-
ఫైనల్లో బోపన్న జోడీ
ఫ్లోరిడా: ప్రతిష్టాత్మక మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నిలో భారత స్టార్ రోహన్ బోపన్న డబుల్స్ విభాగంలో తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) ద్వయం 6–1, 6–4తో నాలుగో సీడ్ మార్సెల్ గ్రానోలెర్స్ (స్పెయిన్)–హొరాసియో జెబలాస్ (అర్జెంటీనా) జంటపై విజయం సాధించింది. 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో బోపన్న–ఎబ్డెన్ రెండు ఏస్లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేశారు. క్వార్టర్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 3–6, 7–6 (7/3), 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో జాన్ ప్యాట్రిక్ స్మిత్ (ఆ్రస్టేలియా)–సెమ్ వెర్బీక్ (నెదర్లాండ్స్) జోడీపై గెలిచింది. భారత్కే చెందిన మహేశ్ భూపతితో కలిసి బోపన్న చివరిసారి 2012లో మయామి ఓపెన్ టోర్నీ డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి ప్రవేశించి ఓడిపోయాడు. -
బీజేపీ: వరుణ్ గాంధీకి టికెట్ దక్కేనా?
లోక్సభ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసేందుకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) శనివారం ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో సమావేశమైంది. బీహార్, రాజస్థాన్తో పాటు యూపీలోని మిగిలిన 24 స్థానాలతో సహా ఇతర రాష్ట్రాల అభ్యర్థుల విషయమై చర్చించారు. అలాగే వరుణ్ గాంధీకి పిలిభిత్ స్థానం కేటాయించాలా వద్దా? అనేదానిపై కూడా చర్చ జరిగిందని తెలుస్తోంది. అన్ని లోక్సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయని, అయితే వీటిని దశలవారీగా విడుదల చేయనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం యూపీలో మొదటి దశలో మిగిలిన మూడు స్థానాలైన పిలిభిత్, మొరాదాబాద్, సహరన్పూర్ స్థానాల అభ్యర్థుల జాబితాను ఆదివారం విడుదల చేయవచ్చని తెలుస్తోంది. యూపీలో మొదటి దశలో మొత్తం ఎనిమిది లోక్సభ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. వీటిలో సహారన్పూర్, కైరానా, ముజఫర్నగర్, బిజ్నోర్, నగీనా, మొరాదాబాద్, రాంపూర్ మరియు పిలిభిత్ ఉన్నాయి. ఇందులో ఇప్పటి వరకు ఐదు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు. పిలిభిత్, సహరన్పూర్, మొరాదాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. పిలిభిత్ స్థానానికి అభ్యర్థిని నిర్ణయించడంపై సీఈసీ సమావేశంలో పెద్ద ఎత్తున చర్చ జరిగినట్లు తెలుస్తోంది. వరుణ్ గాంధీ ప్రస్తుతం ఇక్కడ ఎంపీగా ఉన్నారు. అయితే ఈ సారి ఆయనకు టిక్కెట్ కేటాయించకుండా, కొత్తవారిని రంగంలోకి దింపుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన గతంలో సొంత పార్టీపై చేసిన విమర్శలే ఇందుకు కారణమని చెబుతున్నారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఎన్నికల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి, ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ ధరంపాల్ తదితరులు పాల్గొన్నారు. యూపీకి సంబంధించిన మిగిలిన 24 సీట్ల జాబితాను ఒకేసారి విడుదల చేయకుండా దశలవారీగా విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. -
కొత్త విజేత ఎవరో!
న్యూఢిల్లీ: ఇంకొన్ని రోజుల్లో ఐపీఎల్... ఈ రోజేమో డబ్ల్యూపీఎల్ ఫైనల్... ముందున్న క్రికెట్ పండగకు నేడు జరిగే టైటిల్ పోరు ఏమాత్రం తీసిపోదు. ఎందుకంటే ఈ సీజన్లో అతివల మ్యాచ్లు ఆషామాషీగా సాగలేదు. కాబట్టి ఫైనల్ కూడా హోరాహోరీ ఖాయం. పైగా గత రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సారీ అలా వెళ్లడానికి సిద్ధంగా లేదు. అలాగని వరుస విజయాలతో డిఫెండింగ్ చాంపియన్ను చిత్తు చేసిన బెంగళూరును తక్కువ అంచనా వేయలేం. ఏదేమైనా మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) క్లైమాక్స్లో కొత్త విజేత కోసం గట్టి పోరు తప్పదు! ఈ సీజన్లో కొన్ని ఉత్కంఠభరిత మ్యాచ్లైతే రెగ్యులర్ ఐపీఎల్ (పురుషుల టోర్నీ)ను తలపించేలా భారత క్రికెట్ ప్రేక్షకుల్ని ఊర్రూతలూగించాయి. ఈ నేపథ్యంలో మెరుపులు మెరిపించేందుకు ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సై అంటే సై అంటున్నాయి. ఉత్సాహంతో బెంగళూరు డిఫెండింగ్ చాంపియన్ ముంబైని వరుసగా రెండు మ్యాచ్ల్లోనూ ఓడించిన బెంగళూరు ఈ ఒక్క మ్యాచ్లో ఫైనలిస్టును ఓడిస్తే ఎంచక్కా టైటిల్ ఎగరేసుకుపోతుంది. కానీ టాపార్డర్ వైఫల్యం జట్టును కలవరపెడుతోంది. గత రెండు మ్యాచ్ల్లోనూ జట్టు ను గట్టెక్కించింది ఎలీస్ పెరీనే! బ్యాట్తో, బంతితో రాణిస్తున్న ఆమెకు కెప్టెన్ స్మృతి మంధాన, సోఫీ మోలినెక్స్, సోఫీ డివైన్ల నుంచి సహకారం లభిస్తే బెంగళూరు భారీ స్కోరు సాధిస్తుంది. లేదంటే బౌలర్లపైనే భారం పడుతుంది. ప్రధాన బౌలర్ రేణుకా సింగ్ ఈ మ్యాచ్లో సత్తా చాటాల్సిన అవసరముంది. శ్రేయాంక, ఆశ శోభన, పెరీ, మోలినెక్స్లు ఆశించిన మేర రాణిస్తుండటం జట్టుకు కలిసొచ్చే అంశం. ఈ సారి ట్రోఫీ లక్ష్యంగా... గతేడాది ముంబై జోరుతో రన్నరప్గా సరిపెట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సారి ట్రోఫీనే లక్ష్యంగా ఈ టోర్నీలో ఆరంభం నుంచి శ్రమించింది. పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంతో నేరుగా ఫైనల్కు దూసుకొ చ్చిన మెగ్ లానింగ్ సేన ఈ సారి భారీ స్కోర్లతో తమ బ్యాటింగ్ ప్రతాపాన్ని చూపించింది. తాజా ఫైనల్ ప్రత్యర్థి బెంగళూరుతో తలపడిన రెండు మ్యాచ్ల్లోనూ భారీ స్కోర్లు చేసే గెలిచింది. లానింగ్, షఫాలీ, జెమీమా, క్యాప్సీ అంతా సూపర్ఫామ్లో ఉండటం వారి బ్యాటింగ్ లైనప్ను దుర్భేద్యంగా మార్చింది. బౌలింగ్లో మరిజన్, శిఖా పాండే, జెస్ జొనాసెన్లు ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు. పిచ్–వాతావరణం అరుణ్ జైట్లీ స్టేడియంలో గత మూడు మ్యాచ్లనూ బౌలర్లే శాసించారు. బౌలర్లకు కలిసొచ్చే వికెట్పై మెరుపుల కోసం బ్యాటర్లు శక్తికి మించి శ్రమించాలి. వేసవి మొదలవుతున్న వేళ వర్ష సూచనైతే లేదు. తుది జట్లు (అంచనా) ఢిల్లీ క్యాపిటల్స్: మెగ్ లానింగ్ (కెపె్టన్), షఫాలీ వర్మ, అలైస్ క్యాప్సీ, జెమీమా రోడ్రిగ్స్, మరిజన్ కప్, జెస్ జొనాసెన్, అరుంధతి, రాధా యాదవ్, మిన్నుమణి, తానియా, శిఖాపాండే. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, ఎలీస్ పెరీ, దిశా కాసత్, రిచా ఘోష్, సోఫీ మోలినెక్స్, వేర్హమ్, శ్రేయాంక, ఆశ శోభన, శ్రద్ధ, రేణుకా సింగ్. - రా.గం.7.30 నుంచి ‘స్పోర్ట్స్–18’లో ప్రత్యక్ష ప్రసారం -
WPL 2024: భళా బెంగళూరు.. ఫైనల్కు చేరిన ఆర్సీబీ
న్యూఢిల్లీ: గెలుపు వాకిట ముంబై ఇండియన్స్ బోల్తా పడింది. ఉన్నపళంగా ఉత్కంఠ రేపిన ఆఖరి ఓవర్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 5 పరుగుల తేడాతో గట్టెక్కింది. తద్వారా మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్లో స్మృతి మంధాన నాయకత్వంలోని బెంగళూరు జట్టు ఫైనల్ చేరింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ సులువుగా గెలవాల్సిన మ్యాచ్లో ఎలిమినేట్ అయ్యింది. ముందుగా బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 135 పరుగులు చేసింది. అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 130 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్తో బెంగళూరు తలపడుతుంది. మలుపు తిప్పిన శ్రేయాంక... శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ బృందం 17వ ఓవర్ ముగిసేవరకు గెలిచే స్థితిలోనే ఉంది. 18 బంతుల్లో 20 పరుగులు సులువైన సమీకరణం కాగా... 18వ ఓవర్ వేసిన శ్రేయాంక పాటిల్ 4 పరుగులిచ్చి కీలకమైన హర్మన్ప్రీత్ వికెట్ను పడగొట్టింది. దాంతో ముంబై విజయసమీకరణం 12 బంతుల్లో 16 పరుగులుగా మారింది. 19వ ఓవర్ వేసిన సోఫీ మోలినెక్స్ నాలుగే పరుగులిచ్చి సజన (1) వికెట్ను తీసింది. ఇక చివర్లో 6 బంతుల్లో 12 పరుగులు చేయడం కూడా ముంబై జట్టుకు కష్టం కాదు. కానీ లెగ్ స్పిన్నర్ ఆశ శోభన మాయాజాలం చేసింది. తొలి 3 బంతులకు 4 పరుగులే ఇచ్చింది. ఆశ వేసిన నాలుగో బంతికి పూజ వస్త్రకర్ ముందుకొచ్చి ఆడి (4) స్టంపౌట్ అయ్యింది. దాంతో ముంబై నెగ్గాలంటే 2 బంతుల్లో 8 పరుగులు చేయాలి. కొత్త బ్యాటర్ అమన్జ్యోత్ ఐదో బంతికి ఒక పరుగు తీసింది. చివరి బంతికి ముంబై 7 పరుగులు చేయాలి. క్రీజులో అమెలియా కెర్ ఉంది. సిక్స్ కొడితే స్కోర్లు సమమై ‘సూపర్ ఓవర్’కు దారి తీస్తుందా అని ఉత్కంఠ కలిగింది. కానీ ఆశ వేసిన ఆఖరి బంతికి అమెలియా ఒక్క పరుగు మాత్రమే తీయగలిగింది. దాంతో ఓడిపోతుందనుకున్న మ్యాచ్లో బెంగళూరు 5 పరుగులతో గెలిచి తొలిసారి డబ్ల్యూపీఎల్ ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదుకున్న పెరీ... అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి (10), సోఫీ డివైన్ (10), దిశ (0), హిట్లర్లు రిచా ఘోష్ (14), సోఫీ మోలినెక్స్ (11) అంతా నిరాశపరిచారు. 15 ఓవర్లలో ఆర్సీబీ స్కోరు 84/5! కనీసం వంద కూడా చేయలేదు. ఈ దశలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఎలీస్ పెరీ (50 బంతుల్లో 66; 8 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేసింది. ఆఖర్లో జార్జియా వేర్హమ్ (10 బంతుల్లో 18 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) బ్యాట్ ఝుళిపించింది. హేలీ మాథ్యూస్, నటాలీ సీవర్ బ్రంట్, సైకా ఇషాక్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం సునాయాసమైన లక్ష్యాన్ని ఛేదించలేక ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 130 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ (30 బంతుల్లో 33; 4 ఫోర్) టాప్ స్కోరర్ కాగా.. అమెలియా కెర్ (25 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు), నటాలీ సీవర్ బ్రంట్ (17 బంతుల్లో 23; 4 ఫోర్లు) 20 పైచిలుకు పరుగులు చేశారంతే! శ్రేయాంక (4–0–16–2) జట్టుకు అవసరమైన స్పెల్ వేయగా, పెరీ, సోఫీ, వేర్హమ్, ఆశ తలా ఒక వికెట్ తీశారు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: స్మృతి (సి) ఇస్మాయిల్ (బి) సీవర్ 10; సోఫీ డివైన్ (బి) హేలీ 10; పెరీ (సి) సీవర్ (బి) సైకా 66; దిశ (సి) పూజ (బి) సైకా 0; రిచా ఘోష్ (సి) సీవర్ (బి) హేలీ 14; సోఫీ మోలినెక్స్ (బి) సీవర్ 11; వేర్హమ్ (నాటౌట్) 18; శ్రేయాంక (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 135. వికెట్ల పతనం: 1–20, 2–20, 3–23, 4–49, 5–84, 6–126. బౌలింగ్: షబ్నిమ్ 4–1–30–0, హేలీ మాథ్యూస్ 4–0–18–2, నటాలీ సీవర్ బ్రంట్ 4–0–18–2, సైకా ఇషాక్ 3–0–27–2, పూజ వస్త్రకర్ 3–0–21–0, అమెలియా కెర్ 2–0–18–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: యస్తిక (బి) పెరీ 19; హేలీ (సి) వేర్హమ్ (బి) శ్రేయాంక 15; నటాలీ సీవర్ (బి) వేర్హమ్ 23; హర్మన్ప్రీత్ (సి) డివైన్ (బి) శ్రేయాంక 33; అమెలియా కెర్ (నాటౌట్) 27; సజన (స్టంప్డ్) రిచా ఘోష్ (బి) సోఫీ మోలినెక్స్ 1; పూజ (స్టంప్డ్) రిచా ఘోష్ (బి) ఆశ శోభన 4; అమన్జోత్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 130. వికెట్ల పతనం: 1–27, 2–50, 3–68, 4–120, 5–123, 6–128. బౌలింగ్: రేణుక 1–0–6–0, శ్రేయాంక పాటిల్ 4–0–16–2, సోఫీ డివైన్ 1–0–9–0, ఎలీస్ పెరీ 4–0–29–1, సోఫీ మోలినెక్స్ 4–0–16–1, వేర్హమ్ 4–0–37–1, ఆశ శోభన 2–0–13–1. -
ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్
న్యూఢిల్లీ: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండో ఏడాది తుది పోరుకు అర్హత సాధించింది. గ్రూప్ దశలో ఆడిన 8 మ్యాచ్లలో 6 గెలిచిన ఢిల్లీ 12 పాయింట్లతో టాపర్గా ఫైనల్కు చేరుకుంది. బుధవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్ను చిత్తు చేసింది. ఈ ఓటమితో పట్టికలో చివరి స్థానంతో గుజరాత్ ఈ సీజన్ను ముగించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులే చేసింది. భారతి ఫుల్మలి (36 బంతుల్లో 42; 7 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలవగా...కాథరీన్ బ్రైస్ (22 బంతుల్లో 28 నాటౌట్; 4 ఫోర్లు), ఫోబ్ లిచ్ఫీల్డ్ (21 బంతుల్లో 22; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఒకదశలో జట్టు స్కోరు 48/5 కాగా... భారతి, బ్రైస్ ఆరో వికెట్కు 50 బంతుల్లో 68 పరుగులు జోడించి ఆదుకున్నారు. ఢిల్లీ బౌలర్లలో మిన్ను మణి, మరిజాన్ కాప్, శిఖా పాండే తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 13.1 ఓవర్లలో 3 వికెట్లకు 129 పరుగులు సాధించి గెలిచింది. ఓపెనర్ షఫాలీ వర్మ (37 బంతుల్లో 71; 7 ఫోర్లు, 5 సిక్స్లు) మెరుపు వేగంలో అర్ధసెంచరీ సాధించగా... జెమీమా రోడ్రిగ్స్ (28 బంతుల్లో 38 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి జోరు ప్రదర్శించింది. షఫాలీ, జెమీమా మూడో వికెట్కు 55 బంతుల్లోనే 94 పరుగులు జత చేశారు. విజయానికి 2 పరుగుల దూరంలో షఫాలీ వెనుదిరిగినా... జెమీమా ఫోర్ కొట్టడంతో మరో 41 బంతులు మిగిలి ఉండగానే క్యాపిటల్స్ జట్టుకు గెలుపు దక్కింది. ఫైనల్లో ఢిల్లీ ప్రత్యర్థిని నిర్ణయించే ‘ఎలిమినేటర్’ మ్యాచ్ రేపు జరుగుతుంది. గత ఏడాది చాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ‘ఎలిమినేటర్’ పోరులో తలపడనున్నాయి. లీగ్ దశలో ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్లు జరగ్గా... చెరో మ్యాచ్లో విజయం సాధించి సమఉజ్జీలుగా నిలిచాయి. ఆదివారం జరిగే ఫైనల్తో డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ ముగుస్తుంది. -
ముంబై X విదర్భ
ప్రతిష్టాత్మక దేశవాళీ ఫస్ట్ క్లాస్ టోర్నీ రంజీ ట్రోఫీ ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. నేటినుంచి జరిగే ఈ తుది సమరంలో 41 సార్లు చాంపియన్ ముంబై, 2 సార్లు విజేత విదర్భతో తలపడనుంది. ఉ.గం.9.30 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమాలో ప్రత్యక్షప్రసారం -
టైటిల్ పోరుకు పుణేరి, హరియాణా
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) పదో సీజన్లో కొత్త చాంపియన్ ఖాయమైంది. నిరుటి రన్నరప్ పుణేరి పల్టన్తో అమీతుమీకి తొలిసారి ఫైనల్కు చేరిన హరియాణా స్టీలర్స్ సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య శుక్రవారం హైదరాబాద్లోనే ఫైన ల్ పోరు జరుగనుంది. సెమీఫైనల్స్లో ‘హ్యాట్రిక్’ టైటిళ్ల విజేత పట్నా పైరేట్స్, రెండు సార్లు చాంపియన్గా నిలిచిన జైపూర్ పింక్పాంథర్స్ ప్రత్యర్థుల చేతుల్లో పరాజయం చవిచూశాయి. తొలి సెమీస్లో పుణేరి పల్టన్ ధాటికి 37–21తో టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన పట్నా పైరేట్స్ నిలువలేకపోయింది. పుణేరి తరఫున కెపె్టన్, ఆల్రౌండర్ అస్లామ్ ముస్తఫా (7పాయింట్లు), రెయిడర్ పంకజ్ మోహితే (7) అదరగొట్టారు. మిగతా వారిలో మొహమ్మద్ రెజా చియనె 5, మోహిత్ గోయత్ 4, సంకేత్, అభినేశ్ చెరో 3 పాయింట్లు చేసి జట్టు విజయంలో భాగమయ్యారు. పట్నా జట్టులో రెయిడర్ సచిన్ చేసిన 5 పాయింట్లే అత్యధిక స్కోరు! మిగిలిన వారిలో మన్జీత్, సుధాకర్ చెరో 4 పాయింట్లు చేశారు. అనంతరం హోరాహోరీగా జరిగిన రెండో సెమీ ఫైనల్లో హరియాణా స్టీలర్స్ 31–27తో డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్పాంథర్స్ను కంగుతినిపించింది. స్టీలర్స్ రెయిడర్ వినయ్ 20 సార్లు కూతకు వెళ్లి 11 పాయింట్లు తెచ్చిపెట్టాడు. శివమ్ పతారే (7) కూడా అదరగొట్టాడు. మిగతావారిలో ఆల్రౌండర్ ఆశిష్ 4, డిఫెండర్లు రాహుల్ సేథ్పాల్ 3, మోహిత్ 2 పాయింట్లు సాధించారు. జైపూర్ తరఫున రెయిడర్ అర్జున్ దేస్వాల్ (14) ఒంటరి పోరాటం చేశాడు. డిఫెండర్ రెజా మిర్బగెరి 4, భవానీ రాజ్పుత్ 3 పాయింట్లు చేశారు. -
ఆడుదాం ఆంధ్రా విజేతలు వీరే
విశాఖ స్పోర్ట్స్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్రా ఫైనల్ పోటీలు సోమవారం హోరాహోరీగా సాగాయి. విశాఖలోని ఎనిమిది వేదికల్లో ఐదు క్రీడాంశాల్లో పురుషుల, మహిళల జట్ల మధ్య ఫైనల్స్ను ప్రేక్షకులు ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. మహిళల విభాగంలో.. ► క్రికెట్ విజేతగా ఎన్టీఆర్ జిల్లా సిద్ధార్థ నగర్, రన్నరప్గా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి, సెకండ్ రన్నరప్గా ప్రకాశం జిల్లా చిరకూరపాడు జట్లు నిలిచాయి. ► వాలీబాల్ విజేతగా బాపట్ల జిల్లా నిజాంపట్నం–3, రన్నరప్గా కర్నూలు జిల్లా మామిడాలపాడు–1, సెకండ్ రన్నరప్గా అన్నమయ్య జిల్లా కుచ్చువారిపల్లి–1 జట్లు నిలిచాయి. ► బ్యాడ్మింటన్ విజేతగా బాపట్ల జిల్లా స్వర్ణ 2, రన్నరప్గా వైఎస్సార్ జిల్లా శంకరాపురం–4, సెకండ్ రన్నరప్గా కర్నూలు జిల్లా ఫోర్త్క్లాస్ ఎంప్లాయిస్ కాలనీ జట్లు నిలిచాయి. ► ఖోఖో విజేతగా ప్రకాశం జిల్లా పోలిరెడ్డి బజార్, రన్నరప్గా కృష్ణా జిల్లా నెహ్రూ సెంటర్ చౌక్, సెకండ్ రన్నరప్గా కాకినాడ జిల్లా బీసీ కాలనీ 2 జట్లు నిలిచాయి. ► కబడ్డీ విజేతగా విశాఖ జిల్లా లాసన్స్బే కాలనీ, రన్నరప్గా ప్రకాశం జిల్లా పాకాల 2, సెకండ్ రన్నరప్గా అనకాపల్లి జిల్లా సాలపువానిపాలెం జట్లు నిలిచాయి. పురుషుల విభాగంలో.. ► బ్యాడ్మింటన్ విజేతగా ఏలూరు జిల్లా శేఖర్ వీధి, రన్నరప్గా తిరుపతి జిల్లా భేరీపేట, సెకండ్ రన్నరప్గా వైఎస్సార్ కడప కాగితాలపెంట 1 జట్లు నిలిచాయి. ► వాలీబాల్ విజేతగా బాపట్ల జిల్లా బేతపూడి, రన్నరప్గా మన్యం జిల్లా బలిజపేట, సెకండ్ రన్నరప్గా చిత్తూరు జిల్లా కొత్తపల్లె జట్లు నిలిచాయి. ► ఖోఖో విజేతగా బాపట్ల జిల్లా పొంగులూరు –1, రన్నరప్గా అనకాపల్లి జిల్లా తుమ్మపాల–2, సెకండ్ రన్నరప్గా ప్రకాశం జిల్లా రుద్రవరం జట్లు నిలిచాయి. సాగర తీరంలో డ్రోన్ షో సాక్షి, అమరావతి: ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు వేడుకలను ప్రభుత్వం నేడు అట్టహాసంగా నిర్వహించనుంది. విశాఖ సాగర తీరంలో లేజర్ షోతో పాటు డ్రోన్ షోలు ఏర్పాటు చేశారు. స్టేడియంలో ప్రొజెక్షన్ మ్యాపింగ్, సౌండ్ అండ్ లైటింగ్ షోకు శాప్ ఏర్పాట్లు చేసింది. ఎల్ఈడీ కాంతుల్లో 150 మంది కూచిపూడి నృత్యకారులతో ఆడుదాం ఆంధ్రపై కళా ప్రదర్శన నిర్వహిస్తారు. బాణసంచా వెలుగులు ఆహుతుల్ని అలరించనున్నాయి. -
కుర్రాళ్లూ వదిలేశారు.. ఫైనల్లో టీమిండియా ఓటమి! ఆసీస్దే వరల్డ్కప్
అచ్చు సీనియర్లలాగే... జూనియర్లూ సమర్పించుకున్నారు. ఆఖరి పోరు దాకా అజేయంగా నిలిచిన యువ భారత్ జట్టు ఆఖరి మెట్టుపై మాత్రం ఆ్రస్టేలియా చేతిలో ఓడింది. గతేడాది వన్డే ప్రపంచకప్లో రోహిత్ శర్మ బృందం కూడా ఎదురులేని పోరాటంతో ఫైనల్ చేరింది. చివరకు ఆస్ట్రేలియా చేతిలోనే కంగుతింది. ఇక్కడా భారత జూనియర్ జట్టు ఫైనల్ చేరే క్రమంలో అన్ని మ్యాచ్ల్లో గెలిచి కీలకమైన తుది పోరులో ఆ్రస్టేలియా జట్టు చేతిలోనే ఓటమి చవిచూసింది. వెరసి మూడు నెలల వ్యవధిలో ఆ్రస్టేలియా సీనియర్, జూనియర్ జట్లు వన్డే ప్రపంచకప్ టైటిల్స్ను హాట్ ఫేవరెట్ అయిన భారత్పైనే గెలవడం పెద్ద విశేషం. బెనోని (దక్షిణాఫ్రికా): ప్రపంచకప్ కోసం ప్రతీ మ్యాచ్లో చిందించిన చెమటంతా ఫైనల్కు వచ్చేసరికి ఆవిరైంది. యువ భారత్ జైత్రయాత్ర కప్ అందుకోవాల్సిన మ్యాచ్లో పేలవంగా ముగిసింది. అండర్–19 ప్రపంచకప్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ 79 పరుగుల తేడాతో ఆ్రస్టేలియా చేతిలో ఓడింది. మొదట ఆ్రస్టేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. హర్జస్ సింగ్ (55; 3 ఫోర్లు, 3 సిక్స్లు), కెపె్టన్ హ్యూగ్ వీగెన్ (48; 5 ఫోర్లు) రాణించారు. సీమర్లు రాజ్ లింబాని 3, నమన్ తివారి 2 వికెట్లు తీశారు. గతంలో ఐదుసార్లు చాంపియన్గా నిలిచిన భారత జట్టు లక్ష్య ఛేదనలో తడబడింది. చివరకు 43.5 ఓవర్లలో 174 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ ఆదర్శ్ సింగ్ (77 బంతుల్లో 47; 4 ఫోర్లు, 1 సిక్స్), హైదరాబాద్ కుర్రాడు మురుగన్ అభిషేక్ (46 బంతుల్లో 42; 5 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బియర్డ్మన్ (3/15) కోలుకోలేని దెబ్బ తీయగా, రాఫ్ మెక్మిలన్ (3/43) ఇంకెవరినీ క్రీజులో నిలువనీయలేదు. చక్కగా కట్టడి చేసినప్పటికీ... టాస్ నెగ్గి బ్యాటింగ్కు దిగిన ఆ్రస్టేలియా బ్యాటర్లెవరూ భారీ స్కోర్లు చేయకుండా భారత బౌలర్లు చక్కగానే కట్టడి చేశారు. హర్జస్ అర్ధసెంచరీ సాధించగా, వీగెన్, డిక్సన్ (56 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్), ఒలీవర్ (43 బంతుల్లో 46 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్)లను అర్ధశతకాల వరకు రానివ్వలేదు. లింబాని, నమన్ వరుస విరామాల్లో వికెట్లు తీశారు. అందువల్లే పెద్దస్కోరైతే నమోదు కాలేదు. రాణించిన ఆదర్శ్, అభిషేక్ కష్టమైన లక్ష్యం కాదు... ఈ మెగా ఈవెంట్లో మన కుర్రాళ్ల ఫామ్ ముందు ఛేదించే లక్ష్యమే! పెద్దగా కష్టపడకుండా ఏ ఇద్దరు ఫిఫ్టీలు బాదినా... ఇంకో ఇద్దరు 30 పైచిలుకు పరుగులు చేసినా చాలు గెలవాల్సిన మ్యాచ్ ఇది! కానీ టాపార్డర్లో అర్షిన్ (3), ముషీర్ ఖాన్ (22), మిడిలార్డర్లో నమ్మదగిన బ్యాటర్లు కెప్టెన్ ఉదయ్ సహారణ్ (8), సచిన్ దాస్ (8)ల వికెట్లను పారేసుకోవడంతో 68/4 స్కోరు వద్దే భారత్ పరాజయం ఖాయమైంది. ఎందుకంటే తర్వాత వచ్చిన వారెవరూ సుదీర్ఘ ఇన్నింగ్స్లు ఆడలేనివారే! ఆదర్శ్, అభిషేక్ల పోరాటం అంతరాన్ని తగ్గించేందుకు ఉపయోగపడింది. 1 అండర్–19 ప్రపంచకప్ ఫైనల్లో భారత్పై నెగ్గడం ఆస్ట్రేలియాకిదే తొలిసారి. ఈ రెండు జట్లు 2012, 2018 టోర్నీ ఫైనల్స్లోనూ తలపడగా రెండుసార్లూ భారత జట్టే గెలిచింది. 4 అండర్–19 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ను ఓడించిన నాలుగో జట్టు ఆ్రస్టేలియా. గతంలో పాకిస్తాన్ (2006), వెస్టిండీస్ (2016), బంగ్లాదేశ్ (2020) ఫైనల్లో ఓడించి విజేతగా నిలిచాయి. 4 అండర్–19 ప్రపంచకప్ సాధించడం ఆ్రస్టేలియాకిది నాలుగోసారి. గతంలో ఆ జట్టు 1988, 2002, 2010లలో విజేతగా నిలిచింది. 2012 భారత అండర్–19 జట్టుపై 2012 తర్వాత ఆస్ట్రేలియా యువ జట్టు మళ్లీ గెలుపొందడం విశేషం. గత 12 ఏళ్లలో ఆ్రస్టేలియా జూనియర్ జట్టుతో ఆడిన 10 మ్యాచ్ల్లోనూ యువ భారత్ విజయం సాధించింది. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: డిక్సన్ (సి) అభిషేక్ (బి) తివారి 42; కొన్స్టాస్ (బి) లింబాని 0; వీగెన్ (సి) ముషీర్ (బి) తివారి 48; హర్జస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సౌమీ పాండే 55; హిక్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) లింబాని 20; ఒలీవర్ (నాటౌట్) 46; మెక్మిలన్ (సి అండ్ బి) ముషీర్ 2; అండర్సన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) లింబాని 13; స్ట్రేకర్ (నాటౌట్) 8; ఎక్స్ట్రాలు 19; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 253. వికెట్ల పతనం: 1–16, 2–94, 3–99, 4–165, 5–181, 6–187, 7–221. బౌలింగ్: రాజ్ లింబాని 10–0–38–3, నమన్ తివారి 9–0–63–2, సౌమీ పాండే 10–0–41–1, ముషీర్ 9–0–46–1, అభి షేక్ 10–0–37–0, ప్రియాన్షు 2–0–17–0. భారత్ ఇన్నింగ్స్: ఆదర్శ్ (సి) హిక్స్ (బి) బియర్డ్మన్ 47; అర్షిన్ (సి) హిక్స్ (బి) విడ్లెర్ 3; ముషీర్ (బి) బియర్డ్మన్ 22; ఉదయ్ (సి) వీగెన్ (బి) బియర్డ్మన్ 8; సచిన్ (సి) హిక్స్ (బి) మెక్మిలన్ 9; ప్రియాన్షు (సి) విడ్లెర్ (బి) అండర్సన్ 9; అవనీశ్ రావు (సి అండ్ బి) మెక్మిలన్ 0; అభిషేక్ (సి) వీగెన్ (బి) విడ్లెర్ 42; లింబాని (బి) మెక్మిలన్ 0; నమన్ (నాటౌట్) 14; సౌమీ (సి) హిక్స్ (బి) స్ట్రేకర్ 2; ఎక్స్ట్రాలు 18; మొత్తం (43.5 ఓవర్లలో ఆలౌట్) 174. వికెట్ల పతనం: 1–3, 2–40, 3–55, 4–68, 5–90, 6–91, 7–115, 8–122, 9–168, 10–174. బౌలింగ్: విడ్లెర్ 10–2–35–2, అండర్సన్ 9–0–42–1, స్ట్రేకర్ 7.5–1–32–1, బియర్డ్ మన్ 7–2–15–3, మెక్మిలన్ 10–0–43–3. -
ఆరో ప్రపంచకప్ వేటలో భారత్.. ఫైనల్లో ఆసీస్తో ఢీ
బెనోని (దక్షిణాఫ్రికా): డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఆరో ప్రపంచకప్ లక్ష్యంగా అంతిమ సమరానికి సన్నద్ధమైంది. ఈ టోర్నీలో పరాజయమెరుగని భారత జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో ఆ్రస్టేలియాతో తలపడనుంది. డిఫెండింగ్ చాంపియన్ ఈ టోర్నీలో అసాధారణ ఫామ్లో ఉంది. కుర్రాళ్ల మెగా ఈవెంట్ చరిత్రలో తొమ్మిదోసారి టైటిల్ వేటకు అర్హత సాధించిన భారత్కు ఫైనల్ ప్రత్యర్థిపై మంచి రికార్డు ఉంది. ఆసీస్ ఐదుసార్లు ఫైనల్ చేరింది. పాక్ (1988, 2010), దక్షిణాఫ్రికా (2002)లపై గెలిచిన ఆసీస్కు 2012, 2018లలో జరిగిన ఫైనల్స్లో మాత్రం రెండు సార్లు భారత్ చేతిలో పరాభవం ఎదురైంది. ఇప్పుడు ఇదే రికార్డును ఈ టోర్నీలోనూ అజేయ భారత్ కొనసాగించాలని ఆశిస్తోంది. ప్రస్తుత టోర్నీలో జట్ల బలాబలాల విషయానికి వస్తే యువభారత్ ఆల్రౌండ్ షోతో జైత్రయాత్ర చేస్తోంది. బ్యాటింగ్లో కెప్టెన్ ఉదయ్ సహరణ్ (389 పరుగులు), ముషీర్ ఖాన్ (338), సచిన్ దాస్ (294) సూపర్ ఫామ్లో ఉన్నారు. బౌలింగ్లో సౌమీ పాండే (17 వికెట్లు) స్పిన్ మాయాజాలం ప్రత్యర్థి బ్యాటర్లను కట్టిపడేస్తోంది. మరోవైపు ఆసీస్ తరఫున ఓపెనర్ హ్యారీ డిక్సన్ (267 పరుగులు), కెప్టెన్ హ్యూగ్ వేగన్ (256) రాణించారు. బౌలింగ్లో కలమ్ విడ్లెర్ (12 వికెట్లు), టాస్ స్ట్రేకర్ (12 వికెట్లు) ప్రత్యర్థి బ్యాటర్లపై ప్రభావం కనబరిచారు. విజయాల పరంగా కూడా ఆసీస్... భారత్ లాగే దీటైన ప్రదర్శన చేసింది. సూపర్ సిక్స్లో విండీస్తో మ్యాచ్ వర్షంతో రద్దవగా మిగతా ఐదు మ్యాచ్ల్లోనూ గెలిచి అజేయంగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య ఫైనల్ హోరాహోరీగా జరిగే అవకాశముంది. -
ఫైనల్లో నిఖత్ జరీన్
సోఫియా: భారత టాప్ బాక్సర్ నిఖత్ జరీన్ స్ట్రాంజా మెమోరియల్ బాక్సింగ్ టోర్నీలో తన జోరు కొనసాగిస్తూ తుది పోరుకు అర్హత సాధించింది. రెండు సార్లు ప్రపంచ చాంపియన్ అయిన నిఖత్ ఏకపక్ష సమరంలో గెలిచి ఈ టోర్నమెంట్లో ఫైనల్లోకి ప్రవేశించింది. 50 కేజీల విభాగంలో శనివారం జరిగిన సెమీస్లో నిఖత్ 5–0 స్కోరుతో స్థానిక బాక్సర్ జ్లాటిస్లోవ్ చుకనోవాపై విజయం సాధించింది. తొలి రౌండ్లో నిఖత్ జాగ్రత్తగా ఆడగా బల్గేరియా బాక్సర్ కూడా పోటీనిచ్చింది. దాంతో స్కోరు 3–2తో ముగిసింది. అయితే తర్వాతి రెండు రౌండ్లలో ఆమెకు ఎదురు లేకుండా పోవడంతో 5–0, 5–0తో రౌండ్లు సొంతమయ్యా యి. ఓవరాల్ స్కోరింగ్తో చివరకు 5–0తో నిఖత్దే పైచేయి అయింది. నేడు జరిగే ఫైనల్లో ఉజ్బెకిస్తాన్కు చెందిన సబీనా బొ»ొకులోవాతో నిఖత్ తలపడుతుంది. 66 కేజీల విభాగంలో మరో భారత బాక్సర్ అరుంధరి చౌదరి కూడా ఫైనల్కు చేరగా...పురుషుల 51 కేజీల విభాగంలో భారత బాక్సర్ అమిత్ పంఘాల్ కూడా ఫైనల్లోకి అడుగుపెట్టాడు. -
ఉత్కంఠ పోరులో పాక్ ఓటమి.. ఫైనల్లో ఆసీస్
బెనోని (దక్షిణాఫ్రికా): అండర్–19 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్ మ్యాచ్ కూడా తొలి సెమీస్లాగే ఉత్కంఠభరితంగా ముగిసింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఒక వికెట్ తేడా తో పాకిస్తాన్పై నెగ్గి ఈ టోర్నీ చరిత్రలో ఆరోసారి ఫైనల్కు చేరుకుంది. ముందుగా బ్యాటింగ్కు దిగిన పాక్ 48.5 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. అరాఫత్ (52; 9 ఫోర్లు), అజాన్ (52; 3 ఫోర్లు) అర్ధసెంచరీలు చేశారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ టామ్ స్ట్రాకర్ (6/24) పాక్ను దెబ్బ తీశాడు. అనంతరం ఆస్ట్రేలియా 49.1 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 181 పరుగులు సాధించి గెలిచింది. డిక్సన్ (50; 5 ఫోర్లు), ఒలీవర్ పీక్ (49; 3 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు. 9వ వికెట్ కోల్పోయిన తర్వాత ఆసీస్ చివరి 4 ఓవర్లలో విజయానికి 16 పరుగులు చేయాల్సి ఉంది. తొలి 3 ఓవర్లలో 13 పరుగులు వచ్చాయి. స్లో ఓవర్ రేట్ కారణంగా పెనాల్టీ విధించడంతో ఆఖరి ఓవర్ కోసం ఫైన్ లెగ్ వద్ద ఉన్న ఫీల్డర్ను పాక్ రింగ్ లోపలికి తీసుకు రావాల్సి వచ్చింది. జీషాన్ వేసిన బంతిని బ్యాటర్ మెక్మిలన్ ఆడగా బంతి బ్యాట్ అంచుకు తాకి అదే ఫైన్ లెగ్ వైపు నుంచే బౌండరీ దాటింది. దాంతో ఆసీస్ కుర్రాళ్లు సంబరాలు చేసుకోగా, పాక్ బృందం నిరాశలో మునిగింది. ఆదివారం జరిగే తుది పోరులో భారత్తో ఆ్రస్టేలియా తలపడుతుంది. -
శ్రమించి... ఛేదించి...
ఈ టోర్నీలో ఆడిన మ్యాచ్లన్నీ గెలిచిన యువ భారత జట్టుకు 245 లక్ష్యం సులువైందే! కానీ 32 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియాకు ఆ సులువైన లక్ష్యమే క్లిష్టంగా మారింది. ఈ దశలో కెప్టెన్ ఉదయ్ సహారణ్కు జతయిన సచిన్ దాస్ ఐదో వికెట్కు 171 పరుగులు జోడించడంతో ఓటమి కోరల్లోంచి బయటపడిన భారత్ ఈ మెగా టోర్నీ చరిత్రలో తొమ్మిదోసారి ఫైనల్ పోరుకు అర్హత పొందింది. బెనోని (దక్షిణాఫ్రికా): ఆరంభం నుంచి అండర్–19 ప్రపంచకప్లో అలవోకగా జైత్రయాత్ర చేస్తున్న డిఫెండింగ్ చాంపియన్ భారత్కు సెమీస్లో అసాధారణ పోరాటం ఎదురైనా... అద్భుతమైన విజయంతో ఫైనల్ చేరింది. తొలి సెమీఫైనల్లో యువ భారత్ 2 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. మొదట దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 7 వికెట్లకు 244 పరుగులు చేసింది. ప్రిటోరియస్ (102 బంతుల్లో 76; 6 ఫోర్లు, 3 సిక్స్లు), రిచర్డ్ (100 బంతుల్లో 64; 4 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. రాజ్ లింబాని 3; ముషీర్ ఖాన్ 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 48.5 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఉదయ్ (124 బంతుల్లో 81; 6 ఫోర్లు), సచిన్ దాస్ (95 బంతుల్లో 96; 11 ఫోర్లు, 1 సిక్స్) వీరోచిత పోరాటం చేశారు. సీన్ మార్చిన సచిన్ జట్టు ఖాతా తెరువక ముందే తొలి బంతికే ఆదర్శ్ సింగ్ (0), కాసేపటికే ముషీర్ ఖాన్ (4), అర్షిన్ (12), ప్రియాన్షు (5) పెవిలియన్ చేరారు. ఈ దశలో క్రీజులో ఉన్న కెప్టెన్ ఉదయ్కి సచిన్ దాస్ జతయ్యాడు. కెప్టెన్ నింపాదిగా ఆడుతుంటే అడపాదడపా బౌండరీలతో సచిన్ దాస్ లక్ష్యఛేదనకు అవసరమైన పరుగులు పేర్చాడు. అర్ధసెంచరీలతో ఇన్నింగ్స్ను గాడిన పెట్టారు. ఇద్దరు 30 ఓవర్లపాటు అసాధారణ పోరాటం చేశారు. 4 పరుగుల తేడాతో సచిన్ సెంచరీ అవకాశాన్ని చేజార్చుకోగా... హైదరాబాద్ ఆటగాళ్లు అరవెల్లి అవనీశ్ రావు (10), అభిషేక్ మురుగన్ (0) వికెట్లు పడటంతో ఉత్కంఠ పెరిగింది. ఈ దశలో రాజ్ లింబాని (4 బంతుల్లో 13 నాటౌట్; 1 సిక్స్, 1 ఫోర్) జట్టును విజయ తీరానికి చేర్చాడు. గురువారం ఆ్రస్టేలియా, పాకిస్తాన్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో నెగ్గిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో భారత్తో తలపడుతుంది. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: ప్రిటోరియస్ (సి) అభిõÙక్ (బి) ముషీర్ 76; స్టీవ్ స్టోల్క్ (సి) అవనీశ్ (బి) రాజ్ 14; టీగెర్ (బి) రాజ్ 0; రిచర్డ్ (సి) మొయిలా (బి) నమన్ 64; ఒలీవర్ (సి) సచిన్ (బి) ముషీర్ 22; మరయిస్ (సి) అభిషేక్ (బి) సౌమీ పాండే 3; జేమ్స్ (సి) అవనీశ్ (బి) రాజ్ 24; నార్టన్ నాటౌట్ 7; ట్రిస్టన్ నాటౌట్ 23; ఎక్స్ట్రాలు 11; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 244. వికెట్ల పతనం: 1–23, 2–46, 3–118, 4–163, 5–174, 6–214, 7–220. బౌలింగ్: రాజ్ లింబాని 9–0–60–3, నమన్ తివారి 8–0–52–1, అభిõÙక్ మురుగన్ 4–0–14–0, అర్షిన్ 2–0–10–0, సౌమీ పాండే 10–0–38–1, ముషీర్ 10–1–43–2, ప్రియాన్షు 7–1–25–0. భారత్ ఇన్నింగ్స్: ఆదర్శ్ (సి) ప్రిటోరియస్ (బి) మఫక 0; అర్షిన్ (సి) జేమ్స్ (బి) ట్రిస్టన్ 12; ముషీర్ (సి) జేమ్స్ (బి) ట్రిస్టన్ 4; ఉదయ్ (రనౌట్) 81; ప్రియాన్షు (సి) ప్రిటోరియస్ (బి) ట్రిస్టన్ 5; సచిన్ (సి) టీగెర్ (బి) మఫక 96; అవనీశ్ (సి) నార్టన్ (బి) మఫక 10; అభిషేక్ (రనౌట్) 0; రాజ్ (నాటౌట్) 13; నమన్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 27; మొత్తం (48.5 ఓవర్లలో 8 వికెట్లకు) 248. వికెట్ల పతనం: 1–0, 2–8, 3–25, 4–32, 5–203, 6–226, 7–227, 8–244. బౌలింగ్: మఫక 10–0–32–3, ట్రిస్టన్ 10–1–37–3, నార్టన్ 9–0–53–0, మొకినా 7.5–0–45–0, స్టోల్క్ 2–0–18–0, జేమ్స్ 8–0–44–0, వైట్హెడ్ 2–0–17–0. -
ప్రొ కబడ్డీ లీగ్ ప్లే ఆఫ్స్, ఫైనల్కు హైదరాబాద్ ఆతిథ్యం
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) పదో సీజన్ ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్లకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1 వరకు ఈ పోటీలు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతాయని పీకేఎల్ నిర్వాహకులైన మషాల్ స్పోర్ట్స్ తెలిపింది. మొత్తం 12 జట్లు పోటీపడుతున్న ప్రొ కబడ్డీ లీగ్లో పాయింట్ల పట్టికలో టాప్–6లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తాయి. టాప్–2 జట్లకు నేరుగా సెమీఫైనల్ బెర్త్లు లభిస్తాయి. మిగతా నాలుగు జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ల్లో తలపడతాయి. ఫిబ్రవరి 26న ఎలిమినేటర్–1లో ఆరో స్థానం పొందిన జట్టుతో మూడో స్థానంలో నిలిచిన జట్టు... ఎలిమినేటర్–2లో ఐదో స్థానంలో నిలిచిన జట్టుతో నాలుగో స్థానం పొందిన జట్టు ఆడతాయి. ఫిబ్రవరి 28న ఎలిమినేటర్–1 విజేత తొలి సెమీఫైనల్లో లీగ్ ‘టాపర్’తో... ఎలిమినేటర్–2 విజేత లీగ్లో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో పోటీపడతాయి. ఫైనల్ మార్చి 1న జరుగుతుంది. -
20 ఉత్తుత్తి బెదిరింపు కాల్స్.. నాలుగేళ్లు నిజమైన జైలు?
అమెరికాలోని వాషింగ్టన్కు చెందిన ఒక యువకుడు ఒకేరోజు నాలుగు నేరాలకు పాల్పడి, దోషిగా నిలిచాడు. అమెరికా, కెనడాలలో 20కిపైగా బెదిరింపు కాల్స్ చేశాడు. బాంబు దాడులు, కాల్పులు, ఇతర బెదిరింపులకు పాల్పడి, ప్రభుత్వ అత్యవసర విభాగాలలో గాభరా పుట్టించాడు. అస్టన్ గార్సియా(21) అనే యువకుడు టకోమాలోని యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్లో తన నేరాన్ని ఒప్పుకున్నాడు. రెండు దోపిడీలు, పేలుడు పదార్థాలకు సంబంధించిన బెదిరింపులలో గార్సియా తన నేరాన్ని అంగీకరించినట్లు యుఎస్ అటార్నీ టెస్సా ఎం. గోర్మాన్ ఒక వార్తా ప్రకటనలో తెలిపారు. గార్సియాపై తొలుత 10 నేరాలు మోపారు. ఫెడరల్ ప్రాసిక్యూటర్లు మాట్లాడుతూ గార్సియా 2022, 2023లో బెదిరింపు కాల్స్ చేసే సమయంలో తన గుర్తింపును దాచేందుకు వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ టెక్నాలజీని ఉపయోగించాడని చెప్పారు. దీనిని సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ డిస్కార్డ్లో ప్రసారం చేస్తూ, అందరినీ వినాలని కూడా గార్సియా కోరేవాడన్నారు. గార్సియా తాను టార్గెట్ చేసుకున్న ప్రముఖుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి.. డబ్బు, క్రెడిట్ కార్డుల సమాచారం లేదా అసభ్యకరమైన చిత్రాలను పంపించకపోతే ప్రభుత్వ అత్యవసర సిబ్బందిని వారి ఇళ్లకు పంపిస్తానని బెదిరించేవాడు. గార్సియా.. ఓహియోలోని క్లీవ్ల్యాండ్లోని ఫాక్స్ న్యూస్ స్టేషన్కు ఫోన్ చేసి, లాస్ ఏంజెల్స్కు వెళ్లే విమానాలలో బాంబు ఉన్నదంటూ వదంతులు వ్యాప్తి చేశాడు. అలాగే బిట్కాయిన్ రూపంలో భారీ మొత్తాన్ని అందించకపోతే లాస్ ఏంజిల్స్లోని విమానాశ్రయంలో బాంబు పెడతానని బెదిరించాడు. 2017లో గార్సియా ఇటువంటి బెదిరింపు కాల్ప్ చేసి, తప్పుదారి పట్టించిన నేపధ్యంలో కాన్సాస్లో ఒక పోలీసు అధికారి ఒక వ్యక్తిని కాల్చి చంపారు. కాగా బ్రెమెర్టన్కు చెందిన గార్సియాకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు సూచించారు. గార్సియాకు ఏప్రిల్లో శిక్ష ఖరారు కానుంది. అమెరికాలోని వాషింగ్టన్, కాలిఫోర్నియా, జార్జియా, ఇల్లినాయిస్, కెంటుకీ, మిచిగాన్, మిన్నెసోటా, న్యూజెర్సీ, ఒహియో, పెన్సిల్వేనియా, కొలరాడో, కెనడాలోని అల్బెర్టాలో గల అత్యవసర ఏజెన్సీలకు గార్సియా బెదిరింపు కాల్ చేశాడని ప్రాసిక్యూటర్లు తెలిపారు. గార్సియాను వాషింగ్టన్లోని సీటాక్లోని ఫెడరల్ డిటెన్షన్ సెంటర్లో ఉంచి విచారిస్తున్నారు. -
తన రికార్డు తానే బ్రేక్ చేసిన బోపన్న.. ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో..
భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న- మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జంట సంచలన విజయం సాధించింది. ఆస్ట్రేలియా ఓపెన్-2024 మెన్స్ డబుల్స్లో ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన సెమీ ఫైనల్లో థామస్- ఝాంగ్ ఝిషేన్ జోడీని ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. అయితే, తొలి సెట్ను 6-3తో గెలిచిన బోపన్న- ఎబ్డెన్ జోడీ.. రెండో సెట్ మాత్రం 3-6తో కోల్పోయింది. ఈ క్రమంలో నువ్వా- నేనా అన్నట్లుగా సాగిన మూడో సెట్లో ఇరు జోడీలు అత్యుత్తమ ప్రదర్శనతో పోటాపోటీగా ముందుకు సాగాయి. ఈ నేపథ్యంలో టై బ్రేకర్కు దారితీయగా.. బోపన్న- ఎబ్డెన్ ద్వయం ధామస్- ఝిషేన్ జంటను 7-6తో ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో రోహన్ బోపన్న తన పేరిట ఉన్న రికార్డును తానే బద్దలు కొట్టాడు. గ్రాండ్స్లామ్ ఫైనల్ చేరిన అత్యంత ఎక్కువ వయసు గల ప్లేయర్(43 ఏళ్లు)గా మరోసారి చరిత్ర సృష్టించాడు. ఇదిలా ఉంటే.. బోపన్న ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్కు చేరడం ఇదే తొలిసారి. 2023లో ఎబ్డెన్తో కలిసి బోపన్న యూఎస్ ఓపెన్ ఫైనల్ ఆడాడు. 2013లోనూ ఈ గ్రాండ్స్లామ్ టోర్నీలో తుదిపోరుకు బోపన్న అర్హత సాధించడం విశేషం. కాగా కెరీర్ చరమాంకంలో బోపన్న ఉన్నత శిఖరానికి చేరుకున్న విషయం తెలిసిందే. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్లో బోపన్న నంబర్వన్ ర్యాంక్ సొంతం చేసుకోవడం ఖరారైంది. తాజాగా ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్ చేరి మరో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు బోపన్న. అలా వరల్డ్ నంబర్వన్ ర్యాంక్ జోడీగా బుధవారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ జంట 6–4, 7–6 (7/5)తో మాక్సిమో గొంజాలెజ్–ఆండ్రెస్ మోల్టెని (అర్జెంటీనా) జోడీపై గెలిచింది. దాంతో ఈనెల 29న విడుదలయ్యే ఏటీపీ తాజా ర్యాంకింగ్స్లో బోపన్న, ఎబ్డెన్ వరల్డ్ నంబర్వన్ ర్యాంక్ జోడీగా అవతరిస్తుంది. ఈ క్రమంలో టెన్నిస్ చరిత్రలోనే నంబర్వన్ ర్యాంక్లో నిలవనున్న అతిపెద్ద వయస్కుడిగా రోహన్ బోపన్న (43 ఏళ్ల 330 రోజులు) రికార్డు నెలకొల్పనున్నాడు. వాళ్ల తర్వాత ఇక... పురుషుల డబుల్స్లో ప్రస్తుతం ఈ రికార్డు అమెరికా దిగ్గజం మైక్ బ్రయాన్ (41 ఏళ్ల 76 రోజులు; 2019లో) పేరిట ఉంది. మహిళల డబుల్స్లో అమెరికా ప్లేయర్ లీసా రేమండ్ (39 ఏళ్లు; 2012లో)... పురుషుల సింగిల్స్లో స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్ (36 ఏళ్ల 320 రోజులు; 2018లో)... మహిళల సింగిల్స్లో అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ (35 ఏళ్ల 124 రోజులు; 2017లో) వరల్డ్ నంబర్వన్ ర్యాంక్లో నిలిచిన అతి పెద్ద వయస్కులుగా రికార్డు సృష్టించారు. గర్వంగా ఉంది ‘నంబర్వన్ ర్యాంక్ అందుకోనుండటంతో గర్వంగా అనిపిస్తోంది. నా జీవితంలో ఇదో ప్రత్యేక క్షణం. ఈస్థాయికి చేరుకోవడానికి కోచ్లు, కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషుల పాత్ర ఎంతో ఉంది’ అని బోపన్న వ్యాఖ్యానించాడు. -
ఫైనల్లో సాత్విక్ –చిరాగ్ జోడీ
న్యూఢిల్లీ: ఈ సీజన్లో భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి వరుసగా రెండో టోర్నమెంట్లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. గతవారం మలేసియా ఓపెన్లో రన్నరప్గా నిలిచిన సాత్విక్ –చిరాగ్ ద్వయం... తాజాగా ఇండియా ఓపెన్లోనూ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్ –చిరాగ్ జంట 21–18, 21–14తో ఆరోన్ చియా–సో వు యిక్ (మలేసియా) జోడీని ఓడించింది. ఆరోన్–సో వు యిక్లతో ఇప్పటి వరకు 11 సార్లు ఆడిన సాత్విక్ –చిరాగ్ మూడోసారి మాత్రమే గెలిచారు. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రణయ్ 15–21, 5–21తో షి యు కీ (చైనా) చేతిలో ఓడిపోయాడు. -
‘క్లీన్స్వీప్’పై భారత్ గురి
బెంగళూరు: టి20 ప్రపంచకప్కు ముందు భారత్ ఆఖరి అంతర్జాతీయ టి20 సమరానికి సన్నద్ధమైంది. అఫ్గానిస్తాన్తో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ గెలిచి ఇప్పటికే 2–0తో సిరీస్ చేజిక్కించుకున్న భారత్కు చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కీలకం కాదు! కానీ రెండు మ్యాచ్ల్లోనూ ఖాతా తెరవలేకపోయిన రోహిత్... ఈ సిరీస్ బరిలోకి దిగిన కోహ్లిలకు మాత్రం కీలకమే! తర్వాత అన్నీ ఐపీఎల్ మ్యాచ్లే ఉండటంతో పొట్టి ఫార్మాట్లో వీరిద్దరు గట్టి స్కోర్లు చేసేందుకు ఈ మ్యాచ్ను బాగా సది్వనియోగం చేసుకోవాలి. కాబట్టి సులువైన ప్రత్యర్థిపై టీమిండియా ఆదమరిచే ఆలోచనే ఉండబోదు. యువ ఆటగాళ్లు ఫామ్లో ఉండటం, బౌలింగ్ పదునెక్కడంతో భారత్ 3–0తో క్లీన్స్వీప్ చేసేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదు. అయితే ఈ ఫార్మాట్ దృష్ట్యా అఫ్గానిస్తాన్ను తక్కువ అంచనా వేయడానికి వీళ్లేదు. పైగా పుష్కలమైన ఆల్రౌండ్ ఆటగాళ్లున్న ప్రత్యర్థి తప్పకుండా పరువు కోసం పోరాడుతుంది. దూబేను ఆపతరమా... ఈ సిరీస్లో శివమ్ దూబే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రెండు మ్యాచ్ల్లోనూ అజేయంగా అర్ధ సెంచరీలు బాదాడు. షాట్ల ఎంపిక, విరుచుకుపడిన తీరు చూస్తుంటే మిడిలార్డర్లో భర్తీ చేయదగ్గ బ్యాటర్లా ఉన్నాడు. యశస్వి జైస్వాల్కు వచి్చన ఏకైక అవకాశాన్ని వినియోగించుకోగా, కెపె్టన్ రోహిత్ శర్మ పరుగుల పరంగా ఈ సిరీస్కు బాకీ పడ్డాడు. జితేశ్ శర్మ, రింకూ సింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే భారత బ్యాటింగ్ ఆర్డర్కు ఏ ఢోకా లేదు. అలాగే బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగానే ఉంది. పేస్తో అర్‡్షదీప్, ముకేశ్ కుమార్... స్పిన్తో అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ అదరగొడుతున్నారు. మరోవైపు అఫ్గాన్ పరిస్థితే పూర్తి భిన్నంగా ఉంది. నిలకడలేని బ్యాటింగ్ ఆర్డర్ జట్టుకు ప్రతికూలంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో సిరీస్ కోల్పోయిన ప్రత్యర్థి జట్టు ఆఖరి గెలుపుతో ఊరట చెందాలని గంపెడాశలతో బరిలోకి దిగుతోంది. -
ఆరు గేమ్ పాయింట్లు కాపాడుకొని...
కౌలాలంపూర్: అంతర్జాతీయ బ్యాడ్మింటన్ వేదికపై మరో టైటిల్ సాధించేందుకు భారత ఆటగాళ్లు సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి అడుగు దూరంలో నిలిచారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ –1000 టోర్నీ మలేసియా ఓపెన్లో ఈ జోడి ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఆరు గేమ్ పాయింట్లు కాపాడుకోవడంతో పాటు ఆపై మరో రెండు పాయింట్లు గెలుచుకొని విజయాన్ని సొంతం చేసుకుంది. రెండో సీడ్ సాత్విక్ – చిరాగ్ 21–18, 22–20 స్కోరుతో ఆరో సీడ్, కొరియాకు చెందిన కాంగ్ మిన్ హ్యూక్ – సియో స్యూంగ్ జాను చిత్తు చేశారు. 47 నిమిషాల పాటు సాగిన మ్యాచ్ సాగింది. తొలి గేమ్ ఆరంభంలో భారత ఆటగాళ్ల ఆధిక్యం సాగింది. చక్కటి ర్యాలీలతో వీరిద్దరు 9–5తో ముందంజ వేయగా వరుసగా నాలుగు పాయింట్లతో కొరియా ద్వయం స్కోరును సమం చేసింది. అయితే 11–9తో, ఆపై 13–12తో మన జట్టు ఆధిక్యం ప్రదర్శించింది. వరుస పాయింట్లతో 17–13 వరకు దూసుకెళ్లిన చిరాగ్ – సాత్విక్ దానిని కొనసాగించారు. రెండో గేమ్ మాత్రం హోరాహోరీగా సాగింది. అనంతరం 9–4తో...11–6తో ఆధిక్యం చూపించిన కొరియా ఆటగాళ్లు ఒక దశలో 17–11తో గేమ్పై పట్టు బిగించారు. ఈ సమయంలో భారత్ కోలుకునే ప్రయత్నం చేసినా 20–14తో గేమ్ గెలిచే స్థితికి కొరియా చేరింది. అయితే ఇక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది. ఒకటి కాదు రెండు కాదు...వరుసగా ఎనిమిది పాయింట్లు సాధించిన సాత్విక్ – చిరాగ్ సంచలనం సృష్టించారు. నేడు జరిగే ఫైనల్లో చైనాకు చెందిన టాప్ సీడ్ జంట లియాంగ్ వి కెంగ్ – వాంగ్ చాంగ్తో సాత్విక్ – చిరాగ్ తలపడతారు. గతంలో ఈ రెండు జోడీల మధ్య 4 మ్యాచ్ల జరగ్గా...భారత ద్వయం 1 మ్యాచ్లో గెలిచి 3 మ్యాచ్లలో ఓడింది. -
రజనీకాంత్ బర్త్డే.. రెండు సర్ప్రైజ్లు..
‘గురి పెడితే ఎర పడాల్సిందే..’ అని అంటున్నారు రజనీకాంత్. ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రానికి ‘వేట్టయాన్ ’ (వేటగాడు అని అర్థం) టైటిల్ను ఖరారు చేసి, ఈ సినిమా టైటిల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. మంగళవారం రజనీకాంత్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘వేట్టయాన్ ’ టైటిల్ వీడియోను విడుదల చేశారు. ‘గురి పెడితే ఎర పడాల్సిందే..’ అని రజనీకాంత్ చెప్పే డైలాగ్, విజువల్స్తో ఈ వీడియో సాగుతుంది. అమితాబ్ బచ్చన్ , ఫాహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, దుషారా విజయన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. లైకాప్రోడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. అలాగే లైకా ప్రోడక్షన్స్ సంస్థలో రజనీకాంత్ ఓ లీడ్ రోల్ చేస్తున్న చిత్రం ‘లాల్ సలామ్’. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మొయిద్దీన్ భాయ్ పాత్రలో రజనీకాంత్ నటిస్తున్నారు. రజనీ బర్త్ డే సందర్భంగా మొయిద్దీన్ భాయ్ పాత్రకు సంబంధించిన యాక్షన్ టీజర్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా జనవరిలో సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. ఈ సినిమాలే కాకుండా.. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. -
మేలో ఎంసెట్!
సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం (2024)లో నిర్వహించాల్సిన ఉమ్మడి ప్రవేశ పరీక్షలపై ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. ప్రవేశ పరీక్షల కన్వినర్ల ఎంపికకు సంబంధించిన అర్హులైన వారి జాబితాలను ఆయా వర్సిటీల వీసీలు ఉన్నత విద్యామండలికి పంపాల్సి ఉంటుంది. దీనిపై అన్ని స్థాయిల్లో చర్చించి, పరీక్షల షెడ్యూల్ ఖరారు చేస్తారు. మండలి పరిధిలో ఎంసెట్, ఎడ్సెట్, ఐసెట్, ఈసెట్, లాసెట్, పాలిసెట్, పీజీ సెట్ ఉంటాయి. సాధారణంగా వీటిని మే నెల నుంచి మొదలు పెడతారు. వీటిల్లో ఎంసెట్ కీలకమైంది. కేంద్రస్థాయిలో జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ తేదీలు ఇప్పటికే ఖరారయ్యాయి. జనవరి, ఏప్రిల్ నెలల్లో మెయిన్స్, ఆ తర్వాత అడ్వాన్స్డ్ చేపట్టాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయించింది. దీని తర్వాత జాతీయ ఇంజనీరింగ్, ఐఐటీల్లో సీట్ల భర్తీకి జోసా కౌన్సెలింగ్ చేపడుతుంది. దీన్ని పరిగణనలోనికి తీసుకునే ఎంసెట్ తేదీలు ఖరారు చేస్తారు. కోవిడ్ సమయం నుంచి జేఈఈతో పాటు, ఎంసెట్ కూడా ఆలస్యంగా జరిగాయి. గత ఏడాది మాత్రం సకాలంలో నిర్వహించారు. ఇప్పుడా ప్రతిబంధకం లేకపోవడంతో మే నెలలోనే ఎంసెట్ చేపట్టాలని అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. ఎంసెట్ సిలబస్, ఇంటర్ మార్కుల వెయిటేజీపై మండలి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కోవిడ్ కాలంలో ఇంటర్ పరీక్షలు లేకపోవడంతో వెయిటేజీని ఎత్తివేశారు. ఆ తర్వాత ఇంటర్ పరీక్షలు జరిగిన వెయిటేజీ ఇవ్వలేదు. ఈ ఏడాది కూడా వెయిటేజీ లేకుండా చేయడమా? అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కొత్త విద్యాశాఖ మంత్రితో చర్చించి నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఏదేమైనా వారం రోజుల్లో అన్ని సెట్స్పైన స్పష్టమైన విధానం వెల్లడించే వీలుందని కౌన్సిల్ వర్గాలు తెలిపాయి. -
ఫైనల్లో సాత్విక్ – చిరాగ్
షెన్జెన్: భారత అగ్రశ్రేణి షట్లర్లు సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ మరో టైటిల్కు కేవలం అడుగు దూరంలో ఉంది. చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో టాప్ సీడ్ భారత ద్వయం టైటిల్ పోరుకు అర్హత సంపాదించింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్–చిరాగ్ జంట 21–15, 22–20తో హి జి తింగ్– రెన్ జియాంగ్ యు (చైనా) జోడీపై విజయం సాధించింది. 50 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో తొలి గేమ్ నుంచే రెండు జోడీలు చెమటోడ్చాయి. ప్రతి పాయింట్కు భారత జంట సమన్వయంతో శ్రమించింది. రెండో సెట్లో చైనా ఆటగాళ్లు దూకుడుగా ఆడటంతో హోరాహోరీ పోరు జరిగింది. స్కోరు 20–20 వద్ద సమంకాగా సాత్విక్–చిరాగ్ జోడీ వరుసగా రెండు పాయింట్లు సాధించి గేమ్తో పాటు మ్యాచ్ను గెలిచింది. -
ఫైనల్లో రష్మిక భమిడిపాటి
ఐటీఎఫ్ మహిళల వరల్డ్ టెన్నిస్ టూర్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక ఫైనల్లోకి ప్రవేశించింది. బెంగళూరులో జరుగుతున్న ఈ టోర్నీలో శనివారం జరిగిన సెమీ ఫైనల్లో రష్మిక 6–2, 6–1 స్కోరుతో రెండో సీడ్ లన్లనా తరారుడీ (థాయిలాండ్)పై విజయం సాధించింది. 57 నిమిషాల పాటు సాగిన పోరులో ఆద్యంతం రష్మిక ఆధిపత్యం కొనసాగింది. తరారుడీ ఒక ఏస్ కొట్టినా ఐదు డబుల్ ఫాల్ట్లతో ఓటమిని ఆహ్వానించింది. మరో భారత క్రీడాకారిణి జీల్ దేశాయ్ కూడా ఫైనల్లోకి అడుగు పెట్టింది. హోరాహోరీగా సాగిన ఈ సెమీస్లో జీల్ 3–6, 6–4, 7–5 స్కోరుతో భారత్కే చెందిన మూడో సీడ్ రుతుజ భోసలేను ఓడించింది. 2 గంటల 31 నిమిషాల పాటు పోటాపోటీగా సాగిన ఈ మ్యాచ్లో తొలి సెట్ను కోల్పోయినా...పట్టుదలగా ఆడిన జీల్ విజేతగా నిలిచింది. రుతుజ 2 ఏస్లు కొట్టగా, జీల్ ఒక ఏస్ సంధించింది. జీల్ 7 డబుల్ ఫాల్ట్లతో పోలిస్తే 10 డబుల్ ఫాల్ట్లు చేసిన రుతుజ ఓటమిపాలైంది. -
మ్యాచ్ అహ్మదాబాద్లో.. ‘రెట్టించిన ఉత్సాహం’ ఢిల్లీలో..
ఈరోజు (ఆదివారం) గుజరాత్లోని అహ్మదాబాద్లో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపధ్యంలో ఢిల్లీ-ఎన్సీఆర్లోని పలు పబ్లు, రెస్టారెంట్లలో క్రీడాప్రియులు మ్యాచ్ను మరింత ఉత్సాహంతో తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారీ టీవీ స్క్రీన్లను ఏర్పాటు చేయడం మొదలుకొని ప్రత్యేక పానీయాలు అందించడం వరకు అన్నింటినీ అందుబాటులో ఉంచారు. ప్రపంచ కప్ ఫైనల్ను క్యాష్ చేసుకునేందుకు ఢిల్లీ-ఎన్సిఆర్లోని పలు పబ్లు, రెస్టారెంట్లు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. సెమీ ఫైనల్స్లో న్యూజిలాండ్ను ఓడించి ఫైనల్కు చేరిన టీమ్ఇండియా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లోనూ విజయం సాధించడం విశేషం. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా ‘ఎస్ మినిస్టర్ - పబ్ అండ్ కిచెన్’ ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ ఇది బిగ్ మ్యాచ్ కావడంతో ‘కవర్ ఛార్జీ’గా మూడు వేల రూపాయలు వసూలు చేస్తున్నాం. సాధారణ రోజుల్లో, మేము దీనిని వసూలు చేయం. ఫైనల్ మ్యాచ్ అయినందున ఇంత రేటును వసూలు చేస్తున్నాం. దీనిని ఆహారానికి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది’ అని అన్నారు. కాగా బ్లూ జెర్సీ ధరించి వచ్చే వారి కోసం ‘బీర్ కేఫ్’లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బీర్ కేఫ్ వ్యవస్థాపకుడు రాహుల్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ‘టీమ్ ఇండియా ఫైనల్కు చేరడంతో ఆదివారం దేశవ్యాప్తంగా ఉన్న మా అవుట్లెట్లలో అభిమానులను స్వాగతించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పెద్ద స్క్రీన్లపై మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చేస్తాం. టీమ్ ఇండియా జెర్సీ ధరించి వచ్చిన వారికి ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నాం’ అని అన్నారు. హర్యానాలోని సైబర్ సిటీ ఆఫ్ గురుగ్రామ్లోని ‘సోయి 7 పబ్’, ‘బ్రూవరీ’లలో క్రీడాభిమానులు ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ను తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ‘సోయి 7 పబ్’కి చెందిన లలిత్ అహ్లావత్ మాట్లాడుతూ ‘మ్యాచ్లను ప్రసారం చేయడానికి మూడు పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేశాం. సైబర్ సిటీలో అతిపెద్ద వేదిక ఏర్పాటు చేశాం. భారత జట్టుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం’ అని అన్నారు. ఇది కూడా చదవండి: మ్యాచ్ తిలకించేందుకు అహ్మదాబాద్కు అనుష్క శర్మ -
CWC 2023 Final: ఇటు ఫైనల్... అటు జిగేల్! తారలు, తారాజువ్వలు
ఆట మొదలవ్వాలంటే ముందు టాస్ పడాలి. కానీ ఈ టాస్ కంటే ముందు కనువిందు చేసే విన్యాసాలెన్నో నరేంద్ర మోదీ స్టేడియాన్ని ఆద్యంతం రంజింపచేసేలా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రత్యేక ఏర్పాట్లు, అరుదైన ఘట్టాలు ఆవిష్కరించనుంది. అహ్మదాబాద్: భారత్, ఆస్ట్రేలియాల మధ్య నేడు నరేంద్రమోదీ స్టేడియంలో జరిగే ఫైనల్ పోరు వికెట్లు, మెరుపులతోనే కాదు... మిరుమిట్లు, వెలుగుజిలుగులతో నెక్ట్స్ లెవెల్ వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది. ఆటకుముందే ఎయిర్షో, ఆట మధ్యలో లేజర్ షో, సంగీత విభావరి ఆఖర్లో కనివినీ ఎరుగని రీతిలో బాణాసంచా మిరుమిట్లు ఆకాశానికి పందిరి పరచనుంది. వైమానిక ‘షో’కులద్దుకొని ఆట ప్రారంభానికి ముందు ఎంతో హంగామా మైదానంలో నడువనుంది. నేలని టాస్ నాణెం ముద్దుపెట్టుకుంటే... నింగిని ఎయిర్ షో సెల్యూట్ చేస్తుంది. భారత వైమానిక దళానికి చెందిన ‘ది సూర్యకిరణ్ ఏరోబాటిక్’ టీమ్ ఆకాశంలో విన్యాసాలతో అలరించనుంది. తొమ్మిది ప్రత్యేక ఫ్లైట్లతో పది నిమిషాల పాటు ఈ ఎయిర్ షో ప్రేక్షకుల్ని ఆకట్టిపడేయనుంది. దీనికి సంబంధించి శుక్ర, శనివారాల్లో రిహార్సల్స్ కూడా పూర్తిచేశారు. చాంపియన్ కెప్టెన్లకు సలామ్ ఇంతకుముందెపుడు జరగని విధంగా... ప్రపంచకప్ చరిత్రలోనే నిలిచిపోయే మధురఘట్టానికి చాంపియన్ కెప్టెన్లు విశిష్ట అతిథులు కానున్నారు. 1975, 1979, 1983, 1987, 1992, 1996, 1999, 2003, 2007, 2011, 2015, 2019... ఈ పన్నెండు ప్రపంచకప్ల విజయసారథులకు విశేషరీతిలో బ్లేజర్లు, జ్ఞాపికలతో సత్కరించే కార్యక్రమం జరుగనుంది. ప్రీతమ్ గానాబజానా ‘ధూమ్’ సిరీస్లకే ధూమ్ మచాలేతో సినీప్రియుల్ని వెర్రెక్కించిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ ఆధ్వర్యంలో 500 పైచిలుకు కళకారులతో నిర్వహించబోయే ఆటపాట స్టేడియాన్ని హోరెత్తించనుంది. భారతీయ సంప్రదాయ నాట్యం, నృత్యరీతులు, డాన్సులు జేజేలు పలికే విధంగా కళాకారుల బృందం రిహార్సల్స్లో చెమటోడ్చింది. లేజర్ షో...డ్రోన్ వీజువల్ వండర్స్ దేనికదే సాటి అన్నచందంగా ఇన్నింగ్స్ బ్రేక్లో లేజర్ షో లైటింగ్ విన్యాసాలు ఆకాశాన్ని రంగుల మయం చేయనుంది. అలాగే డ్రోన్ వీజువల్ వండర్స్తో నింగిలో ప్రపంచకప్ను ఆవిష్కృతం చేసే షోపై అందరి దృష్టి పడింది. తారలు, తారాజువ్వలు స్టేడియంలో బాలీవుడ్, మాలీవుడ్, టాలీవుడ్ ఇలా ప్రతీ సినీ పరిశ్రమకు చెందిన తారలు స్టేడియంలో ప్రత్యేక ఆకర్షణ కానుండగా... ఆకాశంలో బాణాసంచా వెలుగులు, తారాజువ్వలతో చేసే హంగామా కృత్రిమ చుక్కల్ని చూపనున్నాయి. 6000 మందితో భద్రత పెద్ద స్టేడియం కావడం... ఫైనల్ పోరు జరగడం... లక్ష పైచిలుకు ప్రేక్షకులండటం... అతిరథమహారథులంతా విచ్చేయనుండటంతో నరేంద్రమోదీ స్టేడియమే కాదు... అహ్మదాబాద్పై కూడా డేగకన్ను వేశారు. గుజరాత్ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ‘రాష్ట్ర పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, హోంగార్డ్స్, ఇతర సాయుధ బలగాలు కలుపుకొని 6000 పైచిలుకు సిబ్బందితో మోదీ స్టేడియాన్ని పహారా కాస్తున్నారు. మూడు వేల మంది అయితే స్టేడియం లోపలే అప్రమత్తంగా ఉంటారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement