పరిశుభ్రత విషయంలో దేశంలోనే ఉత్తమ రైల్వేస్టేషన్గా విశాఖపట్నం రైల్వేస్టేషన్ నిలిచింది. దాని తర్వాతి స్థానంలో సికింద్రాబాద్ ఉంది. దేశంలో అత్యంత రద్దీగా ఉండే మొత్తం 75 స్టేషన్లను తీసుకుని వాటిలో సర్వే చేసినప్పుడు.. క్లీనెస్ట్ స్టేషన్గా విశాఖ నిలిస్తే, అత్యంత మురిగ్గా ఉండే స్టేషన్గా బిహార్లోని దర్భాంగా నిలిచింది. ఈ సర్వే వివరాలను రైల్వే మంత్రి సురేష్ ప్రభు వెల్లడించారు. దేశ రాజధానిలోని న్యూఢిల్లీ స్టేషన్కు ఈ జాబితాలో 39వ ర్యాంకు లభించింది. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ సర్వే చేసింది. ప్లాట్ఫాంల మీద ఉన్న టాయిలెట్ల శుభ్రత, ట్రాకులు పరిశుభ్రంగా ఉండటం, స్టేషన్లలోని డస్ట్బిన్లు తదితర అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ప్రతి స్టేషన్కు పరిశుభ్రత విషయంలో మార్కులు వేశారు.
స్వచ్ఛ రైలు ప్రచారంలో భాగంగా రైల్వే స్టేషన్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్న ప్రయత్నంలో భాగంగా రైల్వేశాఖ ఈ తరహా సర్వే చేయించడం ఇది మూడోసారి. గతంతో పోలిస్తే ఈసారి చాలావరకు రైల్వేస్టేషన్లు శుభ్రత విషయంలో తమ ర్యాంకులు మెరుగుపరుచుకున్నాయని సురేష్ ప్రభు చెప్పారు. ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహించే వారణాసి రైల్వే స్టేషన్కు ఈ సర్వేలో 14వ ర్యాంకు లభించింది. మొత్తం 407 స్టేషన్లలో సర్వే చేయగా వాటిలో 75 ఏ-1 కేటగిరీ స్టేషన్లు లేదా బాగా రద్దీగా ఉండే స్టేషన్లు. 332 ఏ కేటగిరీలో ఉన్నాయి. ఆ విభాగంలో పంజాబ్లోని బియాస్ స్టేషన్కు మొదటి ర్యాంకు, తెలంగాణలోని ఖమ్మం స్టేషన్కు రెండో ర్యాంకు, అహ్మద్నగర్ స్టేషన్కు మూడో ర్యాంకు వచ్చాయి. ఈ కేటగిరీలో జోగ్బని స్టేషన్ చివరి స్థానంలో నిలిచింది.
దేశంలో విశాఖ స్టేషన్ బెస్ట్, సికింద్రాబాద్ నెంబర్ 2
Published Wed, May 17 2017 6:45 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement