- అరకు ఎంపీ గీత సమక్షంలోనే వార్నింగ్లు..?
- అర్ధరాత్రి వేళ హైరానాపడ్డ రెవెన్యూ అధికారులు
- భద్రాచలంలో కేసు నమోదు
భద్రాచలం: తమకు అనుకూలంగా పనులు చేయటం లేదని తహసీల్దార్పై తెలుగు తమ్ముళ్లు చిందులు తొక్కారు. ప్రజా ప్రతినిధికి సహాయకారిగా ప్రభుత్వం ద్వారా నియమితులైన వ్యక్తిగత కార్యదర్శి పచ్చ కండువా కప్పుకున్నట్లు వారికి వంత పాడుతూ తహసీల్దార్ను కొట్టాలంటూ ప్రేరేపించారు. ఏపీ టీడీపీ ఎంపీ సమక్షం లోనే ఈ వ్యవహారమంతా జరిగింది. తనను ఎంపీ కొత్తపల్లి గీత తీవ్రంగా దుర్భాష లాడారని, ఆమె వ్యక్తి గత కార్యదర్శి గొల్లా ప్రదీప్రాజు రాయడానికి వీల్లేని పదాలతో దూషించాడని తహసీల్దార్ వంగలపూడి చిట్టిబాబు మంగళవారం భద్రాచలం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
తహసీల్దార్ చిట్టిబాబు కథనం ప్రకారం.. విలీన మండలాల్లోని చింతూరులో అధికారిక పర్యటనలో భాగంగా అరకు ఎంపీ కొత్తపల్లి గీత తన అనుచరులతో సోమవారం రాత్రి భద్రాచలం వచ్చారు. ఎంపీతోపాటు అనుచరులు కూడా వస్తున్నందున భద్రా చలంలో అతిథి గృహం ఏర్పాటు చేయాలని ఎటపాక(ఆంధ్రప్రదేశ్) రెవెన్యూ అధికారు లకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎటపాక తహసీల్దార్ భద్రాచలం(తెలంగాణ) ఐటీడీఏ సమీపంలోని హౌసింగ్ అతిథి గృహం ఏర్పాటు చేశారు. ఇది ఎంపీతోపాటు ఆమె అనుచరులకు నచ్చకపోవటంతో ప్రైవేటు లాడ్జిలో అనుచరులకు సరిపడా గదులు ఏర్పాటు చేయాలని తహసీల్దార్పై ఒత్తిడి చేశారు. వారి సూచన మేరకు తహసీల్దార్ చిట్టిబాబు పట్టణంలోని ప్రైవేటు లాడ్జిలో గదులు ఏర్పాటు చేసేలోగానే ఎంపీ వర్గీ యులు దత్త రెసిడెన్సీకి వెళ్లి అక్కడ బస చేశారు.
ఎంపీ సైతం అదే లాడ్జిలో బస చేసినట్లు తహసీల్దార్ తెలిపారు. భోజనాలు ముగిసిన తర్వాత రాత్రి 9.30 నుంచి 10 గంటల సమయంలో తహసీల్దార్ను వారు ఉన్న లాడ్జికి పిలిపించుకున్నారు. ఎటపాక మండల టీడీపీ నాయకుడి ఫిర్యాదులతో రెచ్చిపోయిన ఎంపీ వ్యక్తిగత కార్యదర్శి గొల్లా ప్రదీప్రాజు తనను గదిలో నిర్బంధించి, అక్కడున్న టీడీపీ నాయకులను తనపై దాడికి ఉసిగొల్పినట్లు తహసీల్దార్ చిట్టిబాబు పోలీ సులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మెడపట్టి గది బయటకు గెంటేశారని పీఏతోపాటు అక్కడున్న ఎంపీ అనుచరులు సైతం దుర్భాషలాడారని తెలిపారు. గదిలో పెట్టి కొట్టాలంటూ ఇస్టానుసారంగా తనను దూషించారని తహసీల్దార్ విలేకరుల ముందు కంటతడిపెట్టారు. తీవ్ర మనోవేదనకు గురైన తహసీల్దార్ చిట్టిబాబు తనపై ఎంపీ పీఏ, అతడి అనుచరులు చేసిన దాడి గురించి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, రంపచోడవరం ఐటీడీఏ పీవో, పోలీస్ అధికారులకు తెలియజేశారు. అనంతరం భద్రాచలం ఎస్సై కరుణాకర్కు ఫిర్యాదు అందజేశారు. తహసీల్దార్ ఫిర్యాదుతో ఎంపీ గీత వ్యక్తిగత కార్యదర్శి ప్రదీప్రాజుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తహసీల్దార్పై టీడీపీ ఎంపీ పీఏ చిందులు
Published Wed, May 24 2017 3:49 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement