-
నేడు అంబేడ్కర్ ఓయూ డిగ్రీ ప్రవేశ అర్హత పరీక్ష
ఏలూరు (ఆర్ఆర్ పేట) : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ప్రవేశ అర్హత పరీక్ష ఈనెల 8న నిర్వహించనున్నట్టు సీఆర్ రెడ్డి కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ ఎన్వీవీఎస్ ప్రసాద్, యూనివర్సిటీ సమన్వయాధికారి జి.రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ జరుగుతుందన్నారు. పరీక్ష ఫీజులు చెల్లించిన అభ్యర్థులు హాల్ టిక్కెట్లను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఆర్ఏఓయూ.ఏసీ.ఐఎన్ వెబ్సైట్ ద్వారా పొందాలని సూచించారు. భీమవరం, తణుకు, నల్లజర్ల సెంటర్ల విద్యార్థులకూ ఏలూరు సీఆర్రెడ్డి కళాశాలలోనే పరీక్షలు జరుగుతాయని తెలిపారు. -
అంబేడ్కర్ వర్సిటీలో వేతనాల స్కాం
భార్య పేరిట ఉద్యోగం సృష్టించిన డేటాఎంట్రీ ఆపరేటర్ - ఆమె ఖాతాలోకి ప్రతి నెలా రూ.3 లక్షల చొప్పున మళ్లింపు - ప్రాథమికంగా రూ.30 లక్షలకుపైగా స్వాహా చేసినట్లు అంచనా సాక్షి, హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో వేతనాల స్కాం వెలుగులోకి వచ్చింది. అకౌంట్స్ విభాగంలో డేటాఎంట్రీ ఆపరేటర్గా పని చేస్తున్న రాజేశ్వర్రావు తన భార్యను వర్సిటీలో ఉద్యోగిగా సృష్టించి, ఆమె ఖాతాలోకి భారీగా నిధులను మళ్లించాడు. ఒక వ్యక్తి ఖాతాలోకి ప్రతి నెలా రూ.3 లక్షల చొప్పున డబ్బు జమ అవుతుండటం, మొన్నటి జనవరిలోనే రూ.7.5 లక్షలకు పైగా డబ్బు జమ కావడం, గత నెలలో రూ.3.25 లక్షలు ఆ ఖాతాలోకి వెళ్లడంతో వర్సిటీ ఖాతాలు ఉన్న బ్యాంకు అధికారులు అనుమానంతో వర్సిటీ అధికారులకు విషయం తెలియజేశారు. దీంతో ఈ తతంగం వెలుగులోకి వచ్చింది. వర్సిటీ ఉన్నతాధికారులు అకౌంట్స్ విభాగంలో తనిఖీచేసి రూ.30 లక్షలను వేతనం రూపంలో సదరు డేటాఎంట్రీ ఆపరేటర్ నిధులను మళ్లించినట్లు అంచనాకు వచ్చారు. ఉద్యోగుల వేతనాల బిల్లులను చేసే పని అతనిది. బిల్లులు చేసే క్రమంలో పేపరుపై అధికారుల ఆమోదం తీసుకునేప్పుడు, అకౌంట్స్ ఆఫీసర్కు,వర్సిటీ రిజిస్ట్రార్కు వెళ్లే ఫైలులో అన్ని సరిగ్గానే ప్రతిపాదిం చేవాడు. ఆ తర్వాత బ్యాంక్కు ఆన్లైన్ ద్వారా పంపించే సాఫ్ట్కాపీలో ఇతర ఉద్యోగులతోపాటు తన భార్య పేరును చేర్చి ఆమె ఖాతాలోకి లక్షల రూపాయలు జమ అయ్యేలా బ్యాంకు అధికారులకు పంపేవాడు. ఈ తతంగం ఏడాదిగా జరుగుతోంది. కచ్చితంగా ఏదోక సమయంలోగానీ, మార్చిలో చేసే ఆడిట్లోగానీ ఈ వ్యవహారం వర్సిటీ అకౌంట్స్ అధికారుల దృష్టికి వచ్చి ఉంటుందని, ఎందుకు వెలుగులోకి తేలేదని ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విచారణ కమిటీ వేశాం: ప్రొ.సీతారామారావు, వీసీ రాజేశ్వర్రావు మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు శాఖాపరంగా విచారణకు కమిటీనీ ఏర్పాటు చేశాం. ప్రభుత్వానికి విషయాన్ని నివేదించాం. డబ్బును మళ్లించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది వాస్తవమే. అతన్ని సర్వీసు నుంచి తొలగించాలని నిర్ణయించాం. గతంలోనూ ఫీజుల స్కాం.. సదరు ఉద్యోగి గతంలో ఫీజుల స్కాంలోనూ నిందితు డే నని వర్సిటీ అధికారులు చెబుతున్నారు. విద్యార్థులు ఫీజుల కోసం చెల్లించిన డీడీలను మాయం చేసేవాడు. తనకు డబ్బులు ఇచ్చిన విద్యార్థుల దరఖాస్తులకు ఇతర విద్యార్థుల డీడీలను జత చేసిన విషయం వెలుగు చూడటంతో అతడిని అధికారులు సస్పెండ్ చేశారు. మూడేళ్ల కిందట ఎలాగోలా అతను అకౌంట్స్ విభాగంలో చేరాడు. రాజేశ్వర్రావుపై వర్సిటీ రిజిస్ట్రార్ వెంకటయ్య ఫిర్యాదు తో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రాజేశ్వర్రావు పరారీలో ఉన్నట్లు తెలిసింది. -
పై చదువులకు.. ప్రజాప్రతినిధి
నల్లగొండ అర్బన్ : దాదాపు 20 ఏళ్ల క్రితం మానేసిన చదువును కొనసాగించేందుకు ఓ ప్రజాప్రతినిధి తిరిగి పుస్తకాలు చేతపట్టి పరీక్షకు హాజరయ్యారు. ఆలేరు సర్పంచ్ కందగట్ల నిర్మల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారు ఆదివారం నిర్వహించిన డిగ్రీ అర్హత పరీక్షకు స్థానిక ఎన్జీ కాలేజీ సెంట ర్లో హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ ఆమెతో ముచ్చటించగా చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. ‘1985లో ఎస్సెస్సీ ప్రథమ శ్రేణిలో పాసయ్యా. ఆ తర్వాత పెళ్లవడం, ఉమ్మడి కుటుంబం కావడంతో చదువు పూర్తి చేయలేకపోయాను. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆలేరు సర్పంచ్గా నెగ్గా. అయినా చదువుపై మమకారం తగ్గకపోవడంతో ఓపెన్ డిగ్రీ ద్వారా తిరిగి చదవాలనుకున్నా. చదువుకుంటే ప్రజాసమస్యలను లోతుగా అధ్యయనం చేయవచ్చు. ఇంతటితో ఆపేయను. ఆ తర్వాత కూడా ఉన్నత విద్య కొనసాగించాలనుకుంటున్నా.’ అని వివరించారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
కేయూ వైస్ చాన్స్లర్ రమేశ్పై సమగ్ర విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం
చెట్టు మీదపడి కూలీ మృతి
నిజ బృందావన దర్శనం
సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి
ఊరంతా సుంకులమ్మ, ముత్యాలయ్యలే
‘బలగం’తో మంచి గుర్తింపు
గిరిజన గురుకులాల దరఖాస్తుకు నేడు ఆఖరు
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం
మిద్దైపె నుంచి పడి యువకుడి మృతి
ఖాదర్లింగ స్వామి ఉరుసు ప్రారంభం
తప్పక చదవండి
- జనసేన నాయకుడి దౌర్జన్యం
- బైక్పైనే ముద్దుముచ్చట
- ఈ విమానం ఇంకోసారి ఎక్కితే.. ఎయిరిండిపై ప్రయాణికుడు ఆగ్రహం
- Warangal Murder: కొడుకులతో కలిసి మామను చంపిన కోడలు
- బాలాజీ నాయుడు టార్గెట్ రాజకీయ ప్రముఖులే...
- నా భార్య హింసిస్తోంది.. రక్షణ కల్పించండి
- కొండెక్కిన చికెన్ ధర
- ఇక్కడ నాపై బ్యాన్ విధిస్తామని బెదిరిస్తున్నారు: పాయల్ రాజ్పుత్
- గాల్లో తేలిపోతూ..కార్లో ఎగిరిపోతూ..
- అండమాన్కు ‘నైరుతి’.. రానున్న మూడ్రోజులూ వానలే
Advertisement