పంజాబ్‌లో మరో అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ | Sakshi
Sakshi News home page

పంజాబ్‌లో మరో అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ

Published Fri, May 10 2024 7:24 PM

BJP Announces Gejja Ram Valmiki As Candidate From Fatehgarh Sahib Seat

చండీఘర్: దేశంలో మూడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు ముగిసాయి. ఇంకా నాలుగు దశల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. ఈ తరుణంలో బీజేపీ పంజాబ్‌లోని ఫతేఘర్ సాహిబ్ రిజర్వ్ పార్లమెంటరీ నియోజకవర్గం అభ్యర్థిని ప్రకటించింది.

పంజాబ్ రాష్ట్ర సఫాయి కరంచారి కమిషన్‌కు ఛైర్మన్‌ అయిన 'గెజ్జా రామ్ వాల్మీకి'ని బీజేపీ పంజాబ్‌లోని ఫతేఘర్ సాహిబ్ రిజర్వ్ పార్లమెంటరీ నియోజకవర్గం బరిలో దింపింది. దీంతో పంజాబ్‌లోని మొత్తం 13 లోక్‌సభ స్థానాలకు ఆ పార్టీ ఇప్పుడు తన అభ్యర్థులను ఎంపిక చేసి పోటీకి దింపింది.

గెజ్జా రామ్ వాల్మీకి పోటీ చేస్తున్న ఈ నియోజక వర్గంలో ఆప్‌కి చెందిన గురుప్రీత్ సింగ్ జీపీ , కాంగ్రెస్ పార్టీకి చెందిన అమర్ సింగ్, శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి బిక్రమ్‌జిత్ సింగ్ ఖల్సా పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఫతేఘర్ సాహిబ్ స్థానానికి కాంగ్రెస్ ఎంపీ అమర్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Advertisement
 
Advertisement