ఏపీలో కాంగ్రెస్, టీడీపీ ములాఖత్.. బండారం బద్దలైంది | Sakshi
Sakshi News home page

ఏపీలో కాంగ్రెస్, టీడీపీ ములాఖత్.. బండారం బద్దలైంది

Published Fri, May 10 2024 12:53 PM

Congress And Tdp Mulakhat In Ap

సాక్షి, పశ్చిమగోదావరి: చింతలపూడిలో టీడీపీ, కాంగ్రెస్‌ బండారం బట్టబయలైంది. తాము ఎటూ గెలవలేం, వైఎస్సార్‌సీపీని నియంత్రించడమే లక్ష్యంగా పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు నీచ రాజకీయాలకు తెర తీస్తున్నాయి.

టీడీపీ అభ్యర్థి రోషన్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి ఎలీజా భేటీ అయ్యారు. ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ కలిసి పనిచేయాలని డీల్‌ కుదిరింది. రాష్ట్రంలో అన్ని చోట్ల టీడీపీ కోసం పనిచేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. చంద్రబాబు, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మధ్య కుదిరిన ఒప్పందం లో భాగంగా కుప్పం, మంగళగిరి, పిఠాపురం వైపు షర్మిల కన్నెత్తి కూడా చూడలేదు.

మంగళగిరిలో లోకేష్‌కి వ్యతిరేకంగా షర్మిల ప్రచారం చేయలేదు. మంగళగిరి సీటు సీపీఎంకి ఇచ్చి ప్రచారానికి కూడా షర్మిల వెళ్లేలేదు.పిఠాపురంలోనూ పీసీసీ అధ్యక్షురాలు ప్రచారం చేయలేదు. అన్ని చోట్ల కాంగ్రెస్, టీడీపీ మధ్య సర్దుబాట్లు జరిగినట్లు సమాచారం.

 

Advertisement
 
Advertisement