కుంభమేళా మోనాలిసా ప్రేమకథ..

భారత్ కు వస్తున్న నౌకను పేల్చేసిన ఇరాన్..!

ఇరాన్ ఓపెన్ వార్నింగ్ 200 డాలర్లకు చమురు ధర! ఇక ఆర్థిక సంక్షోభమే

రష్మిక కోసం విజయ్ చేసిన ఫస్ట్ ట్వీట్ ఏంటో తెలుసా..?

వదంతులకు ఇది సమయం కాదు : హర్దీప్ పూరి

కూటమి ప్రభుత్వం వచ్చాక ఆలయాలపై దాడులు పెరిగిపోయాయి

దేశంలో గ్యాస్ కొరత లేదు... కేంద్రం కీలక ఆదేశాలు

దుబాయ్ పై మరోసారి దాడి..

షా గౌస్ రెస్టారెంట్లో... గ్యాస్ కొరత ఏర్పడడంతో...

Photos

+5

హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్‌ కార్యకలాపాలు (ఫోటోలు)

+5

వాళ్లిద్దరి వల్లే ట్రిప్‌ ఎంతో స్పెషల్‌: మెహరీన్‌ (ఫోటోలు)

+5

తాడేపల్లి : వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ వేడుకల్లో వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

నాగచైతన్య ‘వృషకర్మ’ మూవీ HD వర్కింగ్ స్టిల్స్

+5

అడివి శేష్‌ 'డెకాయిట్‌' మూవీ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో పశ్చిమాసియా యుద్ధ ప్రభావం..మూతపడుతున్న హోటళ్లు (ఫొటోలు)

+5

హైదరాబాద్ : రాత్రిపూట చార్మినార్‌ వద్ద రంజాన్‌ సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో వేల్స్‌ మహిళల హాకీ జట్టు సందడి (ఫొటోలు)

+5

అంగరంగ వైభవంగా ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ఫోన్లు చోరీ.. మూడు కోట్ల విలువైన మొబైల్స్‌ రికవరీ (ఫొటోలు)