-
దివ్యాంగులకు పరీక్షా కాలంలో పలికే చేయి
పరీక్షల సీజన్ వస్తే రమా పద్మనాభన్ ఇంటి వ్యవహారాలను పెద్దగా పట్టించుకోదు. పెళ్లిళ్లు, ప్రయాణాలు అసలే ఉండవు. ఆమె తనకు వచ్చే కాల్స్ను అటెండ్ చేసే పనిలో ఉంటుంది. ‘అక్కా.. ఈ ఎగ్జామ్ రాయాలి’ ‘ఆంటీ... ఈ డేట్న ఎంట్రన్స్ ఉంది’ ఇలా దివ్యాంగులు ఆమెకు కాల్స్ చేస్తుంటారు. వారి కోసం ఆమె పరీక్ష హాల్కు వెళ్లి వారి ఆన్సర్స్ను రాసి పెడుతుంటుంది. ‘ఇది గొప్ప తృప్తినిచ్చే సేవ’ అంటోందామె.చదువుకునే రోజుల్లో ఎవరైనా పరీక్షలు రాయవచ్చు. చదువు అయిపోయాక ఏవైనా కోర్సులు సరదాగా చదివితే పరీక్షలు రాయవచ్చు. కాని రమా పద్మనాభన్ అలా కాదు. ఆమె ప్రతి ఆరు నెలలకు విద్యార్థులకు సెమిస్టర్ ఎగ్జామ్స్ జరిగినప్పుడల్లా 50 పరీక్షలు రాస్తుంది. అంటే రాసి పెడుతుంది. గత పదకొండేళ్లుగా ఆమె అలా చేస్తూనే ఉంది. దివ్యాంగులకు పరీక్షలు రాసి పెట్టే స్క్రయిబ్గా ఆమెకు కోయంబత్తూరులో ఉండే పేరు అలాంటిది.గృహిణిగా ఉంటూ...కోయంబత్తూరుకు చెందిన రమా పద్మనాభన్ సైకాలజీలో డిగ్రీ చేసింది. ఆ తర్వాత ‘గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్’లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కూడా చదివింది. భర్త ఫైనాన్షియల్ సెక్టార్లో పని చేస్తాడు. ఆమెకు ఇద్దరు అబ్బాయిలు. గృహిణిగా పిల్లలను చూసుకుంటూ కాలం గడుపుతున్న రమా పద్మనాభన్ జీవితం 2013లో మారింది. ‘ఆ రోజు నేను యోగా క్లాసుకు బయలుదేరాను. నా స్నేహితురాలి నుంచి ‘ఒక అంధ విద్యార్థికి పరీక్ష రాసి పెడతావా?’ అనే విన్నపం వచ్చింది. అలా రాయగలనా అనుకున్నాను. పరీక్ష కేంద్రం దగ్గరే కనుక ట్రై చేద్దామనిపించింది. వెళ్లి రాసి పెట్టాను.పరీక్ష ముగిశాక ఆ అంధ విద్యార్థి ముఖంలో కనిపించిన కృతజ్ఞత నాకు ఎంతో మనశ్శాంతిని ఇచ్చింది. ఆ తర్వాత నాకు కాల్స్ రావడం మొదలైంది. కోయంబత్తూరులో లూయిస్ బ్రెయిలీ అకాడెమీ ఉంది. వాళ్లు కాల్ చేస్తూనే ఉంటారు. వీరు కాకుండా దివ్యాంగులు, ఆటిజమ్ విద్యార్థులు... వీరు పెన్ పట్టి పరీక్ష రాయడం కష్టం. వారికి పరీక్షలు రాసి పెడుతుంటాను’ అని తెలిపింది రమా పద్మనాభన్.అంతా ఉచితమేదివ్యాంగులకు, అంధులకు పరీక్షలు రాసేందుకు రమ ఎటువంటి రుసుమూ తీసుకోదు. పరీక్షా కేంద్రానికి కూడా సొంత ఖర్చులతోనే వెళ్లి వస్తుంది. ‘అయితే అందుకు నా భర్తను అభినందించాలి. నీ డబ్బులు ఖర్చు పెట్టి వేరొకరి పరీక్షలు ఎందుకు రాస్తున్నావు అని ఎప్పుడూ అడగలేదు’ అంటుంది రమ. ‘అంధ విద్యార్థులు తమకు పరీక్షలు రాసి పెట్టే వారు లేరని తెలిస్తే చాలా టెన్షన్ పడతారు. ఆబ్సెంట్ అయితే పరీక్ష పోతుంది. అందుకే వారికి స్క్రయిబ్లు కావాలి. వారు చెబుతుంటే జవాబులు సరిగ్గా రాయగలగాలి. నేను ఆటిజమ్ విద్యార్థులకు రాసి పెట్టేటప్పుడు మరింత శ్రద్ధగా ఉంటాను. వారు సమాధానాలు కంటిన్యూస్గా చెప్పడంలో ఇబ్బంది పడతారు. ప్రోత్సహిస్తూ రాబట్టాలి. అదే కాదు హైస్కూల్ పాఠాల దగ్గరి నుంచి ఇంజినీరింగ్ పాఠాల వరకూ అవగాహన ఉండాలి. అందుకే ఆ పాఠాలు కూడా తెలుసుకుంటూ ఉంటాను. స్క్రయిబ్గా నేను మారేటప్పటికి నా పిల్లలు చిన్నవాళ్లు. నా చిన్నకొడుకుకైతే ఐదారేళ్లవాడు. ఇంటిదగ్గర వాణ్ణి ఒక్కణ్ణే వదిలి తాళం వేసుకుని పరీక్ష రాసి పెట్టిన సందర్భాలున్నాయి’ అని తెలిపిందామె.కొనసాగే అనుబంధం‘నేను రాసిన పరీక్షలతో కోర్సులు పాసై ఉద్యోగాలు పొందిన దివ్యాంగులు చాలా మంది ఉన్నారు. వాళ్లంతా నా కాంటాక్ట్లో ఉంటారు. తమ జీవితంలో సాధిస్తున్న ప్రగతిని తెలియజేస్తుంటారు. అదంతా వింటుంటే ఎంతో సంతృప్తిగా అనిపిస్తుంది. జీవితానికి ఒక అర్థం దొరికినట్టు ఉంటుంది. నా పెద్దకొడుకు సీనియర్ ఇంటర్కు వచ్చాడు. వాణ్ణి వీలున్నప్పుడల్లా స్క్రయిబ్గా పని చేయడానికి పంపుతున్నా. వాడు ఆ పని చేస్తున్నందుకు ఎంత సంతోష పడుతున్నాడో చెప్పలేను’ అని ముగించింది రమా పద్మనాభన్. -
అంధులపై ఎందుకీ బ్రహ్మాస్త్రం! అసలేం జరిగింది?
సాక్షిప్రతినిధి, కరీంనగర్: తిరుమల–రాజ్కుమార్ దంపతులు అంధులు. కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ కాలనీలోని జెడ్పీహెచ్ఎస్లో తిరుమల క్లర్కు. ఆమెకు జూనియర్ అసిస్టెంట్ విధులు కేటాయించారు. సాయం కోసం (స్క్రైబ్) తన భర్త రాజ్కుమార్ను తోడుగా తెచ్చుకునేది. వీరిద్దరికీ 80శాతం చూపులేదు. కనీసం నాలుగు అంగుళాల దగ్గరగా ఉంటే తప్ప చూడలేరు. వ్యక్తులను కేవలం గొంతు ఆధారంగా గుర్తు పడతారు. కానీ, దాదాపు రూ.10 లక్షల వరకు టీచ ర్ల సొమ్ము ప్రభుత్వానికి జమ చేయకుండా జేబులో వేసుకున్నారని హెడ్మాస్టర్ ఫిర్యాదు చేయడంతో ఇద్దరిపై నాన్బెయిలబుల్ కేసులు నమోదయ్యా యి. దీంతో, టీచర్ల లోకం భగ్గుమంది. పోలీసుల తీరుపై మండి పడుతోంది. చూపులేని వారు తమ వేతనాలు ఎలా కాజేస్తారు? ఆ విషయాన్ని పోలీసులు ఎలా నమ్మారు? అసలు ప్రాథమిక విచారణ జరిగిందా? అని ప్రశ్నిస్తున్నారు. తమను స్కూల్ హెడ్మాస్టర్ రాజభాను చంద్రప్రకాశ్ ఈ కేసులో ఇరికించారని, ఎదుటి వ్యక్తిని చూడలేని తాము రూ.లక్షలు ఎలా తీసుకుంటామని ఆ అంధ దంపతులు అంటున్నారు. అసలేం జరిగింది? ఈ వ్యవహారంలో అంధ దంపతులు ‘సాక్షి’ని ఆశ్రయించి జరిగింది మొత్తం వివరించారు. వారెమన్నారంటే.. ‘ఎల్ఎండీ కాలనీ జెడ్పీ హైస్కూల్లో రాజ భాను చంద్రప్రకాశ్ హెడ్మాస్టర్. ప్రతినెలా పాఠశాలలో పనిచేసే టీచర్ల జీతాలు ఇతనే ప్రిపేర్ చేసి, పంపిస్తారు. ఇక్కడి ఉపాధ్యాయుల్లో చాలామంది వివిధ వ్యక్తిగత కారణాలతో సెలవు (మెడికల్/చైల్డ్ కేర్ తదితర లీవు)లు పెడుతుంటారు. కానీ, హెచ్ఎం వారు సెలవులో ఉన్నట్లు కాకుండా పని చేసినట్లు రికార్డులో నమోదు చేస్తారు. ఆయా పని దినాలకు వేతనం లెక్కగట్టి, ఉన్నతాధికారులకు పంపుతారు. వేతనం టీచర్ల ఖాతాలో క్రెడిట్ కాగానే వారి కి ఫోన్ చేసి, పొరపాటున సెలవు దినాలకు జీతం యాడ్ అయిందని, దాన్ని వెనక్కి పంపితే చలానా రూపంలో తిరిగి ప్రభుత్వానికి పంపుతానని నమ్మబలుకుతారు. ఇలా 2021 నుంచి 2024 వరకు దాదాపు రూ.10 లక్షల వరకు వేతనాలను క్రెడిట్ చేయడం, అనంతరం వారి నుంచి తీసుకోవడం, వాటిని తన జేబులో వేసుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఎవరైనా అడిగితే నకిలీ చలానాలు చూపేవారు. ఐటీ రిటర్నుల విషయంలోనూ ఇలాగే చేసి, డబ్బులు వసూలు చేసేవారు’ అని అంధ దంపతులు బోరుమన్నారు. ప్రతీసారి టీచర్ల డబ్బును తెలి విగా తమకు ఫోన్ పే/గూగుల్ పే చేయించేవారని, వాటిని తాము డ్రా చేసి నగదు రూపంలో హెడ్మాస్టర్కు అందజేసేవారమని చెప్పారు. ఇటీవల కొందరు టీచర్లకు అనుమానం వచ్చి, నిలదీసేసరికి విషయాన్ని తమపైకి నెట్టాడని వాపోయారు. రూ.7 లక్షలు అడిగితే ఇచ్చాం.. ఈ నెల మొదటివారంలో తమ వద్దకు వచ్చిన హెడ్మాస్టర్ తమను బెదిరించి, బలవంతంగా తామే ఈ నేరానికి పాల్పడినట్లు లెటర్ తీసుకున్నారని తిరుమల–రాజ్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగం పోకుండా ఉండాలంటే రూ.7 లక్షలు కట్టాలని బెదిరిస్తే.. అప్పు చేసి ఇచ్చామన్నారు. ఆ తర్వాత జరిగిన వ్యవహారంలో ఎక్కడా ఆయన పాత్ర లేకుండా చూపేందుకు ఉన్నతాధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసి, సమాజంలో తమను దోషులను చేశాడని వాపోయారు. తమకు ఇద్దరు పిల్లలని, ఇప్పుడు ఈ కేసులో జైలుకు పంపి, తమ కుటుంబాన్ని నాశనం చేసే కుట్రకు తెరతీశారని కన్నీరు పెట్టుకున్నారు. అమెరికా వెళ్లినా జీతం క్లెయిమ్.. తిమ్మాపూర్లో ఓ టీచర్ 2022 సెప్టెంబర్లో అమెరికా వెళ్లారని, ఇందుకోసం 6 నెలలపాటు ముందస్తుగా డీఈవో వద్ద అనుమతి పొందారని తెలిపారు. నవంబర్ జీతం డిసెంబర్లో ఆమెకు బ్యాంకు ఖాతాలో పడిందన్నారు. వెంటనే హెడ్మాస్టర్ సదరు టీచర్ను సంప్రదించి, మొత్తం వేతనం వెనక్కి తెప్పించారని, ఈ వ్యవహారంలో సదరు టీచర్ హెచ్ఎం తీరుపై మండిపడి, నిలదీశారని తెలిపారు. కాగా ఈ విషయమై పాఠశాల హెచ్ఎంను సంప్రదించగా.. అందుబాటులోకి రాలేదు. విదేశాలకు వెళ్లిన టీచర్కు డీఈవో అనుమతి కనికరం లేని పోలీసులు.. పోలీసులు కేసు నమోదు చేసే క్రమంలో కనీసం తమను సంప్రదించలేదని, అసలు 80 శాతం చూపులేని తమకు హెడ్మాస్టర్ ముఖమే తెలి యదని, సంతకాలు ఎలా ఫోర్జరీ చేస్తామని ఆ అంధ దంపతులు అన్నారు. పోలీసులు ప్రాథమిక విచారణ చేయకుండా తమపై కేసు నమో దు చేయడం ఏంటని ప్రశ్నించారు. కేసు విషయంలో నిజానిజాలు తెలుసుకునేందుకు తిమ్మాపూర్ పోలీస్స్టేషన్కు వెళ్తే తమను పట్టించుకోలేదని వాపోయారు. కంటిచూపులేని వారమన్న కనికరమైనా చూపకుండా హెచ్ఎంపై ఫిర్యాదు తీసుకోకపోవడం దారుణమన్నారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులను, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. హెచ్ఎం రాజభాను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ప్రతీచోట తాము అంధులమని పేర్కొన్న విషయాన్ని గమనించాలని కోరారు. ఇవి చదవండి: ఏఆర్ డీఎస్పీ ఇంటి ఎదుట భార్య ఆందోళన -
‘నీ గొంతు గుర్తు పట్టాను సుమా’.. అంధుడి ముఖంపై చిరునవ్వు
మానవ సంబంధాలు చాలా చిత్రమైనవి.. ఎప్పుడు ఎలా ఏర్పడతాయో.. పెనవేసుకుపోతాయో... విరిగి.. కరిగి పోతాయో అందరికీ అర్థమయ్యే విషయం కాదు.. కావాలంటే ఈ రీల్ చూడండి. ముంబై మహా నగరంలో ఓ వర్ధమాన నటి చేసిన రీల్ ఇది. రోజూ ఎక్కే ట్రెయిన్లో తను.. తనతోపాటే అదే రైల్లో పాటలు పాడుతూ నాలుగు డబ్బులు కోరుకునే దివ్యాంగుడు! కళ్లు లేని ఆ దివ్యాంగుడి పాటకు.. తన మాటను జత చేసింది.. ఇరువురూ తమదైన ప్రపంచాల్లో డ్యూయెట్ పాడారు.. చివరగా ఆ అంధుడి ముఖంపై ఓ చిరునవ్వు.. నీ గొంతు గుర్తు పట్టాను సుమా అని! ఇదీ ఓ బంధమే. అపురూపమైంది! ఇష్టమైన వారితో మన్పర్ధలొస్తే.. గొడవలు పడితే.. ఒక్కసారి చూసేయండి. అన్నీ మరచిపోతారు! View this post on Instagram A post shared by Priya Gamree (@gamreepriya) -
కళ్లకు గంతలు కట్టుకుని మరీ రంగోలీ ముగ్గు!
అయోధ్యలో భవ్య రామమందిరం జనవరి 22న ప్రారంభవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ దైన శైలిలో తమ భక్తి భావాన్ని చాటుకుంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఒక్కొక్కరూ ఒక్కో పంథాలో అసాధ్యకరమైన పనులతో తమ భక్తి శక్తిని చాటుతూ విస్తుపోయేలే చేస్తున్నారు. ఆ బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఇంకొద్ది రోజుల్లో జరగనుండగా ఒక వైపు నుంచి అయోధ్యకు ఎంతో విలువైన కానుకలు వస్తున్నాయి. దీంతోపాటు రామ అన్న పేరుకి శక్తి ఏంటో తెలిసేలా ఒక్కో విశేషం రోజుకొకటి చొప్పున వెలుగులోకి వస్తోంది. ఇలాంటి వింతలు, విచిత్రాలు చేస్తుంటే ఆ లీలా స్వరూపుడే ఇలా తన భక్తులచే అసాధ్యమైన వాటిని చేయించుకుంటున్నాడా అన్నంత ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అలాంటి అనితర సాధ్యకరమైన ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. అదేంటో వింటే మాత్రం ఆశ్చర్యపోవడం ఖాయం. బీహార్లోని దర్భంగాకు చెందిన మోనికా గుప్తా అనే అమ్మాయి కళ్లకు గంతలు కట్టుకుని మరీ రంగోలీ వేసింది. అదికూడా రామ మందిరాన్ని ముగ్గు రూపంలో వేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. రామ భక్తితో ఎంతటి అసాధ్యమైన కార్యాన్ని అయినా సాధించొచ్చు అని నిరూపించింది మోనికా. ఆమె కళ్లకు గంతలు కట్టుకుని ఏ మాత్రం తడబడకుండా చాలా చాకచక్యంగా పెట్టింది. మాములుగా గీసినా.. ఎన్నో సార్లు చెరిపి.. చెరిపి..గీస్తాం అలాంటిది. చూడకుండా ముగ్గు వేయడం అంటే మాటలు కాదు. కానీ జనవరి 22న అయెధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో ఆమె బిహార్ నుంచి అయోధ్యకు వచ్చి మరీ ఇలా అసాధ్యకరమైన రీతీలో ముగ్గు వేయడం విశేషం. ఈ మేరకు మౌనిక మాట్లాడుతూ.. తాను ఎంఎస్సీ చదువుతున్నట్లు పేర్కొంది. తనకున్న ధ్యానం చేసే అలవాటు కారణంగానే ఇంతలా సునాయాసంగా చూడకుండా ముగ్గు వేయగలిగానని చెప్పుకొచ్చింది. ఈ ఘనత సాధించగలిగేందుకు కారణం తాను తల్లి వద్ద విన్నా మహాభారత గాథేనని చెబుతోంది. ఆ ఇతిహాసంలో దృతరాష్ట్రుడికి కళ్లకు కనిపించేలా సంజయుడు వివరించిన కౌరవులు పాండవుల యుద్ధ ఘట్టం. అలాగే మత్సయంత్రాన్ని చేధించటంలో అర్జునుడు కనబర్చిన ప్రతిభ పాటవలు తనను ఇలాంటి ఘనత సాధించేందుకు ప్రేరణ ఇచ్చాయని చెప్పుకొచ్చింది. ఇలా కళ్లకు గంతలు కట్టుకుని రంగోలీలు వేయడాన్ని నాలుగేళ్ల ప్రాయం నుంచే ప్రారంభించానని, ఏడేళ్లు వచ్చేటప్పటికీ ధ్యాన సాధనతో దానిపై పూర్తిగా పట్టు సాధించగలిగానని చెప్పింది. ఇలా చూడకుండా మనోనేత్రంతో గీయ గలిగే సామర్థ్యాన్ని సిక్త్స్ సెన్స్ యాక్టివేషన్ లేదా థర్డ్ ఐ యాక్టివేషన్గా అభివర్ణించింది మౌనిక. కాగా ఈ రామమందిర ప్రారంభోత్సవానికి ఎంతో మంది ప్రముఖులు, సెలబ్రెటీలు హాజరుకానున్నారు. (చదవండి: శని దోషాలు పోయి, సకల శుభాలు కలగాలంటే ఇలా చేయండి! ) -
అయోధ్యలో శ్రీరాముణ్ణి కీర్తించనున్న దివ్యాంగ కవి
ఈనెల 22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ముందుగానే అయోధ్యలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈనెల 14న అయోధ్యలో జరిగే ప్రత్యేక కార్యక్రమానికి దివ్యాంగ కవి అక్బర్ తాజ్ను జగద్గురు సంత్ రామభద్రాచార్య ఆహ్వానించారు. అక్బర్ తాజ్ మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలోని హప్లా-దీప్లా గ్రామానికి చెందిన దివ్యాంగ కవి. ఆయన కవితలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా అక్బర్ తాజ్ శ్రీరాముని గుణగణాలను కీర్తిస్తూ పలు రచనలు చేశారు. శ్రీరాముడు అందరికీ చెందినవాడని అక్బర్ తాజ్ చెబుతుంటారు. 44 ఏళ్ల అక్బర్ తాజ్ దృష్టిలోపంతో బాధపడుతున్నారు. బ్రెయిలీ లిపిని కూడా అక్బర్ తాజ్ నేర్చుకోలేదు. అయినప్పటికీ అక్బర్ తాజ్ తన మనసులోని భావాలను ఇతరుల చేత రాయిస్తుంటారు. ఆయన దేశవ్యాప్తంగా పలు వేదికలపై తన హిందీ, ఉర్దూ రచనలను వినిపించారు. రామునిపై ఆయన చేసిన రచనలు ఆయనకు ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. జనవరి 22న రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనకు తనను ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తానని అక్బర్ తెలిపారు. -
ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే మరెన్నో చేస్తాం
సాక్షి, హైదరాబాద్: అంధులకు చారిత్రక ప్రదేశాల సందర్శన అనుభూతిని కలిగించాలన్న ఆలోచన ఆ హిస్టోరియన్లకు వచ్చింది. దీంతో పలువురు అంధులను ఒక చోటచేర్చి చార్మినార్కు దగ్గరలోని పైగా టూంబ్స్కు తీసుకువెళ్లి వారికి టూంబ్స్లోని అద్భుత కట్టడాలను పరిచయం చేశారు. వారంతా నిజాం కాలం నాటి పైగా టూంబ్స్ కట్టడాలను తాకుతూ అప్పటి నిర్మాణశైలి గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు. ఈ వీడియోను మహ్మద్ హసీబ్ అహ్మద్ అనే చరిత్రకారుడు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తమకు ప్రభుత్వం సహకారం అందిస్తే ఇలాంటి ఈవెంట్లను మరిన్ని ఆర్గనైజ్ చేస్తామని మంత్రి కేటీఆర్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్కుమార్ను కోరారు. చార్మినార్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉండే పైగా టూంబ్స్ నిజాం కాలం నాటి పైగా కుటుంబం పవిత్రతను తెలియజేస్తాయి. పైగా కుటుంబీకులు అప్పట్లో నిజాంకు అత్యంత విధేయులుగా వ్యవహరించారు. నిజాంకు మంత్రులుగా కూడా ఉన్నారు. హైదరాబాద్లో ఉన్న చారిత్రక ప్రదేశాల్లో ఆర్కిటెక్చర్ వండర్గా పైగా టూంబ్స్ ఖ్యాతికెక్కింది. Heritage Walk for Visually Impaired Individuals at Paigah Tombs. Small initiative by our team Beyond Hyderabad. @KTRBRS @arvindkumar_ias @Ravi_1836 @sselvan @tstourism spreading happiness. Looking for Govt support to implement more such events in coming days. @PaigahsofDeccan pic.twitter.com/ZLLeog3Ilu — Mohd haseeb ahmed (@historianhaseeb) November 27, 2023 -
స్విమ్మింగ్తో ఓ మహిళ కంటి చూపు మాయం!
చాలామందికి ఈత కొట్టడం సరదా. నదుల్లోనూ, చిన్ని చిన్న కాలువాల్లో పిల్లలు, పెద్దలు ఈత కొడుతుంటారు. నిజానికి అలాంటి నీటిలో అమీబా వంటి పరాన్న జీవులు ఉంటాయని అందరికీ తెలిసిందే. కానీ అవే ఓ మహిళ కంటి చూపు పోవడానికి కారణమైంది. సాధారణ నొప్పిగా మొదలై ఏకంగా కంటిలోని కార్నియాను తినేసింది. దీంతో ఆమె శాశ్వత అంధురాలిగా మారిపోయింది. వివరాల్లోకెళ్తే..ఈ ఘటన యూకేలో చోటు చేసుకుంది. యూకేలో కెంట్కు చెందిన 38 ఏళ్ల షెరీన్ ఫే గ్రిఫిత్ ఎప్పటిలానే పబ్లిక్ స్మిమ్మింగ్పూల్లో ఈత కొట్టింది. ఐతే రెండు రోజుల తర్వా నుంచి కంటి ఇన్ఫెక్షతో విలవిలలాడింది. తొలుత సాధారణమైందిగా భావించి ఐ డ్రాంప్స్ వంటివి వేసుకుంది. వైద్యులు కూడా నార్మల్ ఇన్ఫెక్షన్గానే పరిగణించారు. కానీ రోజురోజుకి ఇన్ఫెక్షన్ తీవ్రమైందే గానీ తగ్గలేదు. పైగా కన్ను చుట్టూ ఉన్న ప్రాంతమంతా వాచి కనురెప్ప తెరవలేని స్థితికి వచ్చేసింది. దీంతో వైద్యులు కంటికి సంబంధించిన అని వైద్య పరీక్షలు నిర్వహించగా అకాంతమీబా కారణంగా ఈ ఇన్ఫెక్షన్ వచ్చినట్లు గుర్తించారు. దీంతో ఈ నొప్పి, దురద, పుండ్లు కూడిని ఇన్ఫెక్షన్న వస్తుందని బాధితురాలు షెరీన్కి తెలిపారు. ఈ ఇన్ఫెక్షన్ని తగ్గించేందుకు స్టెరాయిడ్స్, యాంటీ బ్యాక్టీరియల్ ఐ డ్రాప్స్ వంటివి ఇచ్చి చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. దురద నొప్పి ఎక్కువై విలవిలలాడింది. ఎందువల్ల ఇలా అయిందని పరీక్షించగా ఆ పరాన్న జీవి అకాంతమీబా షెరీన్ కంటిలోని కార్నియాను తినేసినట్లు గుర్తించారు. దీంతో ఆమె కంటి చూపుని కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పటికీ ఆమె ఆమె నొప్పి, దురద పుండ్లు వంటి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు తెలిపింది. అంతేగాదు తాను కంటి చూపుని కోల్పోడం వల్ల తన దైనందిన కార్యక్రమాలను వేటిని చేసుకోలేకపోతున్నట్లు ఆవేదనగా వివరించింది. కాగా, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం అకాంతమీబా సాధారణంగా సరస్సులు, మహాసముద్రాలు, మట్టి వంటి నీటి వనరుల్లో కనిపిస్తుంది. ఇది పంపు నీరు, వెంటిలేటింట్ , ఎయిర్ కండిషనింగ్ యూనిట్లు, కొలనుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కంటికి కాంటాక్ట్ లెన్స్ ధరించడం వల్ల గానీ చిన్న చిన్న కంటి గాయాల ద్వారా గానీ కన్నులోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ కలుగజేస్తుందని పేర్కొంది. ఇవి నేరుగా కళ్లపై దాడి చేసి ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. అయితే నీరు తాగడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ రాదని, అలాగే ఇది అంటువ్యాధి కూడా కాదని వైద్యులు చెబుతున్నారు. ఐతే ఈ ఇన్ఫెక్షన్కి చికిత్స అందించడం చాల కష్టమని అన్నారు. ఈ ఇన్షెక్షన్ సోకే ముందు కనిపించే లక్షణాలు.. అస్పష్టంగా కనిపించడం లేదా దృష్టి కోల్పోవడం మేఘావృతమైన కార్నియా తీవ్రమైన కంటినొప్పి కళ్లలో ఎరుపు నీళ్లు నిండిన కళ్లు కంటి ఉపరితలంపై తెల్లటి వలయాలు అయితే అకాంతమీబా కంటిలోకి ప్రవేశించిన చాలా రోజుల వరకు దాని లక్షణాలు బయటపడవని వైద్యుల చెబుతున్నారు. (చదవండి: భోజనం చేసిన వెంటనే పండ్లు తింటున్నారా? ఆరోగ్య నిపుణుల ఏం చెబుతున్నారంటే..) -
Bhavesh Bhatia: చూపున్న విజయం
సంకల్పబలం ఉన్న వారికి ఏదీ అవరోధం కాదు. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్కు చెందిన భవేష్ భాటియాకు కంటి చూపు లేదు. ‘అయితే ఏంటీ’ అనే పట్టుదల తప్ప ‘అయ్యో!’ అని నిరాశ అతడి నోటి నుంచి ఎప్పుడూ వినిపించలేదు. ‘సన్రైజ్ క్యాండిల్స్’ పేరుతో క్యాండిల్స్ కంపెనీ ప్రారంభించాడు. ప్రస్తుతం ఇది 350 కోట్ల యాన్యువల్ టర్నోవర్ ఉన్న కంపెనీగా ఎదిగింది, 9,700 మంది అంధులకు ఉపాధి ఇస్తోంది. ‘నువ్వు ఈ లోకాన్ని చూడకపోతేనేం, ఒక విజయం సాధిస్తే ఈ లోకమే నిన్ను చూస్తుంది’ అనే మంచి మాట భవేష్ విజయాలకు ఇంధనంగా పనిచేసింది. భవేష్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ మాత్రమే కాదు మంచి ఆటగాడు కూడా. పారాలింపిక్స్ వివిధ విభాగాల్లో ఎన్నో మెడల్స్ గెలుచుకున్నాడు. భవేష్ భాటియా స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర ట్విట్టర్లో పోస్ట్ చేశారు. -
చూపు లేదు కాని క్యాన్సర్ని గుర్తిస్తారు!
స్త్రీలలో బ్రెస్ట్ కేన్సర్ ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది. రేడియేషన్తో కూడిన మామోగ్రఫీ కన్నా స్పర్శతో బ్రెస్ట్ కేన్సర్ను గుర్తించడాన్ని ‘టెక్టయిల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్’ అంటారు. స్పర్శ మీద ఎక్కువగా ఆధారపడ్డ అంధ మహిళలకు ఒక ఉపాధిగా. స్పర్శతో కేన్సర్ను గుర్తించడంలో శిక్షణ ఇస్తున్నారు. ఢిల్లీలో ఇప్పటికే 18 మంది అంధ మహిళలు ఈ శిక్షణ పొందారు. ఇతర అంధ మహిళలను ఈ రంగంలోకి ఆహ్వానిస్తున్నారు. స్త్రీలు పరస్పరం మేలు పొందే ఈ విశేష కార్యక్రమాన్ని ‘లైఫ్ సేవింగ్ హ్యాండ్స్’ అంటున్నారు. న్యూఢిల్లీకి చెందిన 31 ఏళ్ల మీనాక్షి గుప్తా ప్రతి ఉదయం మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు అందరూ ఆమెను సాధారణ అంధురాలు అనుకుంటారు. కాని తాను పనిచేసే హాస్పిటల్కు ఆమె చేరుకున్నాక ఆ అంధురాలిలోని అసామాన్య నైపుణ్యం తెలిసి ఆశ్చర్యపోతారు. ఆమె ‘టెక్టయిల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్’ నిపుణురాలు. ఇలాంటి నిపుణులను ‘మెడికల్ టెక్టయిల్ ఎగ్జామినర్’ (ఎం.టి.ఇ) అంటారు. వీరు చేతి స్పర్శతో స్త్రీల వక్షోజాలలో వచ్చిన అతి చిన్న లంప్స్ను కూడా గుర్తించి కేన్సర్ బారిన పడకుండా కాపాడుతారు. బ్రెస్ట్ కేన్సర్ను స్త్రీలు ఎవరికి వారు స్పర్శ ద్వారా చెక్ చేసుకుంటూ లంప్స్ను గుర్తించవచ్చు. కాని అందరూ సరిగ్గా గుర్తించలేరు. చిన్న లంప్స్ను అసలు గుర్తించలేరు. కాని ‘టెక్టయిల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్’ నిపుణులు మాత్రం అతి చిన్న లంప్స్ను కూడా గుర్తించడంలో శిక్షణ పొందుతారు. అంధ మహిళలే ఎందుకు? ‘టెక్టయిల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్’ను జర్మనీకి చెందిన గైనకాలజిస్ట్ ఫ్రేన్ హాఫ్మేన్ కనుగొన్నాడు. బ్రెస్ట్ కేన్సర్ను గుర్తించే మామోగ్రఫీలో రేడియేషన్ ఉంటుంది. ఖర్చు కూడా. కాని చేతులతో గుర్తించడంలో ఎటువంటి రేడియేషన్ ఉండదు. ఖర్చు కూడా ఉండదు. అందుకే చేతి స్పర్శ ద్వారా ఎలా బ్రెస్ట్ కేన్సర్ను గుర్తించవచ్చో అతను కొన్ని పద్ధతులను ప్రతిపాదించాడు. ఇందులో శిక్షణకు అంధ మహిళలను ఎంచుకున్నాడు. ఎందుకంటే చూపు లేకపోవడం వల్ల అంధులు స్పర్శ మీద ఎక్కువగా ఆధారపడతారు. వారు తమ స్పర్శతో కచ్చితంగా లంప్స్ను గుర్తించగలరని ఊహించాడు. అతని ఊహ నిజమైంది. అంధ మహిళల స్క్రీనింగ్లో కేవలం 1 శాతం మాత్రమే తప్పు అంచనా వచ్చి మిగిలిన 99 శాతం నిర్థారిత అంచనా వచ్చింది. దాంతో అతను ఒక సేవాకార్యక్రమంగా ‘లైఫ్ సేవింగ్ హ్యాండ్స్’ పేరుతో ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, కొలంబియా, మెక్సికో, ఇండియాలలోని ఆయా ప్రభుత్వ అంధుల పర్యవేక్షణ సంస్థలను కోరారు. మన దేశంలో 2017 నుంచి ఈ శిక్షణ జరుగుతోంది. ఇప్పటికి 18 మంది ఎం.టి.ఇలు శిక్షణ పొందారు. మరో 8 మంది ఇప్పుడు శిక్షణ పొందుతున్నారు. 9 నెలల శిక్షణ ఢిల్లీలోని ‘బ్లైండ్ ఇండియా సెంటర్ ఫర్ బ్లైండ్ విమెన్ అండ్ డిజేబిలిటీ స్టడీస్’ (ఎన్.ఏ.బి.సి.బి.డబ్లు్య)లో మెడికల్ టెక్టయిల్ ఎగ్జామినర్ (ఎం.టి.ఇ)లుగా శిక్షణను ఇస్తున్నారు. అంధ మహిళలు, చూపు లోపం పాక్షికంగా ఉన్నవారు ఈ శిక్షణను పొందవచ్చు. 9 నెలలు ట్రైనింగ్ ఉంటుంది. ఆరు నెలలు సెంటర్లో, మూడు నెలలు ఆస్పత్రిలో పని చేయాలి. ఈ ట్రయినింగ్లో ఇంగ్లిష్, కంప్యూటర్ను ఆపరేట్ చేయడం, మానవ శరీర నిర్మాణంలో ప్రాథమిక అవగాహన తదితరాలు నేర్పిస్తారు. ‘అంధులు బ్రెస్ట్ కేన్సర్ను స్పర్శతో ఎలా గుర్తించగలరా అని ముందు సందేహించాను. కాని జర్మనీకి వెళ్లి చూశాక మన దేశంలో అంధ మహిళలకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను’ అన్నారు బ్లైండ్ ఇండియా సెంటర్ డైరెక్టర్ షాలినీ ఖన్నా. క్యాంపులలో సేవలు బ్లైండ్ ఇండియా సెంటర్ తరచూ బ్రెస్ట్ కేన్సర్ అవేర్నెస్ క్యాంపులను నిర్వహిస్తోంది. ఈ క్యాంపుల్లో ఎం.టి.ఇలు తమ స్పర్శతో స్క్రీనింగ్ సేవలు అందిస్తున్నారు. ‘4 మిల్లీమీటర్ల చిన్న లంప్ను కూడా ఎం.టి.ఇలు గుర్తిస్తున్నారు’ అని క్యాంప్ నిర్వాహకులు తెలియచేస్తున్నారు. వీరి నిర్థారణ తప్పడం లేదు కనుక అంధ మహిళలు ఈ శిక్షణ తీసుకుని ఈ సేవలను కొనసాగిస్తూ ఉపాధి పొందాలని బ్లైండ్ ఇండియా సెంటర్ తెలియచేసింది. (చదవండి: వెన్నునొప్పే కదా! అని తేలిగ్గా తీసుకోకండి! ఆ వ్యాధికి సంకేతం కావోచ్చు) -
ఓర్నీ!.. ఏం రికార్డ్..రా! ఇది..వింటేనే కన్నీళ్లు వచ్చేస్తున్నాయ్!
ఇంతవరకు ఎన్నో రికార్డులు గురించి విని ఉంటారు. చాలాచాలా వింతవింత రికార్డులను కూడా చూశాం. కానీ ఏడుస్తూ రికార్డు చేయొచ్చు అని మీకు తెలుసా!. అసలు ఇలాంటి వింత ఆలోచన.. కూడా చేస్తారా అనిపిస్తోంది కదా!. ఔను ఓ వ్యక్తి ఇలాంటి వెరైటీ రికార్డును నెలకొల్పాలనుకున్నాడు. వినూత్న రీతిలో ప్రపంచ రికార్డును సృష్టించాలని చాలా గట్టిగా నిశ్చయించకున్నాడు. అందుకోసం నాన్స్టాప్గా ఏడవలనే ఒక విచిత్రమైన టాస్క్ తీసుకున్నాడు. చివరికి రికార్డు సాధించాడో లేదో తెలియదు గానీ అతనికి లేనిపోని శారీరక కష్టాలను తెచ్చిపెట్టింది. వివరాల్లోకెళ్తే..నైజీరియన్కి చెందిన టెంబు ఎబెరే అనే వ్యక్తి ఎలాగైన ప్రపంచ రికార్డును బద్దలుగొట్టాలనే ఉద్దేశంతో నాన్స్టాప్గా ఏడవం అనే ఫీట్ని ఎన్నుకున్నాడు. రికార్డు బ్రేక్ చేయడం కోసం ఏకంగా ఏడు రోజుల పాటు నాన్స్టాప్ ఏడ్చాడు. దీంతో అతడను 45 నిమషాల పాటు చూపుని కోల్పోయాడు. అంతలా ఏడవడం కారణంగా తలనొప్పి, ముఖం వాచిపోవడం, కళ్లు ఉబ్బడం వంటి శారరీక రుగ్మతలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఐతే అనతు గిన్నిస్ వరల్ఢ్ రికార్డుకి దరఖాస్తు చేయలేదు కాబట్టి అతడు చేసిన ఫీట్ని ఇంకా పరిగణలోకి తీసుకోలేదు. ఇలాంటి క్రేజీ రికార్డులు చేయడం నైజీరియన్లకు కొత్తేమీ కాదు. ఎందకంటే గతంలో ఇలానే ఓ మహిళ 100 గంటల పాలు వంటలు చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. (చదవండి: ఏ కన్నులు చూడని రెండు చిత్రాలు దాగున్నాయి!కనిపెట్టగలరా?) -
ఖమ్మంలో అంధుల కోసం ప్రత్యేక పార్కు.. విశేషాలివే!
పార్కు అంటే అందరికీ ఆహ్లాదం కలిగించేదే. కానీ లోకాన్ని చూడలేని అంధులు పార్కుకు వెళితే.. ఎలా నడవాలి, ఎటు వెళ్లాలి? ఊయలలోనో, మరో ఆట పరికరంపైనో పడిపోకుండా ఎలా ఆహ్లాదం పొందాలి? ఇలాంటి ప్రశ్నల నేపథ్యంలోనే.. ఖమ్మంలోని వినూత్నమైన పార్కును సిద్ధం చేశారు. అంధులైన చిన్నారులతోపాటు ఇతర దివ్యాంగులు, వయో వృద్ధులకు సౌకర్యవంతంగా ఉండేలా అభివృద్ధి చేశారు. అంధుల కోసం ప్రత్యేక లిపిని సృష్టించిన లూయీస్ బ్రెయిలీ విగ్రహాన్ని కూడా ఇందులో ఏర్పాటు చేశారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మంత్రి పువ్వాడ అజయ్ ప్రారంభించనున్న ఈ పార్కు విశేషాలివీ.. – ఖమ్మం మయూరి సెంటర్ సులువుగా నడిచేలా.. చేతికర్ర సాయంతో నడిచే అంధులు పార్కులో ఇబ్బంది పడకుండా వాకింగ్ ట్రాక్పై ప్రత్యేక టైల్స్ ఏర్పాటు చేయించారు. దారిలో ముందుకు వెళ్లాలని సూచించేలా పొడవుగా ఉండే బుడిపెలతో కూడిన టైల్స్ను ట్రాక్ మధ్యలో పెట్టారు. మలుపు తీసుకోవాల్సిన చోట, మధ్యలో పక్క నుంచి మరోదారి ఉన్న చోట.. ఈ విషయాన్ని గుర్తించగలిగేలా చిన్న బుడిపెలతో కూడిన ‘అలర్ట్ టైల్స్’ను ఏర్పాటు చేశారు. చేతికర్ర, లేదా పాదాలతో తాకడం ద్వారా అంధులు వీటిని గుర్తిస్తూ.. సులువుగా నడిచి వెళ్లేందుకు వీలుంటుంది. పడిపోకుండా.. పట్టుకోల్పోకుండా.. అంధులతోపాటు ఇతర దివ్యాంగులు, వయో వృద్ధులకు కూడా ప్రయోజన కరంగా ఉండేలా ఆట వస్తువులను ఈ పార్కులో ఏర్పాటు చేశారు. సీ–సా (రెండు వైపులా ఇద్దరు కూర్చుని పైకి కింది ఊగే పరికరం), ఊయల, జారుడు బల్ల వంటి వాటికి.. రెండు పక్కలా, వెనకాల కుర్చిల తరహాలో పట్టుకునేలా తయారు చేయించారు. ♦ పార్కులో ఏర్పాటు చేసిన పంచతత్వ విభాగం (ఇసుక, సన్నని రాళ్లు, గడ్డి, సాధారణ మట్టి, నీళ్లు.. ఇలా ఐదు రకాలతో కూడిన వాకింగ్ ట్రాక్)లో కూడా రెండు వైపులా ఇనుప కడ్డీలను అమర్చారు. అంధులతోపాటు వయో వృద్ధులు వాటిని పట్టుకుని సులువుగా నడవడానికి వీలవుతుంది. ప్రత్యేక సంగీత పరికరాలు కూడా.. దివ్యాంగులు, అంధులు మరింత ఏకాగ్రత సాధించేందుకు మ్యూజిక్ థెరపీ ఉపయోగపడుతుందని చెప్తుంటారు. ఈ క్రమంలో పార్కులో వారికోసం ప్రత్యేకంగా సంగీత పరికరాలను ఏర్పాటు చేశారు. కాండెజా, కాంగస్ డ్రమ్స్, సోప్రానో పెంటాటోనిక్, బెబల్ డ్రమ్ వంటి వాయిద్య పరికరాలను అమర్చారు. ఇక పార్క్ ఆవరణలో స్థానిక కార్పొరేటర్ మక్బూల్ సొంత నిధులతో చిన్న గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేయించారు. -
ఆమె ధైర్యం ముందు నిరాశ నిలబడలేకపోయింది!
పెల్లెట్ గన్లో నుంచి పెల్లెట్స్ గంటకి 1100 కి.మీ వేగంతో ఇన్షా రెండు కళ్లలోకి దూసుకెళ్లాయి. అప్పుడా అమ్మాయి 9 చదువుతోంది. 2016లో కశ్మీర్లో గుంపును అదుపు చేయడానికివాడిన పెల్లెట్ గన్స్ అమాయకులకు కూడా శాపంగా మారాయి. ఇన్షా ఓడిపోలేదు. నిరాశ పడలేదు. అంచెలంచెలుగా శ్రమ చేసి చదువుకుంది.మొన్న సీనియర్ ఇంటర్ పరీక్షలలో 500కి 315 మార్కులు సాధించింది. ‘నేను ఐ.ఏ.ఎస్ అవుతాను. అంధులకు ఆత్మవిశ్వాసం ఇస్తాను’ అంటోంది. అంధులేంటి.. ఓటమి భయంతో ఉన్నవారందరూ ఆత్మవిశ్వాసం పొందగలరు ఇన్షాను చూస్తే. దక్షిణ కశ్మీర్లోని షోపియన్ ప్రాంతంలో సెదౌ అనే చిన్న పల్లె. వేసవి కాలం. అల్లర్లు చెలరేగాయి. భద్రతా దళాలు వారిని అదుపు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇంట్లో మొదటి అంతస్తు కిటికీలో నుంచి ఏం జరుగుతున్నదో చూద్దామని 16 ఏళ్ల ఇన్షా ముష్టాక్ కిటికీ తెరిచింది. ఆ తర్వాత ఏమైంది అర్థం కాలేదు. క్షణపాటులో ఆమె రెండు కళ్ల నుంచి రక్తం దౌడు తీసింది. విపరీతమైన నొప్పితో ఇన్సా ఆర్తనాదాలు చేసింది. 2016, 2017... రెండు సంవత్సరాల పాటు భద్రతాదళాలు కశ్మీర్లో ప్రయోగించిన పెల్లెట్ గన్స్ వల్ల శాశ్వతంగా అంధులైన వారు 139 మంది. వారిలో ఇన్షా ఒకమ్మాయి. విఫలమైన డాక్టర్లు పెల్లెట్లు కళ్లల్లోకి దూసుకెళ్లగానే ఇన్షా చూపు పోయింది. కాని మానవీయ సంస్థలు, ప్రభుత్వం కూడా ఇన్షా చికిత్స కోసం ముందుకు వచ్చింది. ఢిల్లీ ఎయిమ్స్లో డాక్టర్లు కూడా ప్రయత్నించి ఆమెకు ఎప్పటికీ చూపు రాదని తేల్చారు. పెల్లెట్లు జీవితాంతం శరీరంలో ఉండిపోతాయి. అవి చాలా ప్రమాదం. ‘అయితే అంతకన్నా ప్రమాదం నిరాశలో కూరుకుపోవడం అని నాకు తెలుసు. నేను చదువుకోవాలనుకున్నాను. నా కంటే ముందు మా అమ్మ అఫ్రోజా, డ్రైవర్గా జీవితం గడిపే మా నాన్న ముష్టాక్ అహ్మద్ లోన్ నేను చదువుకోవాలని భావించారు. మరో రెండేళ్ల తర్వాత ఒక లేఖకుని సహాయంతో నేను టెన్త్ పాసయ్యాను’ అని తెలిపింది ఇన్హా. బ్రెయిలీ నేర్చుకుని... అయితే ఇంటర్ మాత్రం బ్రెయిలీ నేర్చుకుని పరీక్షలు రాసి పాసవ్వాలని నిశ్చయించుకుంది ఇన్షా. ఇందుకోసం శ్రీనగర్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జాయిన్ అయ్యింది. ఇంటర్తో పాటు కంప్యూటర్ కోర్సు, ఇంగ్లిష్ స్పీకింగ్ కోర్సు కూడా నేర్చుకుంది. బ్రెయిలీ ద్వారా పాఠాలు నేర్చుకుని పరీక్షలు రాయడం చాలా కష్టమయ్యేది. అయినా సరే ఇన్షా ఆగలేదు. 2011లో ఫస్ట్ ఇయర్ ఇంటర్ పూర్తి చేసింది. ఈ సంవత్సరం సెకండ్ ఇయర్ ఇంటర్ ఏ గ్రేడ్లో పాసయ్యింది. ‘చదువు ఒక్కటే నాకు స్వేచ్ఛ, స్వతంత్రం ఇవ్వగలదు. అది నాకు తెలుసు. ఐ.ఏ.ఏస్ చేయాలనుకుంటున్నాను. అంధులకు మన దేశంలో తగినన్ని ప్రత్యేకమైన స్కూల్స్ లేవు. ఆ విషయంలో నేను కృషి చేస్తాను’ అని తెలిపింది ఇన్షా. సానుభూతి ఇష్టపడదు ఇంటర్ పాసయ్యిందని తెలిశాక ఆమె తల్లిదండ్రులు ఉద్వేగంతో కన్నీరు కార్చారు. తండ్రి, తల్లి తమ కూతురి పట్టుదలకు గర్వపడ్డారు. ఇన్షా కూడా తన విజయంతో సంతోషంగా ఉంది. జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, హోమ్ మినిస్ట్రీ అధికారులు ఆమెను మెచ్చుకున్నారు. మంచి కాలేజ్లో చదువు కొనసాగడానికి హామీలు దొరికాయి. ఉత్సాహపరిచే వాళ్లను తప్ప సానుభూతి చూపించేవాళ్లను ఇన్షా ఇష్టపడదు. ‘నేను అందరితో సమానంగా జీవించగలను. నాకు సానుభూతి చూపకండి. వీలైతే నా ప్రయాణంలో తోడు నిలవండి’ అంటోందామె. (చదవండి: ప్రాణం నిలిపే రక్తపు బొట్టు ) -
అంధత్వం అడ్డుకాదంటూ.. ఆమె సాధించిన ఘనత ఇదే!
అంధత్వం అభివృద్ధికి ఆటకం కాదని పలువురు నేత్రహీనులు నిరూపించిన ఉదంతాలను మనం చూస్తుంటాం. ఇప్పుడు ఇదేకోవలో ఒక యువతి తన అంధత్వలోపాన్ని అధిగమించి అందరిచేత శభాష్ అని అనిపించుకుంటోంది. వివరాల్లోకి వెళితే ఛత్తీస్గఢ్లోని రాయపూర్ పరిధిలోగల గుడియాపరిలోని జనతాకాలనీకి చెందిన అంధురాలు దేవశ్రీ భోయర్ పీహెచ్డీ పట్టాను అందుకుంది. దేవశ్రీ ఈ డిగ్రీ అందుకోవడం వెనుక ఆమె తండ్రి అమెఘ కృషి దాగుంది. కుమార్తె థీసెస్ రాయడంలో తండ్రి ఎంతగానో సహకరించారు. దీంతో దేవశ్రీ తాను సాధించిన విజయాన్ని తన తల్లిదండ్రులకు అంకితమిస్తున్నట్లు ప్రకటించింది. ‘అమ్మానాన్నా నాలో నమ్మకాన్ని మరింతగా పెంపొందించారు. నాకు ఎంతో ధైర్యాన్ని కూడా ఇచ్చారు. వారి సాయంతోనే నేను ఈ విజయాన్ని సాధించాను’ అని ఆమె తెలిపింది. పుట్టుకతోనే అంధురాలైన దేవశ్రీ పండిట్ రవిశంకర్ శుక్లా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టాను అందుకుంది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ‘మా నాన్న ఒక చిన్న దుకాణం నడుపుతున్నారు. ఒక చిన్న ఇంటిలో మేము ఉంటున్నాం. ఆ దుకాణం ద్వారా వచ్చే ఆదాయంతోనే మా కుటుంబ సభ్యుల పోషణ జరుగుతుంది. మా నాన్న దుకాణం నడుపుతూనే, నాకు చదువులో సహకారం అందిస్తుంటారు. ఒక్కోసారి ఏకంగా 10 గంటల పాటు నా దగ్గర కూర్చుని చదివించిన రోజులు కూడా ఉన్నాయి. ఈ రోజు నేను పీహెచ్డీ పట్టా అందుకున్నానంటే అందుకు మా నాన్న సహకారమే కీలకం అని చెప్పగలను. నేను నేత్రహీనురాలిని అయినందున ప్రపంచాన్ని విభిన్నంగా చూడగలను. ఇదే నన్ను పీహెచ్డీ చేసేందుకు పురిగొల్పింది. దీనికితోడు మా నాన్న అందించిన సహకారం మరువలేనిది. నా కోసం రాత్రివేళ మేల్కొని థీసెస్ రాసేవారు. ఆయన ఎంత అలసిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ నా థీసెస్లో ఎంతో సహకారం అందించారు’ అని దేవశ్రీ తెలిపింది. దేవశ్రీ తండ్రి గోపీచంద్ భోయర్ యూనివర్శిటీ నుంచి అనుమతి తీసుకుని కుమార్తెకు థీసెస్ రాయడంలో సహకారం అందించారు. ఆయన కేవలం 10వ తరగతి వరకే చదువుకున్నప్పటికీ తన కుమార్తెకు పీహెచ్డీ థీసెస్ రాయడంలో సహకారం అందించడం విశేషం. -
అక్షర జ్యోతులు వెలిగిస్తున్న అంధురాలు
కై కలూరు: చీకట్లో చిరుదివ్వెలా.. నిశీధిలో కాంతి పుంజంలా.. అసమాన ప్రతిభతో ఆదర్శంగా నిలుస్తున్నారు అంధురాలు బొల్లా జోత్స్న ఫణిజా. విద్య, సంగీతం, రచన, వచన, గానం, అనువాదం, బోధన ఇలా పలు రంగాల్లో రాణిస్తూ దేశ, విదేశాల్లో ప్రశంసలు పొందుతున్నారు. ఆమె గాత్రం ఓ మధురస్వరం.. కంప్యూటర్ కోబోర్డు ఆమె క్లోజ్ ఫ్రెండ్.. మనోనేత్రంతో అక్షర జ్యోతులు వెలిగిస్తున్నారు.. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులకు పాఠ్యాంశంగా ఆమె కవిత చేరడం గర్వించదగిన విషయం. ఆంగ్ల సాహిత్యంలో రాణిస్తూ.. ఏలూరు జిల్లా కై కలూరుకు చెందిన బొల్లా అభిమన్యుకుమార్, సత్యవతి కుమార్తె జ్యోత్స్న ఫణిజా పుట్టుకతో అంధురాలు. అయినా తల్లిదండ్రులు ఏమాత్రం కుంగిపోలేదు. చిన్నతనం నుంచి ఆమెను అన్నిరకాలుగా ప్రోత్సహించారు. జ్యోత్స్న ప్రాథమిక విద్యాభ్యాసం నరసాపురం అంధుల పాఠశాల, ఇంటర్ కై కలూరు, డిగ్రీ విజయవాడలో పూర్తిచేశారు. ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్లో ఎంఏ ఆంగ్ల సాహిత్యం, ఇదే అంశంలో పీహెచ్డీ డాక్టరేట్, అడ్వాన్స్ కంప్యూటర్ ట్రైనింగ్ కోర్సు, ఢిల్లీ యూనివర్సిటీ ఇంగ్లిష్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంటుగా ఇలా చదువులో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఫెయిర్ అండ్ లవ్లీ మెరిట్ స్కాలర్షిప్తో పాటు మిస్ కాలేజీ రన్నరప్గానూ ఆమె నిలిచారు. సంగీతం.. ఆమె ప్రాణం జ్యోత్స్న ఫణిజా కర్ణాటక, హిందూస్థానీ సంగీతంలో ప్రావీణ్యం పొందారు. కువైట్ తెలుగు కళాసమితి నిర్వహించిన సంగీత స్వరనీరాజనంలో సత్తాచాటారు. ‘సాక్షి టీవీ’ నిర్వహించిన ‘కచేరి’ సంగీత కార్యక్రమంలో ప్రతిభ చూపారు. అలాగే పలు టీవీ చానళ్లు నిర్వహించిన సంగీత కార్యక్రమాల్లో ప్రతిభ చాటారు. దూరదర్శన్ సప్తగిరి చానల్ ‘ఆలపాన’ కార్యక్రమంలో పలు గీతాలు ఆలపించారు. హైదరాబాద్ త్యాగరాయ గానసభ, రవీంద్రభారతి వేదికలపై సంగీత కచేరీలు ఇచ్చారు. కవితల్లో ఘనాపాటి ఢిల్లీ యూనివర్సిటీ ఇంగ్లిష్ ఆనర్స్ మూడో సంవత్సర సిలబస్లో జ్యోత్స్న రాసిన ‘సీ’ కవితను పాఠ్యాంశంగా చేర్చారు. ఇప్పటివరకూ ఆమె 120 వరకు కవితలు రాశారు. అమెరికా, లండన్, మలేషి యా, కెనడా, ఇంగ్లిష్ మేగజైన్లలో ఆమె ప్రచురితమయ్యాయి. ప్రముఖ కవి మోపూరు పెంచుల నరసింహం తెలుగులో రచించిన రెండు కవితా సంపుటాలను క్రింసన్ లేంప్, స్టోండ్ సాంగ్ పేరుతో ఆమె అనువదించారు. ఆమె రాసిన ‘నేడు కురిసినవాన’ కవితకు నాటా (నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్) కవితా పురస్కారం దక్కింది. పెన్నా రచయిత సంఘం ఉగాది పురస్కారం, సత్యశ్రీ సాహితీ పురస్కారం, రాధేయ ఉత్తమ పురస్కారం, పాతూరి మాణిక్యమ్మ స్మారక పురస్కారం వంటివి ఆమె అందుకున్నారు. 25 ఏళ్లకే పీహెచ్డీ : ఫారెన్ లాంగ్వేజెస్ అంశంపై 25 ఏళ్లకే ఆమె పీహెచ్డీ సాధించి 2017లో అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతులమీదుగా జాతీయ అవార్డు అందుకున్నారు. అలాగే ఆమె రాసిన సిరామిక్ ఈవ్నింగ్ పుస్తకాన్ని చదివిన ప్రధాని మోదీ అభినందన లేఖను పంపారు. వరల్డ్ ఐ రైట్ ఇన్ పుస్తకానికి ఎడిటర్గా ఆమె కూడా పనిచేశారు. 2009లో దగ్గర బంధువు రాధాకృష్ణను ఆమె వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కుమారుడు హరిచందన్ ఆదిత్య చిన్నతనం నుంచే కవితా రచనలో ఆసక్తి చూపుతున్నాడు. అతడు రాసిన జాస్మిన్ బడ్స్ అనే కవిత డిఫరెంట్ ట్రూట్స్ అనే మేగజైన్లో ప్రచురితమయ్యింది. అవార్డుల పరంపర : ఆమె వక్తృత్వం, వ్యాసరచన, క్విజ్ పోటీల్లో 100 వరకు బహుమతులు సాధించారు. రెటీనా ఇండియా అవార్డు, బాలా మెమోరియల్ అ వార్డు, సంఘ మిత్ర అసోసియేన్ అంతర్జాతీయ వికలాంగ దినోత్సవ అవార్డు, స్వరం ఓ వరం సంగీత సన్మానం, ఏలూరు వెల్ఫేర్ సొసైటీ మహిళా దినోత్సవ సన్మానం, సరిగమ సంగీత పరిషత్ అవార్డు, ఆంధ్రప్రదేశ్ ప్రతిభా పురస్కారం, ధీరూబాయ్ అంబానీ స్కాలర్షిప్, ఫెయిర్ అండ్ లవ్లీ ప్రతిభ పురస్కారం పొందారు. ఆత్మరాం సనాతన్ ధర్మా కాలేజీ, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో 2015లో అసిస్టెంట్ ప్రొ ఫెసర్గా బాధ్యతలు స్వీకరించిన ఆమె ఇంగ్లిష్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంటుగా యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ సెట్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. మహిళా శక్తి ఎంతో గొప్పది మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి. విద్యార్థులకు మాతృభాషలో సాహితీ విలువలను నేర్పించాలి. సమాజంలో మహిళలపై వివక్ష చూపరాదు. మనం సంపాదించిన డబ్బుతో ఒకరి ఆకలి తీర్చండి, తెలిసిన విద్యను నేర్పించి ఉపాధి మార్గం చూపండి. దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించవచ్చు. ప్రతిఒక్కరూ లక్ష్యంతో ముందుకు సాగాలి. – జ్యోత్స్న ఫణిజా, సాహితీవేత్త, కై కలూరు -
తానా: అమ్మభాషా సేవలో అంధమేధావుల సభవిజయవంతం
డాలస్, టెక్సాస్, అమెరికా: ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రతినెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న “నెలనెలా తెలుగువెలుగ్ఙు కార్యక్రమంలో భాగంగా ఆదివారం, ఫిబ్రవరి 26న నిర్వహించన 45వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం “జ్ఞాననేత్రులు తెలుగు దివ్వెలు అమ్మ భాషా సేవలో అంధ మేధావులు అనే సాహిత్య కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర పాల్గొంటున్న అతిథులందరుకూ స్వాగతం పల్కుతూ వీరందరి మధ్య ఉన్న సారూప్యం దృష్టి లోపం కాదు, దూరదృష్టి అన్నారు. ఎన్ని ఉన్నా ఇంకా ఏదో లేదనుకుంటూ తమ జీవితాలను అంధకారబందురం చేసుకుంటున్న అసంతృప్తివాదులకు వీరి జీవితాలు వెలుగు బాటలు అని, తమ శక్తిని తాము తెలుసుకోలేక జీవితంలో ఇంకా ఏమీ చెయ్యలేమనే కృంగిపోతున్న నిరాశావాదులకు ఈ అతిథుల జీవితాలు స్ఫూర్తి పతాకలుఅన్నారు. కేవలం కృషి, పట్టుదల, ఆత్మస్థైర్యంమే ఆయుధాలుగా చేసుకుని జీవనపోరాటం చేస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నఈ ధీరోదాత్తుల జీవితాలు అందరికీ ఆదర్శమంటూ స్వాగతం పలికారు. ఈ అంతర్జాల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వభాషా సాంస్కృతిక శాఖముఖ్య కార్యనిర్వహణాధికారిఆర్. మల్లిఖార్జున రావు మాట్లాడుతూప్రతి నెలా వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలుగు భాషా సాహిత్య సేవలో నిమగ్నమైన తానా ప్రపంచసాహిత్యవేదికకు అభినందనలు, అంధ మేధావులతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతో ప్రత్యేకమైనది అన్నారు. విశిష్ట అతిథులుగా ఆచార్య మన్నవ సత్యనారాయణ, పూర్వ తెలుగు శాఖాధ్యక్షులు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (దుగ్గిరాల); ఆచార్య జక్కంపూడి మునిరత్నం నాయుడు,విశ్రాంతతెలుగు ఆచార్యులు, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (తిరుపతి); డా. బొల్లా జ్యోత్స్న ఫణిజ, సహాయఆచార్యులు,ఆంగ్ల భాషావిభాగం, ఢిల్లీ విశ్వవిద్యాలయం (న్యూ ఢిల్లీ); డి.వి మోహన కృష్ణ, శాస్త్రీయసంగీత విద్వాంసులు (హైదరాబాద్),షాకీర్ మొహమ్మద్, అపార జ్ఞాపకశక్తి సంపన్నులు, వ్యక్తి వికాస శిక్షకులు (హైదరాబాద్); సత్యవాడ సోదరీమణులు సత్యవాడ రఘునాథమ్మ, సత్యవాడ సూర్యకుమారి, రచయిత్రులు, గాయకురాళ్ళు (విశాఖపట్నం); డా.బెంకి రాఘవేందర్ రెడ్డి, ఉపాధ్యాయుడు (జడ్చర్ల); డా. చిక్కా హరీష్ కుమార్, రచయిత (మహబూబ్ నగర్); డా. చిన్నావుల వేంకట రాజారెడ్డి, ఉపాధ్యాయుడు (కర్నూలు); మోపూరు పెంచల నరసింహం, కవి (నెల్లూరు), పెండ్యాల గాయత్రి, ఉపాధ్యాయిని (సింగరాయకొండ); టింగిరికార్ వెంకటేశ్, వ్యాఖ్యాత, రచయిత (మహబూబ్ నగర్) పాల్గొని తెలుగు భాషపట్ల తమకున్న అపారమైన అభిమానాన్ని, వారు రచించిన కథా, కవితా సంపుటాలు,నవలల గురించి పంచుకుంటూ, వారి జీవితంలో ఎదురైన అవరోధాలను ఎదుర్కుంటున్న తీరు, తెలుగు భాషను పరిరక్షించి, పరివ్యాప్తం చేయడంలో తల్లిదండ్రులుగా, వ్యక్తులుగా, సంస్థలుగా, ప్రభుత్వ పరంగా ప్రతి ఒక్కరి భాద్యతను గుర్తుచేసి అందరికీ కనువిప్పు కల్గించారు. మనిషి తలుచుకుంటే జీవితంలో సాధించ లేనిది ఏదీ లేదు అనే నానుడికి ఈ విశిష్ట అతిథుల జీవితాలు ప్రత్యక్ష సాక్ష్యం అంటూ తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ అతిథులకు, కార్యక్రం విజయానికి తోడ్పడిన కార్యకర్తలకు, ప్రసార మాధ్యమాల నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. -
హైదరాబాద్: బ్లైండ్ స్కూల్లో విషాదం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బేగంపేటలో ఓ అంధ విద్యార్థుల స్కూల్లో విషాదం చోటుచేసుకుంది. గురువారం బిల్డింగ్ పైనుంచి పడిపోయి ఓ విద్యార్థి మృతి చెందాడు. దేవనార్ బ్లైండ్ స్కూల్లో ఈ ఘటన జరిగింది. కేర్ టేకర్ బాత్రూమ్కు వెళ్లిన సమయంలో.. లక్ష్మి గౌతమ్ శ్రీకర్(12) అనే ఆరో అంతస్థు నుంచి కిందకు పడిపోయాడు. ఈ క్రమంలో కిందపడి తీవ్ర రక్తస్రావమై మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన బేగంపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకర్ మృతి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. -
అంధుల స్కూల్లో అగ్ని ప్రమాదం.. 11 మంది దుర్మరణం
కంపాలా: అంధుల పాఠశాలలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన ఉగాండాలో జరిగింది. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి విషమంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉగాండా రాజధాని కంపాలాకు సమీప ముకోనో జిల్లాలో సలామా అంధుల రెసిడెన్షియల్ స్కూల్లో సోమవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దాంతో కంటిచూపు లేని చిన్నారులు అగ్నిలోనే ఆహుతయ్యారు. వసతి గృహంలో పిల్లలు నిద్రిస్తున్న సమయంలో మంటలు చెలరేగాయని పాఠశాల హెడ్మాస్టర్ ప్రాన్సిస్ కిరుబే తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన వారందరూ ఏడు నుంచి పదేళ్ల వయసు పిల్లలేనని.. వారి శరీరాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని మరో అధికారి వెల్లడించారు. స్కూల్ వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు అందిరిని కలిచివేశాయి. తూర్పు ఆఫ్రికా దేశమైన ఉగాండాలో స్కూల్స్లో అగ్ని ప్రమాదాలు ఇటీవల ఎక్కువైనట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కిక్కిరిసిపోయే తరగతి గదులు, విద్యుత్ కనెక్షన్లు సరిగా లేకపోవడం వంటివి అగ్ని ప్రమాదాలకు కారణమవుతున్నట్లు అధికారులు పేర్కొన్నాయి. నవంబర్, 2018లో దక్షిణ ఉగాండాలోని ఓ పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగి 11 మంది చిన్నారులు మరణించారు. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. 2006లో పశ్చిమ ఉగాండాలో ఇస్లామిక్ పాఠశాలలో 13 మంది చిన్నారులు దుర్మరణం చెందారు. ఇదీ చదవండి: ‘వరల్డ్ డర్టీ మ్యాన్’.. 67 ఏళ్ల తర్వాత స్నానం.. నెలల వ్యవధిలోనే మృతి -
ఆస్తి కోసం అంధురాలిపై హత్యాయత్నం
పెద్దపప్పూరు: ఆస్తి కోసం అంధురాలిపై సొంత తమ్ముడి భార్యే హత్యాయత్నం చేసింది. పోలీసులు తెలిపిన మేరకు... పెద్దపప్పూరు మండలం ముచ్చుకోటకు చెందిన పెద్దక్క, నాగార్జున అక్కాతమ్ముడు. పెద్దక్కకు కళ్లు కనిపించవు. ఆమె ఆస్తిపై కన్నేసిన తమ్ముడు నాగార్జున, అతని భార్య స్వాతి.. సోమవారం ఉదయం పెద్దక్కను గ్రామ శివారులోని అక్కమ్మ గుడి వద్దకు పిలుచుకెళ్లారు. ఆమె పేరున ఉన్న ఆస్తిని తన పేరున రాయాలని ఆ సమయంలో పెద్దక్కతో నాగార్జున గొడవపడ్డాడు. ఇందుకు అంగీకరించకపోవడంతో పక్కనే ఉన్న పెద్ద బండరాయిని స్వాతి తీసుకుని పెద్దక్క తలపై దాడి చేసింది. ఆ సమయంలో ఆమె కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు అప్రమత్తమై అక్కడకు చేరుకున్నారు. అప్పటికే నాగార్జున, స్వాతి పారిపోయారు. తలకు తీవ్రగాయమైన పెద్దక్కను స్థానికులు వెంటనే తాడిపత్రి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, పెద్దక్క తండ్రికి ఐదుగురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. అంధురాలైన పెద్దక్కకు పెళ్లి కాలేదు. తనకున్న నాలుగు ఎకరాల భూమిని కుమార్తెలతో పాటు కుమారుడికీ తండ్రి భాగ పరిష్కారాలు చేసిచ్చాడు. అయితే ఒంటరిగా ఉన్న పెద్దక్క ఆస్తిని ఎలాగైనా తమ పేరున రాయించుకోవాలని నాగార్జున భార్య స్వాతి ప్రయత్నించి విఫలం కావడంతో హతమార్చేందుకు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. (చదవండి: కందికుంట మా అమ్మను తిట్టినా నేను భరించా: సీఐ మధు) -
‘జెండాను తాకగానే దేశభక్తిని అనుభూతి చెందుతున్నా’
తగరపువలస (భీమిలి): ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఇండియన్ పోస్టాఫీస్ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా ఎండాడలోని ప్రభుత్వ అంధ బాలికల ఆశ్రమ పాఠశాలలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఈ నెల 12న నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల 9వ తరగతి విద్యార్థిని జాతీయ జెండా చేత పట్టుకుని పరవశించిపోయింది. మాధురి మాట్లాడుతూ ‘ఇంతకు ముందు ఆగస్టు 15న స్కూల్లో జెండా ఎగురవేసేవారు. కానీ.. ఇప్పటివరకు నేను జాతీయ జెండాను చూడలేదు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మన జెండాను తాకడం ద్వారా దేశభక్తిని అనుభూతి చెందుతున్నాను’ అని తెలిపింది. ఆమె భావాలను భారత తపాలా శాఖ సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసింది. దీనిని చూసిన కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనిని చూసిన ప్రధాని నరేంద్ర మోదీ రీట్వీట్ చేస్తూ ‘ఈ వీడియో ద్వారా ప్రతి భారతీయుడు మూడు రంగుల జెండాతో సుదీర్ఘమైన అనుబంధం కలిగి చేరువ అయినట్టు అర్థమవుతోంది’ అని పేర్కొన్నారు. మాధురిని ప్రిన్సిపాల్ ఎం.మహేశ్వరరెడ్డి అభినందించారు. మాధురి మాటలను ట్విట్టర్లో షేర్ చేసిన కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్, రీ ట్వీట్ చేసిన ప్రధాని మోదీ (ఇన్సెట్లో మాధురి) -
'బ్లైండ్'గా వచ్చేస్తున్న హీరోహీరోయిన్లు..
Upcoming Movies Of Bollywood Actors And Actresses Playing In Blind Role: చాలెంజింగ్ రోల్స్ ఒప్పుకోవాలంటే మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. నటనతో ప్రేక్షకుల మనసులను గెలుచుకోవాలి. ‘గెలుచుకుంటామనే నమ్మకం ఉంది’ అంటున్నారు కొందరు తారలు. ‘మైండ్లో ఫిక్సయితే.. బ్లైండ్గా చేస్తాం’ అంటూ అంధులుగా నటించడానికి రెడీ అయ్యారు. నటనతో తమ సత్తా చూపిస్తామంటున్నారు. ఈ స్టార్స్ చేస్తున్న చిత్రాలపై ఓ లుక్కేయండి. బిజినెస్ డీలింగ్స్తో బిజీ కానున్నారు బాలీవుడ్ హీరో రాజ్కుమార్ రావ్. ఆయన అన్ని విషయాలనూ శ్రద్ధగా వింటారు.. కానీ చూడరు. ఎందుకంటే.. బ్లైండ్. చూపు లేకపోయినా సూపర్ సక్సెస్ఫుల్ బిజినెస్మేన్. ఆంధ్ర ప్రదేశ్లోని మచిలీపట్నంలో పుట్టిన బొల్లా శ్రీకాంత్ జీవితం ఆధారంగా రూపొందనున్న చిత్రంలో శ్రీకాంత్గా రాజ్కుమార్ రావ్ నటించనున్నారు. అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బ్రెయిన్ కాగ్నిటివ్ సైన్స్లో చేరిన తొలి అంధుడిగా శ్రీకాంత్ బొల్లా రికార్డు సృష్టించిన విషయం చాలామందికి తెలుసు. అలాగే ఎంతో మంది దివ్యాంగులకు ఉపాధి కల్పించారు శ్రీకాంత్. ఈ సక్సెస్ఫుల్ మేన్ జీవితంతో దర్శకురాలు తుషార్ హిద్రానీ తెరకెక్కించనున్న ఈ చిత్రానికి టీ సిరీస్ భూషణ్ కుమార్ ఓ నిర్మాత. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఓ సీరియల్ కిల్లర్ను పట్టుకోవడానికి ఓ లేడీ పోలీసాఫీసర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ట్విస్ట్ ఏంటంటే..n ఈ పోలీసాఫీసర్ బ్లైండ్. మరి.. ఆ సీరియల్ కిల్లర్ను ఈ బ్లైండ్ పోలీసాఫీసర్ ఎలా పట్టుకున్నారు? ఆమెకు హెల్ప్ చేసింది ఎవరు? అనే అంశాలు ఆసక్తికరం. పోలీసాఫీసర్గా సోనమ్కపూర్ నటించిన చిత్రం ‘బ్లైండ్’. షోమ్ మఖీజా ఈ చిత్రానికి దర్శకుడు. 2011లో వచ్చిన సౌత్ కొరియన్ ఫిల్మ్ ‘బ్లైండ్’కు రీమేక్ ఇది. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం సోనమ్ కపూర్ ప్రెగ్నెంట్గా ఉన్నారు. ఆమె డెలివరీ తర్వాత హిందీ ‘బ్లైండ్’ చిత్రం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే కళ్లు కనబడకపోతే సాధారణ జీవితాన్ని ఎలా మేనేజ్ చేయవచ్చో తెలుసుకున్నారు తాప్సీ. హఠాత్తుగా తాప్సీ ఇలా ఎందుకు చేశారంటే.. ‘బ్లర్’ సినిమా కోసమే. 2010లో వచ్చిన స్పానిష్ థ్రిల్లర్ ‘జూలియాస్ ఐస్’ చిత్రం హిందీలో ‘బ్లర్’గా రీమేక్ అవుతోంది. ఈ చిత్రంలోనే తాప్సీ అంధురాలి పాత్ర చేస్తున్నారు. ఈ కథ నచ్చి తాప్సీ ఓ నిర్మాతగా కూడా వ్యవహరిస్తుండటం విశేషం. ఇక ఈ చిత్రకథ విషయానికి వస్తే... క్రమంగా చూపు మందగించే ఓ గృహిణి పాత్రలో తాప్సీ కనిపిస్తారు. సరిగ్గా చూపు కనిపించాలని ఓ సర్జరీ కూడా చేయించుకోవాలనుకుంటారు. కానీ ఇంతలో ఊహించని పరిణామాలు. ఆమె సోదరి హత్యకు గురవుతుంది. అయితే అప్పటికే ఆమె తన పూర్తి కంటి చూపును కోల్పోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నదే ‘బ్లర్’ చిత్రం. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇంకోవైపు అంధురాలిగా ఓ సమూహాన్నే లీడ్ చేయనున్నారు హీరోయిన్ హీనాఖాన్. హీనాతో ఉన్న సమూహంలోని అందరూ కూడా బ్లైండే. ‘ది కంట్రీ ఆఫ్ బ్లైండ్’ అనే నవల ఆధారంగా ఆమె చేస్తున్న సినిమా కథాంశం ఇది. ‘ది కంట్రీ ఆఫ్ బ్లైండ్’ టైటిల్తోనే తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ను ఇటీవల కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో రిలీజ్ చేశారు. ఈ ఇండో ఇంగ్లిష్ సినిమాకు రహత్ కజ్మీ దర్శకుడు. రాజ్కుమార్, సోనమ్, తాప్సీ, హీనా.. ఈ నలుగురూ సవాల్లాంటి పాత్రలతో బాక్సాఫీస్పై గురి పెట్టారు. ఈ సినిమాల వైపు ప్రేక్షకులు చల్లని చూపు చూస్తే ఈ స్టార్స్ కళ్లనుంచి ఆనందభాష్పాలు రావడం ఖాయం. -
అసలే వేసవి, ఆపై కంప్యూటర్ కాలం.. కళ్లు ‘కళ’ తప్పితే.. చిన్న వయసులోనే!
సాక్షి, పార్వతీపురం: కళ్లు నిత్యం తడిగా ఉంటాయి.. కంటినిండా నీరు ఉంటుంది.. ఒక విధంగా చెప్పాలంటే నేత్రాలు నిండు జలాశయాలు వంటివి. అయితే మనిషి నిర్లక్ష్యం కారణంగా కంటిలో తడి ఆరిపోతోంది. నేత్ర వ్యాధులు అధికమవుతున్నాయి. చివరకు చూపు మసకబారుతోంది. అన్ని ఇంద్రియాల్లో కంటే కన్ను చాలా విలువైనది. అందమైన ఈ ప్రపంచాన్ని చూడాలంటే కళ్లు కలకాలం చల్లాగా ఉండాలి. చూపు శాశ్వతమవ్వాలి. కానీ మనిషి దుష్ప్రవర్తన కారణంగా కంటి సమస్యలు ఏర్పడి పిన్న వయస్సులోనే అంధత్వం ఏర్పడుతోంది. మనిషి నిమిషానికి ఎనిమిది సార్లు కంటి రెప్పలు ఆర్పుతుంటాడు. అలా చేయడం ద్వారా కార్నియాకు అవసరమైన నీరు చేరి కళ్లు ఎండిపోకుండా చేస్తాయి. వేసవి ప్రయాణాల్లో వేడి గాలులకు కళ్లు తడి ఆరిపోయి దురదలు ప్రారంభమవుతున్నాయి. వేసవి ప్రయాణాల్లో కంటి రెప్పలు నిమిషానికి రెండు నుంచి మూడు సార్లు మాత్రమే కొట్టుకుంటున్నాయని వైద్యులు ఒక సర్వేలో పేర్కొన్నారు. ఫలితంగా కంటి సమస్యలు వచ్చి ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు తలనొప్పి వంటివి కూడా వస్తున్నాయని వెల్లడించారు. చదవండి👉🏼 60 నుంచి 70 శాతం కోకోతో తయారైన చాక్లెట్లు, బచ్చలి కూర తిన్నారంటే! అధిక వినియోగం ముప్పు.. ప్రస్తుతం సాంకేతికత రాజ్యమేలుతోంది. అన్ని చోట్లా కంప్యూటర్ వినియోగం పెరిగింది. ప్రతి పది మందిలో తొమ్మిది మందికి పైగా ప్రజలు మొబైల్ వినియోగిస్తున్నారు. నిత్యం కంప్యూటర్తో వర్క్ చేయడం, మొబైల్ ఆపరేటింగ్లో తలమునకలవ్వడం కారణంగా కళ్లు పొడిబారి పోతున్నాయి. ప్రస్తుతం ప్రతి 100 మందిలో 60 నుంచి 70 మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో 99 శాతం మంది కార్నియ సమస్యలకు గురవుతున్నారు. వేడిగాలుల బారిన పడడం, ఆండ్రాయిడ్, కంప్యూటర్ వినియోగించడం, రాత్రి 12 గంటల వరకు సెల్ఫోన్తో గడపడం కారణంగా ఈ సమస్య వస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. 15 నుంచి 40 ఏళ్ల మద్య ఉన్నవారే అధికంగా ఈ సమస్యకు గురవుతున్నట్లు సర్వేలు పేర్కొంటున్నాయి. చదవండి👉🏻 నోరూరించే అటుకుల కేసరి.. ఇంట్లో ఇలా సులువుగా తయారు చేసుకోండి! సాధారణ కన్ను పొడిబారిన కన్ను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ► వేసవిలో ప్రయాణించే వారు తప్పనిసరిగా కళ్లజోడు ధరించాలి. ► ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగం తగ్గించుకోవాలి. ► కంప్యూటర్ల వద్ద గంటలకొద్దీ గడపరాదు. ► కంటి రెప్పలు ఎక్కువసార్లు కొట్టుకొనే విధంగా ప్రయత్నించాలి. ► తరచూ ముఖాన్ని చల్లని నీటితో కడుక్కోవాలి. ► కంటికి దురదలు వచ్చే సమయంలో చేతితో నలపరాదు ► కళ్లు ఎర్రగా ఉంటే వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి. చదవండి👉🏾 చట్టం తనపని తాను చేసుకుపోతుంది: మంత్రి బొత్స అవగాహన తప్పనిసరి రోజురోజుకూ కంటి సమస్యలు అధిగమవుతున్నాయి. 70 శాతం మంది కంటి రోగాలతో బాధపడుతున్నారు. ఇవి చిన్నవైనప్పటికీ జాగ్రత్తలు పాటించాలి. వేసవిలో బయట ప్రయాణాలు వద్డు. ఆండ్రాయిడ్ మొబైల్ను చిన్నారులకు ఇవ్వరాదు. టీవీ, సెల్ఫోన్, కంప్యూటర్ వాడే సమయంలో అరగంట కొకసారి ప్రతి పది నిమిషాలకు ఒకసారి విరామం ఇవ్వాలి. ఏవైనా కంటి సమస్యలు వస్తే నేరుగా వైద్యులను సంప్రదించాలి. – డాక్టర్ జీరు నగేష్రెడ్డి, వైఎస్సార్ కంటి వెలుగు జిల్లా ఇన్చార్జ్, పార్వతీపురం మన్యం -
అంధులు, బధిరుల ఆశ్రమ పాఠశాలల్లో అడ్మిషన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆరు అంధులు, బధి రుల ఆశ్రమ పాఠశాలలు, ఒక జూనియర్ కళాశాలలో 462 సీట్లు అందుబాటులో ఉన్నాయని, అర్హత గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఏపీ విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకుడు బి.రవిప్రకాష్రెడ్డి తెలిపారు. మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల కోసం ఆయా పాఠశాలల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు చేసే విద్యార్థి వయసు 5 సంవత్సరాలు పైబడి ఉండాలని, ఆధార్ కార్డు, సదరం సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైజు ఫోటోలు 3 జతచేసి దరఖాస్తులు పంపాలన్నారు. ఈ పాఠశాలల్లో ఉచిత విద్యతో పాటు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్, ఉచిత భోజనం, అన్నివేళలా వైద్య సౌకర్యం, హాస్టల్ వసతి, కంప్యూటర్ శిక్షణ కల్పి స్తారన్నారు. విద్యార్థులకు బ్రెయిలీ లిపి, సాంకేతిక బాష నేర్పబడతాయన్నారు. ఖాళీలు ఇలా.. ► విజయనగరంలోని అంధుల ఆశ్రమ పాఠశాలలో 1నుంచి 8వ తరగతి వరకు 43 ఖాళీలు ఉన్నాయి. వివరాలకు 83175–48039, 94403–59775 నంబర్లకు ఫోన్ చేసి సంప్రదించవచ్చు. ► విశాఖపట్నం అంధుల పాఠశాలలో 1నుంచి 10వ తరగతి వరకు 54 ఖాళీలు ఉన్నాయి. బాలికలకు మాత్రమే. వివరాలకు ఫోన్ 94949–14959, 90144–56753 నంబర్లలో సంప్రదించాలి. ► హిందూపురం అంధుల పాఠశాలలో 1నుంచి 10వ తరగతి వరకు 106 ఖాళీలు ఉన్నాయి. వివరాలకు ఫోన్ 77022–27917, 77805–24716 నంబర్లలో సంప్రదించవచ్చు. ► విజయనగరం బధిరుల పాఠశాలలో 1నుం చి 8వ తరగతి వరకు 20 ఖాళీలు ఉన్నాయి. ప్రవేశాల కోసం ఫోన్ 90000–13640, 99638–09120 నంబర్లలో సంప్రదించాలి. ► బాపట్ల బధిరుల పాఠశాలలో 1నుంచి 10వ తరగతి వరకు 78 ఖాళీలు ఉన్నాయి. ఫోన్ 94419–43071, 99858–37919 నంబర్లలో సంప్రదించవచ్చు. ► ఒంగోలు బధిర పాఠశాలలో 1నుంచి 10వ తరగతి వరకు 136 ఖాళీలు ఉన్నాయి. వివరాలకు ఫోన్ 94404–37629, 70132–68255 నంబర్లలో సంప్రదించవచ్చు. ► బాపట్ల బధిరుల ఆశ్రమ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో బాలురు, బాలికలకు 25 ఖాళీలు ఉన్నాయి. వివరాలకు 94419–43071, 99858–37919 నంబర్లలో సంప్రదించవచ్చు. -
మద్యం మత్తులో కానిస్టేబుల్.. కళ్లులేనివారిపై కర్కశం
చెన్నై: మద్యం మత్తులో ఓ పోలీసు కానిస్టేబుల్ వీరంగం చేశాడు. రోడ్డు దిశను చూపించాలని సాయం కోరిన ఇద్దరు బ్లైడ్ వ్యక్తులతో దురుసుగా ప్రవర్తించాడు. ఈ ఘటన చైన్నైలో శనివారం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఆ పోలీసు కానిస్టేబుల్.. రోడ్డు దిశను చూపించాలని సాయం కోరిన ఇద్దరు బ్లైండ్ వ్యక్తుల వాకింగ్ స్టిక్స్ను విరిచి అనంతరం వారిపై చేయి చేసుకున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల అరుపులతో ఘటనాస్థలంలోని స్థానికులు ఆ కానిస్టేబుల్ను పట్టుకొని ట్రిప్లికేన్ పోలీసులకు అప్పగించారు. సదరు పోలీసు కానిస్టేబుల్ను జీ.దినేశ్కుమార్గా ట్రిప్లికేన్ పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తామని తెలిపారు. అయితే దినేష్ కుమార్ తాజాగా మెడికల్ లీవ్ పూర్తి చేసుకొని శనివారమే విధుల్లోకి చేరాడని పేర్కొన్నారు. ఈ ఘటన జరిగినప్పుడు కూడా సదరు కానిస్టేబుల్ పోలీసు యూనీఫామ్లో లేడని.. సివిల్ డ్రెస్లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. రోడ్డుపై అగరుబత్తులు అమ్ముకునే బ్లైండ్ వ్యక్తులపై పోలీసు కానీస్టేబుల్ దురుసుగా ప్రవర్తించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
Russia Ukraine War భాష రాక ఉక్రేనియన్ల గోస.. 7 భాషల్లో సాయం.. అంధుడికి సలాం!
ఉక్రెయిన్లో రష్యా విధ్వసం కొనసాగుతోంది. యుద్ధం మొదలై నాలుగు వారాలు పూర్తవుతున్నా.. ఉక్రెయిన్లో ప్రధాన నగరాలైన కీవ్, మరియూపోల్పై రష్యా సైన్యం విరుచుపడుతోంది. అయితే ఉక్రెయిన్ నాటో సభ్యత్వాన్ని కోరదనే విషయంపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. అయితే దానికి బదులుగా ఉక్రెయిన్ భద్రత దృష్యా రష్యా కాల్పుల విరమణ ప్రకటించి, తమ దళాలను ఉపసంహరించుకోవాలని సూచించారు. అదే విధంగా రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతోందని, మరియూపోల్లో 400 మంది ఆశ్రయం పొందుతున్న ని ఓ పాఠశాలపై బాంబులతో దాడికి తెగబడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధం కారణంగా లక్షలాది మంది ఇతర దేశాలకు వలసలు వెళుతున్నారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్ వీడిన వారి సంఖ్య ఇప్పటికే 40 లక్షలు దాటేసింది. వీరిలో సగం మంది 18 ఏళ్లు దాటని వాళ్లేనని గణాంకాలు చెప్తున్నాయి. వీరంతా తల్లులతో పాటు పోలండ్, హంగరీ, స్లొవేకియా, మాల్దోవా, రుమేనియా తదితర దేశాలకు చేరారు. కాగా కాగా సగటు ఉక్రేనియన్లు తమ భాష తప్ప మరోటి మాట్లాడరు. చాలా తక్కువ మంది ఇంగ్లిష్ అర్థం చేసుకుంటారు. మాట్లాడే వారైతే మరీ తక్కువ. స్థానికులకు కూడా చాలావరకు అటు ఇంగ్లిష్, వీరి భాష రావు. దాంతో పరాయి దేశాల్లో వారికి తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. చదవండి: ఉక్రెయిన్ ఓ శిథిల చిత్రం.. ఎవరిని కదిలించినా కన్నీటి కథలే కనీసం బస్టేషన్, రైల్వే స్టేషన్ పేర్లు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇంగ్లిష్, ఉక్రేనియన్ తెలిసిన విద్యార్ధులు, మేధావులు శిబిరాలకు వెళ్లి సాయం చేస్తున్నారు. బుడాపెస్ట్లో వాలంటీర్గా పని చేసేందుకు ముందుకొచ్చిన అంధుడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ‘‘శరణార్థుల్లో చాలామందికి మా భాష రాదు. వారికి అనువాదకునిగా సాయం చేస్తున్నా. నాకు 7 భాషలొచ్చు. వారికి ఏ భాషలో కావాలన్నా సాయం చేస్తా. చాలామందికి ఎటు పోవాలో కూడా తెలియదు. వారిని ఎన్జీవో శిబిరాలకు పంపుతున్నా. అంతా వదిలేసి కట్టుబట్టలతో, పుట్టెడు దుఃఖంతో వచ్చేవారికి భరోసా ఇవ్వడమే మనం చేసే గొప్ప సాయం!’’ అన్నాడతను. -
ఆ అటెండర్ అంధుడే.. కానీ పనిలో మాత్రం మిస్టర్ పర్ఫెక్ట్
సాక్షి,కర్నూలు (ఓల్డ్సిటీ): ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు మధు. పుట్టుకతోనే అంధుడు. కలెక్టరేట్లోని సీపీఓ కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తున్నాడు. ఇతను విధుల నిర్వహణలో పర్ఫెక్ట్ అండ్ షార్ప్. కొన్ని సందర్భాల్లో కళ్లున్న అటెండర్లు ఫైల్ ఎక్కడ పెట్టారో మర్చిపోవచ్చు కానీ మధు మాత్రం మరచిపోడు. మధు డ్యూటీలో ఉన్నాడంటే పైఅధికారులు అడిగిన తక్షణం ఫైల్ టేబుల్పై ఉంటుంది. కార్యాలయం ఉద్యోగులు ఎవరు ఏ ఫైల్ అడిగినా క్షణాల్లో అతని టేబుల్ మీదకు చేరుస్తాడు. కళ్లు కనబడని వ్యక్తి విధులు ఎలా నిర్వర్తిస్తారని పలువురు ఆశ్చర్యపడుతున్నారు. కళ్లు కనిపించని వారికి మనోనేత్రం ఉంటుందనడానికి మధుయే సమాధానం. ఏది ఏమైనా సకలాంగులు చేయలేని పని మధు చేస్తున్నందున అతనికి పలువురు హాట్సాప్ చెబుతుండటం విశేషం. చదవండి: ఎందరికో ఆదర్శం ఈ పట్టభద్రుడు
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement