-
55 ఏళ్ల తర్వాత మరో టీనేజ్ చాంపియన్గా చరిత్ర.. ఆమె ఎవరంటే?
సిన్సినాటి ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 మహిళల టెన్నిస్ టోర్నీ ఫైనల్లో అమెరికా టీనేజర్, 19 ఏళ్ల కోకో గాఫ్ 6–3, 6–4తో కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచి తన కెరీర్లో తొలి మాస్టర్స్ టైటిల్ను సొంతం చేసుకుంది. కోకో గాఫ్కు 4,54,500 డాలర్ల (రూ. 3 కోట్ల 77 లక్షలు) ప్రైజ్మనీ దక్కింది ఈ గెలుపుతో 55 ఏళ్ల తర్వాత ఈ టోర్నీలో టైటిల్ నెగ్గిన టీనేజ్ ప్లేయర్గా కోకో గుర్తింపు పొందింది. 1968లో అమెరికాకే చెందిన 17 ఏళ్ల లిండా టుయెరో విజేతగా నిలిచింది. లెక్క సరిచేసిన జొకోవిచ్ ఒహాయో: సెర్బియా టెన్నిస్ యోధుడు జొకోవిచ్ తన కెరీర్లో 39వ మాస్టర్స్ సిరీస్ టైటిల్ సాధించాడు. ప్రపంచ నంబర్వన్ అల్కరాజ్ (స్పెయిన్)తో 3 గంటల 49 నిమిషాలపాటు జరిగిన సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీ ఫైనల్లో జొకోవిచ్ 5–7, 7–6 (9/7), 7–6 (7/4)తో గెలుపొందాడు. రెండో సెట్ టైబ్రేక్లో జొకోవిచ్ ఒక మ్యాచ్ పాయింట్ కాపాడుకోవడం విశేషం. విజేతగా నిలిచిన జొకోవిచ్కు 10,19,335 డాలర్ల (రూ. 8 కోట్ల 47 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ గెలుపుతో ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీ ఫైనల్లో అల్కరాజ్ చేతిలో ఎదురైన ఓటమికి జొకోవిచ్ బదులు తీర్చుకున్నాడు. ఓవరాల్గా జొకోవిచ్ కెరీర్లో ఇది 95వ సింగిల్స్ టైటిల్కాగా, కెరీర్లో 1,069వ విజయం. -
చొక్కా చించుకుని సంబురాలు చేసుకున్న జకో.. వెక్కివెక్కి ఏడ్చిన అల్కరాజ్
టెన్నిస్ దిగ్గజం, వరల్డ్ నంబర్-2 ప్లేయర్, సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ సింహ గర్జన చేస్తూ, చొక్కా చించుకుని మరీ సంబురాలు చేసుకున్నాడు. సిన్సినాటీ ఓపెన్ ఫైనల్లో వరల్డ్ నంబర్ వన్ కార్లోస్ అల్కరాజ్ను ఓడించిన అనంతరం జకో ఈ తరహా సెలెబ్రేషన్స్ను చేసుకున్నాడు. 35 రోజుల కిందట వింబుల్డన్-2023 ఫైనల్లో అల్కరాజ్ చేతిలో ఎదురైన పరాభవాన్ని గుర్తు చేసుకుంటూ విజయానందంతో ఊగిపోయాడు. Novak Djokovic beat Carlos Alcaraz in a three-set thriller for his 39th Masters title 😤 pic.twitter.com/b0foTBijs8 — Bleacher Report (@BleacherReport) August 21, 2023 3 గంటల 49 నిమిషాల పాటు రసవత్తరంగా సాగిన ఫైనల్లో జకోవిచ్.. 5-7, 7-6 (7), 7-6 (4)తేడాతో అల్కరాజ్ను మట్టికరిపించి, తన ATP మాస్టర్స్ 1000 టైటిల్స్ సంఖ్యను 39కి పెంచుకున్నాడు. ఈ మ్యాచ్ ATP టూర్ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన మ్యాచ్గా రికార్డైంది. రోజర్ ఫెదరర్-మార్డీ ఫిష్ మధ్య 2010లో జరిగిన మ్యాచ్ (2 గంటల 49 నిమిషాలు) ఈ మ్యాచ్కు ముందు వరకు ATP టూర్ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన మ్యాచ్గా ఉండింది. One of the best championship point saves you'll ever see 🙌@carlosalcaraz #CincyTennis pic.twitter.com/AHOogM0mj6 — Tennis TV (@TennisTV) August 20, 2023 ఈ మ్యాచ్లో జకోవిచ్, అల్కారాజ్ కొదమ సింహాల్లా పోరాడి అభిమానులకు అసలుసిసలు టెన్నిస్ మజాను అందించారు. ఓ దశలో జకో ఛాంపియన్షిప్ పాయింట్ వరకు వచ్చి వెనుకపడి పోయాడు. అయితే ఎట్టకేలకు విజయం జకోనే వరించింది. ఓటమి అనంతరం వరల్డ్ నంబర్ ప్లేయర్ అల్కారాజ్ కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ కలచి వేయగా.. ఇదే సమయంలో జకో విజయగర్వంతో ఊగిపోయాడు. -
Cincinnati Masters: పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో మెద్వెదెవ్
సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో ప్రపంచ నంబర్వన్, రష్యా స్టార్ డానిల్ మెద్వెదెవ్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ మెద్వెదెవ్ 7–6 (7/1), 6–3తో 11వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై గెలుపొందాడు. 2019లో ఈ టోర్నీ టైటిల్ సాధించిన మెద్వెదెవ్ సెమీఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సిట్సిపాస్ (గ్రీస్)తో తలపడతాడు. మరో క్వార్టర్ ఫైనల్లో సిట్సిపాస్ 7–6 (7/5), 5–7, 6–3తో జాన్ ఇస్నెర్ (అమెరికా)పై విజయం సాధించాడు. మిగతా రెండు క్వార్టర్ ఫైనల్స్లో కామెరాన్ నోరీ (బ్రిటన్) 7–6 (7/4), 6–7 (4/7), 6–4తో మూడో సీడ్ అల్కారజ్ (స్పెయిన్)పై, బోర్నా చొరిచ్ (క్రొయేషియా) 6–4, 6–4తో ఫీలిక్స్ అలియాసిమ్ (కెనడా)పై నెగ్గారు. -
రాఫెల్ నాదల్కు నిరాశ
సిన్సినాటి: గాయం నుంచి కోలుకొని ఆరు వారాల తర్వాత బరిలోకి దిగిన స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్కు పునరాగమనంలో షాక్ తగిలింది. సిన్సిపాటి ఓపెన్ తొలి మ్యాచ్లోనే నాదల్ వెనుదిరిగాడు. క్రొయేషియాకు చెందిన బోర్నా కొరిక్ 7–6 (9), 4–6, 6–3 స్కోరుతో నాదల్ను ఓడించాడు. 2 గంటల 51 నిమిషాల పాటు ఈ పోరు సాగింది. పొత్తి కండరాల్లో చీలికతో వింబుల్డన్ సెమీఫైనల్ మ్యాచ్కు ముందు తప్పుకున్న నాదల్ యూఎస్ ఓపెన్ సన్నాహకాల్లో భాగంగా ఈ టోర్నీలో ఆడాడు. -
Cincinnati Open 2022: తొలి రౌండ్లోనే సెరెనాకు చుక్కెదురు
సిన్సినాటి: తన టెన్నిస్ కెరీర్ చరమాంకంలో ఉందని అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్ తన ఆటతీరుతో నిరూపించింది. ఇటీవల టొరంటో ఓపెన్ టోర్నీలో రెండో రౌండ్లోనే నిష్క్రమించిన 40 ఏళ్ల సెరెనా తాజాగా సిన్సినాటి ఓపెన్ టోర్నీలో తొలి రౌండ్లోనే ఓటమి పాలైంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సెరెనా 4–6, 0–6తో బ్రిటన్ టీనేజర్, గత ఏడాది యూఎస్ ఓపెన్ చాంపియన్ ఎమ్మా రాడుకాను చేతిలో పరాజయం పాలైంది. యూఎస్ ఓపెన్ తర్వాత టెన్నిస్కు వీడ్కోలు పలుకుతానని ఇటీవల సెరెనా ఒక మేగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. 1995లో ప్రొఫెషనల్గా మారిన సెరెనా ఇప్పటివరకు 23 గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించింది. 19 ఏళ్ల రాడుకానుతో జరిగిన మ్యాచ్లో సెరెనా రెండో సెట్లో ఒక్క గేమ్ కూడా గెలవలేకపోయింది. సెరెనాపై ఒక సెట్ను 6–0తో గెలిచిన పదో ప్లేయర్గా రాడుకాను ఘనత వహించింది. 2017లో జొహనా కొంటా (బ్రిటన్) చేతిలో చివరిసారి సెరెనా ఒక సెట్ను 0–6తో కోల్పోయింది. సిమోనా హలెప్ (రొమేనియా), అనాబెల్ మెదీనా గారిగెస్ (స్పెయిన్), వీనస్ విలియమ్స్ (అమెరికా), ప్యాటీ ష్నిదెర్ (స్విట్జర్లాండ్), జస్టిన్ హెనిన్ (బెల్జియం), జెలెనా జంకోవిచ్ (సెర్బియా), మేరీజో ఫెర్నాండెజ్ (అమెరికా), అలెక్సియా డెషామ్ బాలెరెట్ (ఫ్రాన్స్) కూడా సెరెనాపై ఒక సెట్ను 6–0తో గెలిచారు. -
జొకోవిచ్కు మళ్లీ ‘వ్యాక్సిన్’పోటు!
న్యూయార్క్: కరోనా వ్యాక్సిన్ వేసుకోని కారణంగా ఈ ఏడాది తొలి గ్రాండ్స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్కు దూరమైన సెర్బియా టెన్నిస్ స్టార్ జొకోవిచ్ మరోసారి దాదాపు అదే స్థితిలో నిలిచాడు. అమెరికా దేశపు నిబంధనల ప్రకారం వ్యాక్సిన్ వేసుకోని విదేశీయులకు ఆ దేశంలో ప్రవేశం లేదు. దాంతో తన ఇష్టానికి కట్టుబడి ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేసుకోని జొకోవిచ్ వచ్చేవారం ప్రారంభమయ్యే సిన్సినాటి ఓపెన్ నుంచి వైదొలిగాడు. వ్యాక్సిన్ విషయంలో జొకోవిచ్ తీరు మారకపోతే ఈ నెల 29 నుంచి జరిగే చివరి గ్రాండ్స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్లో కూడా అతను ఆడేది అనుమానమే. అమెరికాలో అడుగు పెట్టగలననే నమ్మకం తనకు ఉందని యూఎస్ ఓపెన్ను మూడుసార్లు నెగ్గిన జొకోవిచ్ చెబుతున్నా... వ్యాక్సిన్ విషయంలో ప్రభుత్వం ఏమైనా ప్రత్యేక సడలింపులు ఇస్తే తప్ప జొకోవిచ్ విషయంలో తాము ఏమీ చేయలేమని యూఎస్ ఓపెన్ నిర్వాహకులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీలో జొకోవిచ్ విజేతగా నిలిచి కెరీర్లో 21వ గ్రాండ్స్లామ్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. -
పరాజయంతో పునరాగమనం
సిన్సినాటి (అమెరికా): ఏడు నెలల తర్వాత సింగిల్స్ విభాగంలో పునరాగమనం చేసిన బ్రిటన్ టెన్నిస్ స్టార్, మూడు గ్రాండ్స్లామ్ టోర్నీల చాంపియన్ ఆండీ ముర్రేకు నిరాశ ఎదురైంది. సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీలో అతను తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. రిచర్డ్ గాస్కే(ఫ్రాన్స్)తో జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో ముర్రే 4–6, 4–6తో ఓడిపోయాడు. జనవరిలో తుంటికి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత ముర్రే ఆటకు దూరంగా ఉన్నాడు. ఒకానొక దశలో కెరీర్కు వీడ్కోలు పలకాలని భావించాడు. అయితే గాయం నుంచి కోలుకోవడంతో జూన్లో మళ్లీ ఆటపై దృష్టి పెట్టాడు. డబుల్స్ విభాగంలో ఐదు టోర్నీల్లో ఆడాడు. సిన్సినాటి ఓపెన్లో తొలి రౌండ్లో ఓడిపోయినప్పటికీ తాను బాధ పడటంలేదని అన్నాడు. వచ్చే నెలలో జరిగే సీజన్లోని చివరి గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్లో తాను సింగిల్స్ విభాగంలో పోటీపడటం లేదని స్పష్టం చేశాడు. మరోవైపు ఇదే టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో మాజీ నంబర్వన్ క్రీడాకారిణులు షరపోవా (రష్యా), వీనస్ విలియమ్స్ (అమెరికా) శుభారంభం చేశారు. తొలి రౌండ్ మ్యాచ్లో షరపోవా 6–3, 7–6 (7/4)తో అలీసన్ రిస్కీ (అమెరికా)పై, వీనస్ 7–5, 6–2తో లారెన్ డేవిస్ (అమెరికా)పై విజయం సాధించారు. -
ఫైనల్లో ఫెడరర్
సిన్సినాటి (అమెరికా): కెరీర్ లో 99వ సింగిల్స్ టైటిల్ సాధించేందుకు స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్... కెరీర్లో 70వ సింగిల్స్ టైటిల్ సొంతం చేసుకునేందుకు సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ విజయం దూరంలో ఉన్నారు. సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్ టోర్నమెంట్లో ఈ ఇద్దరూ టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నారు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ఫెడరర్ 7–6 (7/3), 1–1తో డేవిడ్ గాఫిన్ (బెల్జియం)పై, జొకోవిచ్ 6–4, 3–6, 6–3తో మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై గెలిచారు. ఫెడరర్తో జరిగిన మ్యాచ్లో గాఫిన్ తొలి సెట్లో ఓడిపోయాక, రెండో సెట్లో స్కోరు 1–1 వద్ద ఉన్నపుడు గాయం కారణంగా వైదొలిగాడు. -
సెమీస్లో సానియా జంటకు నిరాశ
ఒహాయో: సిన్సినాటి ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. మహిళల డబుల్స్లో సానియా మీర్జా–షుయె పెంగ్ (చైనా) జంట సెమీఫైనల్లో నిష్క్రమించగా... పురుషుల డబుల్స్లో రోహన్ బోపన్న–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జోడీ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్ల్లో సానియా–షుయె పెంగ్ జంట 4–6, 6–7 (4/7)తో సు వీ సెయి (చైనీస్ తైపీ)–మోనికా నికెలెస్కూ (రొమేనియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. గంటా 33 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సానియా–షుయె పెంగ్లకు తమ ప్రత్యర్థి సర్వీస్ను 6 సార్లు బ్రేక్ చేసే అవకాశం లభించినా ఒక్కసారి మాత్రమే సఫలమయ్యారు. సానియా జంటకు 37, 278 డాలర్ల ప్రైజ్మనీ (రూ. 23 లక్షల 91 వేలు)తోపాటు 350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. బోపన్న–డోడిగ్ జోడీ 1–6, 7–6 (7/5), 7–10తో లుకాజ్ కుబోట్ (పోలాండ్)–మార్సెలో మెలో (బ్రెజిల్) ద్వయం చేతిలో పరాజయం పాలైంది. బోపన్న జంటకు 37, 250 డాలర్ల (రూ. 23 లక్షల 90 వేలు) ప్రైజ్మనీతోపాటు 180 ర్యాంకింగ్ పాయింట్లు దక్కాయి.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- కేవలం రూ.4 కోట్ల సినిమా.. నెల రోజుల్లోనే యానిమల్ను దాటేసి!
- బేబీ హీరోయిన్ హారర్ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా?
- ఎంటర్ప్రెన్యూర్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్గా మారిన లాయర్! ఏకంగా ఆరుసార్లు కేన్స్..!
- బాయ్ఫ్రెండ్తో బ్రేకప్.. తొలిసారి క్లారిటీ ఇచ్చిన శృతిహాసన్!
- 'ఇప్పుడు కొనండి.. తరువాత చెల్లించండి'.. గూగుల్ పే కొత్త ఫీచర్
- ‘దాడి సమయంలో కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారు’
- 800 ఏళ్ల నాటి వ్యాయామం..దెబ్బకు ఒత్తిడి, అలసట మాయం!
- బీసీసీఐ ఆఫర్ నిజమే.. నేనే రిజెక్ట్ చేశా: ఆసీస్ దిగ్గజం
- SRH vs RR: ‘సన్రైజర్స్ కాదు!.. రాజస్తాన్కే గెలిచే ఛాన్స్’
- పీకేకు దిమ్మతిరిగే ప్రశ్న.. సహనం కోల్పోయిన రాజకీయ వ్యూహకర్త
Advertisement