మాంచెస్టర్: యూకేలోని ప్రఖ్యాత పారిశ్రామిక నగరం మాంచెస్టర్లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. ఇంగ్లాండ్లో అతిపెద్ద ఈవెంట్ హబ్గా పేరుపొందిన మాంచెస్టర్ ఎరీనాలో భారీ పేలుడుకు పాల్పడ్డారు. స్టానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10:35కు చోటుచేసుకున్న దాడిలో 20 మంది చనిపోగా, 50 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఎరీనాలో అమెరికన్ పాప్ సింగర్ అరియానా గ్రాండే షో ముగియగానే.. సీట్లలో నుంచి లేచిన జనం గుంపులు గుంపులుగా ద్వారాల వద్దకు చేరుకున్నారు.. సరిగ్గా అదే సమయంలో ఒక ద్వారం వద్ద భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. దీంతో భీతిల్లిపోయిన జనం.. పరుగులు తీశారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. ప్రాణభయంతో చిన్నారులు అరుస్తుండటం వీడియోల్లో రికార్డయింది. మాంచెస్టర్ మారణకాండ ముమ్మాటికీ ఉగ్రవాదుల పనేనని ఇంగ్లాండ్ పోలీసులు ప్రకటించారు. పేలుడు నేపథ్యంలో యూకే వ్యాప్తంగా అత్యయిక పరిస్థితిని ప్రకటించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ మాంచెస్టర్ దాడిని ఖండించారు. ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ప్రగాఢసానుభూతి తెలిపారు.
ఐసిస్ను తక్కువగా అంచనావేశారా?
గడిచిన కొద్ది నెలలుగా సైలెంట్గా ఉన్న ఐసిస్.. అదనుచూసి పంజా విసిరింది. సిరియా, ఇరాక్లోని ఐసిస్ ప్రాబల్య ప్రాంతాలపై యూఎస్, రష్యా, సిరియా, ఇరాక్ సైన్యాలు ఎడతెరిపిలేకుండా జరుపుతున్న దాడులతో కొద్దిగా వెనక్కి తగ్గిన రాక్షసమూక.. మాంచెస్టర్ దాడితో మళ్లీ తన ఉనికిని చాటుకుంది. అమెరికాలో దాడులు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో కొన్నేళ్ల కిందటే యూరప్ను టార్గెట్ చేసిన ఐసిస్ భారీ విధ్వంసాలకు కుట్రపన్నింది. ఫ్రాన్స్లోని నీస్ నగరంలో ట్రక్కుదాడి, బ్రసెల్స్లో పేలుళ్లు తమపనేనని గర్వంగా ప్రకటించుకుంది. కొద్ది రోజుల కిందట ఏకంగా యూకే పార్లమెంట్ భవనంపైనే దాడికి తెగబడటం, ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే.
అయితే, చిన్నచిన్న దాడులు తప్ప భారీ విధ్వంసం చేయలేదని ఐసిస్ పట్ల ఇంగ్లాండ్ భద్రతా బలగాలు వేసిన అంచనాలు తప్పని భారీ మూల్యం చెల్లించుకున్నాకగానీ తెలిసిరాలేదు. 21వేల మంది ప్రేక్షకులు హాజరైన ఈవెంట్లో ఉగ్రవాదులు సులువుగా పేలుళ్లకు పాల్పడటం.. భద్రతా బలగాల పనితీరుపై అనుమానాలకు తావిస్తోంది. మాంచెస్టర్ ఎరీనాలో పేలుడుకు ఉపయోగించిన 'నెయిల్ బాంబు'ను ఉగ్రవాదులు ఎలా తీసుకెళ్లారు? చెక్ పాయింట్లను ఎలా బురిడీకొట్టించారు? అనే ప్రశ్నలకు జవాబులు తెలిస్తే భద్రతా బలగాల వైఫల్యం బట్టబయలవుతుంది.
మాంచెస్టర్ మారణకాండ: భారీ మూల్యం!
Published Tue, May 23 2017 9:04 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ
డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.
కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు
జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది
నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!
శోభిత పోస్ట్.. సమంత స్టైలిష్ట్ రిప్లై
ముంబై ఎయిర్పోర్టులో 12 కోట్ల విలువైన బంగారం, ఐఫోన్లు సీజ్
ఎన్నికల వేళ కలకలం.. బీజేపీ మంత్రిని చంపేస్తామని బెదిరింపులు!
సంజయ్లీలా భన్సాలీ 'హీరామండి' వెబ్ సిరీస్ ఎలా ఉంది..?
నాడు మోదీకి వంట వండిన దీపక్.. ఇప్పుడేం చేస్తున్నారు?
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement